ఫార్ములా ఈ కారు రేసుల వ్యవహారంలో ఏసీబీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును అధికారులు ఏకంగా 9 గంటల పాటు విచారించారు. ఉదయం 10.30 గంటల సమయంలో మొదలైన ఈ విచారణ సుదీర్ఘంగా సాగగా… కేటీఆర్ ను ముగ్గురు అదికారులతో కూడిన విచారణ బృందం ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. అయితే విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్… అసలు ఏసీబీ వద్ద ఈ కేసుకు సంబంధించిన సమగ్ర సమాచారమే లేదని తేల్చి పారేశారు. అంతేకాకుండా తాను అడిగిన ప్రశ్నలకు ఏసీబీ అధికారులే నోరు వెళ్లబెట్టారని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదివరకే ఓ దఫా ఫార్ములా ఈ కారు రేసుల వ్యవహారంలో కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత గతవారం ఏసీబీ నోటీసులు ఇవ్వగా… సోమవారం ఉదయమే నిర్దేశిత సమయానికే కేటీఆర్ బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. తన లాయర్ రామచంద్రరావును వెంట రాగా కేటీఆర్ విచారణకు వెళ్లగా…ఏసీబీ అధికారులు ఆయనను దాదాపుగా 60 ప్రశ్నలు సంధించినట్లుగా సమాచారం. ఈ ప్రశ్నల్లో చాలా వాటికి సూటిగానే సమాధానాలు ఇచ్చిన కేటీఆర్ కొన్ని ప్రశ్నలకు మాత్రం తనదైన శైలి సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏసీబీ సంధించిన ప్రశ్నలకు కేటీఆర్ ఎదురు ప్రశ్నలు వేసినట్లు సమాచారం.
హైదరాబాద్ ఇమేజీని విశ్వవ్యాప్తంగా ఇనుమడింపజేసేందుకే తాము ఫార్ములా ఈ కారు రేసులను నిర్వహించామని కేటీఆర్ తెలిపారు. విచారణ అనంతరం పార్టీ నేతలు హరీశ్ రావు, కౌశిక్ రెడ్డి, మధుసూదనాచారి తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్టాడారు. 9 గంటల విచారణలో ఏసీబీ అధికారులు ఒకే ప్రశ్నను అటు తిప్పి, ఇటు తిప్పి అడిగారే తప్పించి… కొత్తగా అడిగిందేమీ లేదని ఆయన ఆరోపించారు. అసలు ఏమీ లేని కేసులో ఏదో ఉందన్నట్లు నిరూపించేందుకు ఏసీబీ యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. తాము ఫార్ములా ఈ కారు రేసుల సంస్థకు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమేనని ఆయన వెల్లడించారు. తాము ఇచ్చిన డబ్బు ఆ సంస్థ బ్యాంకు ఖాతాలోనే ఉందని కూడా ఆయన అన్నారు.
నాటి తమ ప్రభుత్వం పంపిన డబ్బు ఫార్ములా సంస్థకు చేరిందన్న విషయం విస్పష్టంగా తెలుస్తూ ఉంటే..ఇక అవినీతి ఎక్కడ జరిగిందని కేటీఆర్ ప్రశ్నించారు. అసలు అవినీతే జరగని ఈ వ్యవహారంలో రాజకీయ కక్షపూరితంగా ఇబ్బందులు పెట్టేందుకే రేవంత్ సర్కారు తమను ఇబ్బందులు పెడుతోందని ఆయన ఆరోపించారు. ఫార్ములా కంపెనీకీ డబ్బు ఇచ్చిన మాట నిజమేనని తాము అంటూ ఉంటే… కుడి చేతితో ఇచ్చారా? ఎడమ చేతితో ఇచ్చారా? అని ప్రశ్నించడమేమిటని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇంతకుముందు చెప్పినట్టే ఇదో లొట్టపీసు కేసు అని, రేవంత్ ఓ లొట్టపీసు సీఎం అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on June 16, 2025 8:44 pm
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…