Political News

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి త‌గ్గ‌ని హ‌వా.. దూకుడు లేని వైసీపీ నేత

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీలో కీల‌క‌మైన నాయ‌కుడిని ఓడించిన వైసీపీ యువ నేత‌, ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు.. దూకుడు చూపించ‌లేక పోవ‌డంతో.. స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత హ‌వా.. య‌థాత‌థంగా కొన‌సాగుతుండ‌డం గ‌మనార్హం. ముఖ్యంగా రైతులు, కార్మికులు ఆయ‌న చుట్టూనే తిరుగుతున్నారు. దీంతో స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారాయి. విష‌యంలోకి వెళ్తే.. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు. ఇక్క‌డ నుంచి టీడీపీ నాయ‌కుడు, క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ చౌద‌రి వ‌రుస విజ‌యాలు సాధించారు. నిత్యం మీడియాలో ఉండే ఆయ‌న వివాదాల‌కు కేరాఫ్‌గా మారిన విష‌యం తెలిసిందే.

2014, 2009 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన చింత‌మ‌నేని.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. దీనికి ఆయ‌న వివాదాస్ప‌ద వైఖ‌రే కార‌ణ‌మ‌నే విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే వైసీపీ త‌ర‌ఫున కొఠారు అబ్బ‌య్య చౌద‌రి ఇక్క‌డ విజ‌యం సాధించారు. యువ నాయ‌కుడు, విదేశాల్లో విద్య చ‌దువుకుని ఉండ‌డం, దూర‌దృష్టి గ‌త నాయ‌కుడిగా పేరు తెచ్చుకోవ‌డం, నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల‌కు ముందు పాద‌యాత్ర చేయ‌డం, రైతుల‌కు అన్ని విధాలా మేలు చేస్తాన‌ని హామీ ఇవ్వ‌డం వంటి ప‌రిణామాల‌తో ఆయ‌న‌పై ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆశ‌లు పెట్టుకుని గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌భాక‌ర్‌ను ప‌క్క‌న పెట్టారు. ఎన్నిక‌లు ముగిసి ఏడాదిన్న‌ర అయిపోయింది.

అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు అబ్బ‌య్య చౌద‌రి.. నియోజ‌క‌వ‌ర్గంలో వీస‌మెత్తు అభివృద్ధి ప‌నులు కూడా చేయ‌లేద‌నే టాక్ స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ప్ర‌ధానంగా ప‌ట్టిసీమ ప్రాజెక్టు నుంచి ఇక్క‌డి పొలాల‌కు నీటిని త‌ర‌లించేందుకు గ‌తంలో చింత‌మ‌నేని త‌వ్వించిన క‌న్న‌స‌ముద్రం చెరువు మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. దీనిని పూర్తి చేయించ‌డం ద్వారా స్థానిక రైతుల‌కు నీరు అందించే అవ‌కాశం ఉంది. కానీ, ఎమ్మెల్యే అబ్బ‌య్య చౌద‌రి మాత్రం దీనిని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక‌, ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వ‌ర‌కు డ‌బుల్ రోడ్డు వేయ‌డంతోపాటు ప్ర‌ధాన ర‌హ‌దారుల విస్త‌ర‌ణ విష‌యంలోనూ ఎమ్మెల్యే నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

ఇక‌, స్థానిక స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలోనూ అబ్బ‌య్య ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. త‌మ వారు కాని వార‌నే గీత గీసుకుని.. వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని రైతులు మ‌ధ‌న ప‌డుతున్నారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు విష‌యంలోనూ ఎమ్మెల్యే కొంద‌రికే ప్రాధాన్యం ఇస్తున్నార‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ‌. దీంతో చింత‌మ‌నేని అయితే బాగుండేద‌ని, క‌నీసం ఆయ‌న చేప‌ట్టిన ప‌నులైనా పూర్త‌య్యేవ‌ని ఇక్క‌డ రైతులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ ప‌రిణామాల‌తో స్థానిక ఎమ్మెల్యేకు మార్కులు త‌గ్గ‌డంతోపాటు.. చింత‌మ‌నేని మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. సింప‌తీ పెరుగుతుండడం గ‌మ‌నార్హం. ఇదే కొన‌సాగితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఏక‌ప‌క్షంగా గెలిచినా.. ఆశ్చ‌ర్య పోన‌వ‌స‌రం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on November 11, 2020 6:55 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

3 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

3 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

3 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

5 hours ago