Political News

ఢిల్లీకి లోకేష్.. రీజ‌నేంటి?

ఏపీ మంత్రి నారా లోకేష్ మ‌రోసారి ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. గ‌త నెల‌లో ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ప్ర‌ధాని మోడీని కుటుంబ స‌మేతంగా క‌లుసుకున్నారు. ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను కూడా క‌లుసుకున్నారు. ఏపీలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను వివ‌రించారు. ఇప్పుడు మ‌రోసారి నారా లోకేష్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు రెడీ అయ్యారు. బుధ‌, గురువారాల్లో ఆయ‌న ఢిల్లీలో ప‌ర్య‌టించ‌నున్నారు. దీంతో ఇప్పుడు ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన విశేషం ఏంట‌నేది ఆస‌క్తిగా మారింది.

తాజాగా ఈ నెల 21న ఏపీ అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వానికి ఆతిధ్యం ఇస్తోంది. దీనిని భారీ ఎత్తున నిర్వ‌హించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మంగ‌ళ‌వారం విశాఖ‌లోనే ఉండి.. దీనికి సంబంధించిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. ప్ర‌పంచ రికార్డు సృష్టించేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మానికి మ‌రింత ప్రాధాన్యం పెరిగింది.

ఇదిలావుంటే.. ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను కూడా ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించాల‌ని తాజాగా సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో ఆ కార్య‌క్ర‌మాన్ని మంత్రి నారా లోకేష్‌కు అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. ఆహ్వాన ప‌త్రిక‌ల‌ను తీసుకుని ఢిల్లీ వెళ్లి.. ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను నారా లోకేష్ ఆహ్వానించ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. అయితే.. దీనిపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. మ‌రోవైపు.. రాష్ట్రంలో పొగాకు స‌హా.. ఇత‌ర వ్య‌వ‌సాయ పంటల కొనుగోలు, విక్ర‌యాల‌కు సంబంధించి కూడా.. కేంద్రంతో ఆయ‌న చ‌ర్చించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో అధికారులు కూడా నారా లోకేష్ వెంట ఉండ‌నున్నారు.

Satya

Recent Posts

రీ-నీట్… ఇంత చేసినా మళ్లీ సందేహాలు, ప్రశ్నలు!?

రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…

17 minutes ago

పుట్టినరోజు సంబరం… జన నాయకుడి మౌనం

ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…

30 minutes ago

రజినీకి నచ్చనిది కమల్‌కు నచ్చిందా?

తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…

1 hour ago

కాపులంటే వైసీపీలో ఉన్నొళ్లు మాత్రమేనా?

ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…

1 hour ago

సాయిపల్లవి చేసుంటే ఎలా ఉండేది

మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…

3 hours ago

తమిళ నటుడికి పిచ్చెక్కించేసిన కంచరపాలెం

స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్‌కు మంచి గుర్తింపే ఉంది.…

4 hours ago