Political News

లబ్దిదారుల క్షేమం గురించి ప్రభుత్వానికి పట్టదా ?

ప్రభుత్వానికి మంకుపట్టు ఉండుకూడదు. అధికారంలో ఉన్నాం కాబట్టి తాము ఏమి చేసినా చెల్లుబాటైపోతుందని అనుకుంటే అంతిమంగా నష్టపోయేది ప్రజలే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రభుత్వం అమలు చేయాలని అనుకున్న సంక్షేమ పథకాల్లో లోపాలున్నాయని ప్రతిపక్షాలు చెప్పినపుడు వాస్తవాలు ఏమిటో ఆలోచించాలి. అంతేకానీ ప్రతిపక్షాలు చెప్పినట్లుగా ఎందుకు చేయాలనే మంకుపట్టు ఉండకూడదు. అలా కాదని మొండిగా తాను అనుకున్నదే చేసుకుపోతానంటే అంతిమంగా నష్టపోయేది లబ్దిదారులే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

ఇంతకీ విషయం ఏమిటంటే తొందరలోనే ప్రభుత్వం వేలాది ఇళ్ళ స్ధలాలు పంపిణి చేయాలని డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెద్దఎత్తున స్ధలాలు సేకరించింది. ఇంటి పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం 23,377 ఎకరాలను సేకరించింది. ఇందుకోసం ప్రభుత్వం సుమారుగా రూ 7 వేల కోట్లు ఖర్చు పెట్టింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 5548 ఎకరాలను రూ. 1628 కోట్లతో సేకరించింది. చాలా చోట్ల ప్రైవేటు భూములను ప్రభుత్వం కొనుగోలు చేసి మరీ ప్లాట్లు వేసింది.

అయితే ఇక్కడే సమస్య మొదలైంది. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వం సేకరించిన ప్రాంతాల్లో భూమి నివాసయోగ్యం కావంటు ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి. ఎందుకంటే అవన్నీ వర్షాలకు నీరు నిల్వుండే ప్రాంతాలు కాబట్టి అక్కడ ఇళ్ళు కట్టినా లబ్దిదారులు ఇబ్బందులు పడతారంటు నెత్తీ నోరు మొత్తుకుంటున్నాయి. ఉభయగోదావరి జిల్లాలతో పాటు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ప్రభుత్వం సేకరించిన వేలాది ఎకరాల్లో ఇళ్ళ నిర్మాణాలు చేసినా లబ్దిదారులు ఉండలేరని చంద్రబాబునాయుడు, సోమువీర్రాజుతో పాటు ఇతర నేతలు గట్టిగా చెబుతున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, తుపాన్ల కారణంగా చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే వర్షాలు, తుపాను ప్రభావం తగ్గగానే చాలా చోట్ల నీరింకిపోయింది. కానీ కొన్నిచోట్ల మాత్రం ప్రభుత్వం సేకరించిన భూముల్లో నీరు ఇంకా నిల్వ ఉందట. కాకినాడ దగ్గర ఆవభూములే ఇందుకు నిదర్శనంగా ప్రతిపక్షాలు చూపుతున్నాయి. ప్రైవేటు భూములు సేకరించేటపుడు అధికారపార్టీ నేతలు భారీగా లబ్దిపొందారనే ఆరోపణలను కూడా టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

నిజానికి ప్రతిపక్షాల ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరపించాలి. కనీసం వాళ్ళ ఆరోపణల్లో వాస్తవం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా పట్టించుకోకపోతే ఎలా ? నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో ప్రభుత్వం ఇళ్ళ స్ధలాలు ఇచ్చికూడా ఉపయోగం లేనపుడు ఇక ఇవ్వటం ఎందుకు ? భారీ వర్షాలు తగ్గి రోజులు గడుస్తున్నా ఇంకా కొన్నొచోట్ల నీరు అలాగే నిల్వ ఉండిపోయిందంటే అవి ఎప్పటికీ నివాసయోగ్యం కావని అర్ధమైపోతోంది. కాబట్టి మంకు పట్టుకుపోకుండా ప్రతిపక్షాలు చెబుతున్న మాటలను కాస్త ప్రభుత్వం వింటేనే వేల కోట్ల రూపాయల ఖర్చుకు సార్దకత వస్తుంది. లేకపోతే అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలే నిజమని నిర్ధారణయినట్లే అనుకోవల్సుంటుంది.

This post was last modified on November 11, 2020 7:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

1 hour ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

2 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

3 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

3 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

3 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

5 hours ago