Political News

నాడు ఏం చేశారో మ‌రిచిపోతే ఎలా జ‌గ‌న్‌?: టీడీపీ

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. బుధ‌వారం గుంటూరు జిల్లా ప‌ల్నాడులో ప‌ర్య‌టించేందుకు రెడీ అయ్యారు. ఇక్క‌డి స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు అనే పార్టీ కార్య‌క‌ర్త కుటుంబాన్ని ఆయ‌న ప‌రామ‌ర్శించనున్నారు. 2024లో ప్ర‌భుత్వం మారిన త‌ర్వాత‌.. జ‌గ‌న్ ఓట‌మిని త‌ట్టుకోలేక‌.. స‌ద‌రు నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. అప్ప‌టి నుంచి జ‌గ‌న్ త‌మ ఫ్యామిలీని ఆదుకోవాల‌ని బాధిత కుటుంబం కోరుతోంది. ఎట్ట‌కేల‌కు జ‌గ‌న్ ముందుకు వ‌చ్చారు.

నాగ‌మ‌ల్లేశ్వ‌రరావు విగ్ర‌హాన్ని కూడా ఆయ‌న ఆవిష్క‌రించ‌నున్నారు. అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి ప‌ల్నాడు ఎస్పీ అనుమ‌తి ఇవ్వ‌లేదు. అనుమ‌తి ఇవ్వాల‌ని వైసీపీ నాయ‌కులు కోరారు. అయితే.. తాజాగా ప్ర‌కాశం జిల్లా పొదిలిలో జ‌గ‌న్ ప‌ర్య‌టించిన‌ప్పుడు.. తీవ్ర అల‌జ‌డి ఏర్ప‌డింది. దీనిని కంట్రోల్ చేయ‌లేక పోలీసులు ఇబ్బందులు ప‌డ్డారు. ఇక‌, ఇప్పుడు కూడా.. అదే పరిస్థితి ఎదుర‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్న పోలీసులు.. ఈ కార్య‌క్ర‌మానికి ఇప్ప‌టి వ‌ర‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు.

అయితే.. మ‌ధ్యే మార్గంగా 100 మందితో వ‌స్తే.. ఓకే అని చెప్పారు.కానీ, వైసీపీ మాత్రం 30 వేల మంది వ‌స్తార‌ని.. అస‌లు జ‌గ‌న్ బ‌య‌టకు వ‌చ్చాక‌.. ఎంత మంది వ‌స్తారో కూడా చెప్ప‌లేమ‌ని పేర్కొంది. దీంతో పోలీసులు ఈ వ్య‌వ‌హారాన్ని ప‌క్క‌న పెట్టారు. మ‌రోవైపు త‌మ నాయ‌కుడు ప్ర‌జ‌ల్లోకి వ‌స్తే.. అనుమ‌తి ఇవ్వ‌డం లేదంటూ.. పోలీసుల‌పై వైసీపీ నాయ‌కులు నిప్పులు చెరుగుతున్నారు. ఇదిలావుంటే.. టీడీపీ నాయ‌కులు గ‌తాన్ని గుర్తు చేస్తున్నారు.

యువ‌గ‌ళం పాద‌యాత్ర స‌మ‌యంలో నారా లోకేష్‌కు అనుమ‌తులు ఇవ్వ‌కుండా ఎలా అడ్డుకున్నారో చూడండి! అంటూ.. కొన్ని పాత వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంటున్నారు. అదేవిధంగా చంద్ర‌బాబు అప్ప‌ట్లో చేప‌ట్టి కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి కూడా.. అనుమ‌తులు ఇవ్వ‌ని విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా అంగ‌ళ్లు ప్రాంతంలో జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోల‌ను కూడా ప్లే చేస్తున్నారు. సో.. ఇవ‌న్నీ.. జ‌గ‌న్ మ‌రిచిపోయారా? అని టీడీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.

This post was last modified on June 17, 2025 12:22 pm

Share

Recent Posts

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

22 minutes ago

ఒత్తిడి బండి మీద ‘రణబాలి’ ప్రయాణం

ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…

25 minutes ago

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

2 hours ago

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

5 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

5 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

6 hours ago