Political News

చంద్ర‌బాబుకు ‘వ‌క్ఫ్’ భూముల కిరికిరి!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం పెట్టుబ‌డుల‌కు పెద్ద పీట వేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో వివిధ సంస్థ‌ల‌ను ఏపీకి ఆహ్వానిస్తోంది. పెట్టుబ‌డులు వ‌చ్చేలా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలో పలు సంస్థ ల‌కు రాష్ట్రంలో భూములు కూడా కేటాయిస్తోంది. ఇలానే గుంటూరు జిల్లాలో ఐటీ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఇది రాజ‌ధాని ప‌రిధిలోనే ఉంటుంద‌ని గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆయ‌న పెట్టుబ‌డులు కూడా స‌మీక‌రిస్తున్నారు.

ప్ర‌పంచం మొత్తం ఏపీ వైపు చూసేలా ఈ ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామ‌ని.. ఇటీవ‌ల మ‌హానాడులోనూ సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న జారీ చేశారు. ఐటీ పార్కు రాక‌తో బెంగ‌ళూరును మించిన ఐటీ వ్యాపారం ఏపీకి సొంత మవుతుంద‌ని కూడా సీఎం చంద్ర‌బాబు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే గుంటూరులో 233 ఎక‌రాల భూముల‌ను ఐటీ పార్కుకు కేటాయిస్తూ.. ఇటీవ‌ల కేబినెట్ కూడా తీర్మానం చేసింది. వీటిలో 100 ఎక‌రాలు ఒకే చోట ఉండ‌గా.. మ‌రో 100 వేరే చోట ఉన్నాయి.

అయితే.. మొత్తంగా అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌రిధిలోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. కానీ.. ఇప్పుడు ఈ భూముల కేటాయింపే పెను వివాదంగా మారింది. ఐటీ పార్కు కోసం కేటాయిస్తున్న భూములు త‌మ‌వంటూ.. ముస్లిం సంఘాలుగ‌ళం వినిపిస్తున్నాయి. తాజాగా సోమ‌వారం గుంటూరు క‌లెక్ట‌ర్ చేప‌ట్టిన ప్ర‌జా ఫిర్యాదుల కార్య‌క్ర‌మంలో మైనారిటీ ముస్లింలు ఫిర్యాదుల‌పై ఫిర్యాదులు చేశారు. ఐటీ పార్కు కోసం కేటాయించేందుకు సిద్ధం చేసిన భూములు ఇవ్వ‌డానికి వీల్లేద‌న్నారు.

“ఆ భూములన్నీ మా వ‌క్ఫ్ భూములు. వాటిని ఎట్టి ప‌రిస్థితిలోనూ కేటాయించేందుకు వీల్లేదు.” అని ముస్లిం నాయ‌కులు తేల్చి చెప్పారు. క‌లెక్ట‌ర్‌కు ఇచ్చిన విన‌తి ప‌త్రంలోనూ ఇదే విష‌యాన్ని స్ప‌స్టం చేశారు. చిన్న కాకాని, మ‌ల్లాయ‌పాలెంల‌లో ఐటీ పార్కుకు కేటాయించిన భూములు ముస్లింల ధార్మిక సంస్థ‌కు చెందిన భూముల‌ని వారు వెల్ల‌డించారు. త‌మ భూముల జోలికి రావ‌ద్ద‌ని కూడా వారు తెగేసి చెప్ప‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 16, 2025 3:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

46 minutes ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

2 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago