వైసీపీ కీలక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని బెంగళూరులో విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారు. ఆయనను తిరిగి ఏపీకి పంపించారు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులు నిర్ధారించారు. బెంగళూరు నుంచి శ్రీలంక రాజధాని కొలంబో వెళ్లే విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్ సమయంలో చెవిరెడ్డిని విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారని చెప్పారు. ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో చెవిరెడ్డిపై కూడా.. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా రు. ఈ క్రమంలో కొన్నాళ్ల కిందటే.. ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకు ఈ నోటీసులు పంపించారు. ఈ క్రమంలో చెవిరెడ్డిని బెంగళూరు విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీకి తరలించారు. అయితే.. దీనిపై చెవిరెడ్డి ఎలాంటి కామెంట్ చేయలేదు.
మరోవైపు.. చెవిరెడ్డి భాస్కరరెడ్డి గన్మెన్ మదన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ కేసులో విచారణ పేరుతో.. సిట్ అధికారులు తనపై దాడి చేశారని, తీవ్రంగా కొట్టారని మదన్ పిటిషన్లో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. తాము చెప్పినట్టే స్టేట్మెంట్ ఇవ్వాలంటూ తనపై ఒత్తిడి చేశారన్న మదన్.. సిట్ అధికారుల తీరుపై హైకోర్టు పర్యవేక్షించాలని కోరారు. తన విచారణకు న్యాయవాదిని అనుమతించాలని కోరిన మదన్… తన ప్రాణాలకు కూడా భద్రత కల్పించాలని విన్నవించారు.
This post was last modified on June 17, 2025 1:40 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…