ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన సాక్షి టీవీ ఇన్ పుట్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం జైలు నుంచి విడులయ్యారు. సాక్షి టీవీ చర్చా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వచ్చిన సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు.. అమరావతి మహిళలను కించపరిచే రీతిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను నిలువరించాల్సిన యాంకర్ స్థానంలోని కొమ్మినేని ఆ మాటలకు నవ్వారు. దీంతో వారిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు గుంటూరు జైలుకు తరలించారు.
అయితే ఓ యాంకర్ గా ఇందులో తన తప్పేం ఉందని వాదించిన కొమ్మినేని కింది కోర్టులోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ ఆలస్యం అవుతుందన్న భావనతో ఆయన ఆ మరుక్షణమే నేరుగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత శెుక్రవారం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు… కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా బెయిల్ షరతులను ట్రయల్ కోర్టు నిర్దేశిస్తుందని, తక్షణమే కొమ్మినేనిని విడుదల చేయాలని సుప్రీం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
అయితే శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా సాయంత్రం వరకు ఉత్తర్వుల కాపీ మాత్రం విడుదల కాలేదు. ఇక ఆ మరునాడు రెండో శనివారం కావడంతో కోర్టులకు సెలవు వచ్చింది. ఆదివారం కూడా సెలవు రావడంతో కొమ్మినేని బెయిల్ ఉత్తర్వులు విడుదల కాలేదు. దీంతో అటు సుప్రీంకోర్టు, ఇటు ట్రయల్ కోర్టు వద్ద వైసీపీ లీగల్ టీం పడిగాపులు కాసి మరీ సోమవారం మధ్యాహ్నానికి బెయిల్ ఉత్తర్వులను జైలు అదికారులకు అందజేశారు. దీంతో సోమవారం చివరి క్షణంలో కొమ్మినేని గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఇక అసలు నిందితుడు కృష్ణంరాజు మాత్రం ఇంకా గుంటూరు జైల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు.
This post was last modified on June 16, 2025 8:37 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…