Political News

‘కుప్పం’ ఘటనపై కఠిన చర్యలకు బాబు, అనిత ఆదేశం

అప్పు తీర్చలేదన్న కారణంగా ఓ మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన ఏపీలో పెను కలకలమే రేపింది. ఈ ఘటన సాక్షాత్తు టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో జరగడంతో ఈ ఘటనకు చెందిన వీడియోలు మరింత వైరల్ గా మారాయి. అయితే చంద్రబాబుతో పాటు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత కూడా వేగంగా స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన వారిద్దరూ నిందితులపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.

కుప్పం మండలం నారాయణాపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప, శిరీష దంపతులు అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద కొంతకాలం క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నారు. ఆ తర్వాత అప్పు తీర్చడం సాధ్యం కాక తిమ్మరాయప్ప తన కుటుంబాన్ని వదిలి పారిపోయాడు. ఆ తర్వాత శిరీష తన కుమారుడితో కలిసి బెంగళూరు వెళ్లి తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ దినసరి కూలీగా జీవనం సాగిస్తోంది. అయితే కుమారుడి స్టడీ సర్టిఫికెట్ అవసరమై ఆమె కుమారుడితో కలిసి గ్రామానికి రాగా… మునికన్నప్ప, ఆయన కుటుంబ సభ్యులు ఆమెను చెట్టుకు కట్టేసి హింసించారు.

ఈ ఘటనపై స్థానికుల సమాచారంతో కుప్పం పోలీసులు రంగంలోకి దిగి శిరీషను ఆసుపత్రికి తరలించారు. మునికన్నప్ప కుటుంబంపై కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే చంద్రబాబు సీరియస్ అయ్యారు. వెనువెంటనే ఆయన చిత్తూరు జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు. మహిళను వేధించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడులకు లొంగొద్దంటూ సూచించారు.

ఇక ఈ విషయంపై స్పందించిన హోం మంత్రి అనిత నేరుగా బాధితురాలు శిరీషతో ఫోన్ లో మాట్లాడారు. భయపడాల్సిన పని లేదని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఆమెకు భరోసా ఇచ్చారు. దాడికి దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అనిత హామీ ఇచ్చారు. ఇటు సీఎం, అటు హోం మంత్రి స్పందనలతో కుప్పం పోలీసులు మునికన్నప్ప కుటుంబ సభ్యులపై ఏకంగా హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి మునికన్నప్ప, ఆయన భార్య, ఆయన కుమారుడు, కోడలును అరెస్టు చేశారు.

This post was last modified on June 17, 2025 3:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

5 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

8 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

10 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago