Political News

నాడు ఏం చేశారో మ‌రిచిపోతే ఎలా జ‌గ‌న్‌?: టీడీపీ

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. బుధ‌వారం గుంటూరు జిల్లా ప‌ల్నాడులో ప‌ర్య‌టించేందుకు రెడీ అయ్యారు. ఇక్క‌డి స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు అనే పార్టీ కార్య‌క‌ర్త కుటుంబాన్ని ఆయ‌న ప‌రామ‌ర్శించనున్నారు. 2024లో ప్ర‌భుత్వం మారిన త‌ర్వాత‌.. జ‌గ‌న్ ఓట‌మిని త‌ట్టుకోలేక‌.. స‌ద‌రు నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. అప్ప‌టి నుంచి జ‌గ‌న్ త‌మ ఫ్యామిలీని ఆదుకోవాల‌ని బాధిత కుటుంబం కోరుతోంది. ఎట్ట‌కేల‌కు జ‌గ‌న్ ముందుకు వ‌చ్చారు.

నాగ‌మ‌ల్లేశ్వ‌రరావు విగ్ర‌హాన్ని కూడా ఆయ‌న ఆవిష్క‌రించ‌నున్నారు. అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి ప‌ల్నాడు ఎస్పీ అనుమ‌తి ఇవ్వ‌లేదు. అనుమ‌తి ఇవ్వాల‌ని వైసీపీ నాయ‌కులు కోరారు. అయితే.. తాజాగా ప్ర‌కాశం జిల్లా పొదిలిలో జ‌గ‌న్ ప‌ర్య‌టించిన‌ప్పుడు.. తీవ్ర అల‌జ‌డి ఏర్ప‌డింది. దీనిని కంట్రోల్ చేయ‌లేక పోలీసులు ఇబ్బందులు ప‌డ్డారు. ఇక‌, ఇప్పుడు కూడా.. అదే పరిస్థితి ఎదుర‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్న పోలీసులు.. ఈ కార్య‌క్ర‌మానికి ఇప్ప‌టి వ‌ర‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు.

అయితే.. మ‌ధ్యే మార్గంగా 100 మందితో వ‌స్తే.. ఓకే అని చెప్పారు.కానీ, వైసీపీ మాత్రం 30 వేల మంది వ‌స్తార‌ని.. అస‌లు జ‌గ‌న్ బ‌య‌టకు వ‌చ్చాక‌.. ఎంత మంది వ‌స్తారో కూడా చెప్ప‌లేమ‌ని పేర్కొంది. దీంతో పోలీసులు ఈ వ్య‌వ‌హారాన్ని ప‌క్క‌న పెట్టారు. మ‌రోవైపు త‌మ నాయ‌కుడు ప్ర‌జ‌ల్లోకి వ‌స్తే.. అనుమ‌తి ఇవ్వ‌డం లేదంటూ.. పోలీసుల‌పై వైసీపీ నాయ‌కులు నిప్పులు చెరుగుతున్నారు. ఇదిలావుంటే.. టీడీపీ నాయ‌కులు గ‌తాన్ని గుర్తు చేస్తున్నారు.

యువ‌గ‌ళం పాద‌యాత్ర స‌మ‌యంలో నారా లోకేష్‌కు అనుమ‌తులు ఇవ్వ‌కుండా ఎలా అడ్డుకున్నారో చూడండి! అంటూ.. కొన్ని పాత వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంటున్నారు. అదేవిధంగా చంద్ర‌బాబు అప్ప‌ట్లో చేప‌ట్టి కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి కూడా.. అనుమ‌తులు ఇవ్వ‌ని విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా అంగ‌ళ్లు ప్రాంతంలో జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోల‌ను కూడా ప్లే చేస్తున్నారు. సో.. ఇవ‌న్నీ.. జ‌గ‌న్ మ‌రిచిపోయారా? అని టీడీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.

This post was last modified on June 17, 2025 12:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

2 hours ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

3 hours ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

6 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

6 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

7 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

7 hours ago