ఏపీలో కూటమి ప్రభుత్వం పెట్టుబడులకు పెద్ద పీట వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వివిధ సంస్థలను ఏపీకి ఆహ్వానిస్తోంది. పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పలు సంస్థ లకు రాష్ట్రంలో భూములు కూడా కేటాయిస్తోంది. ఇలానే గుంటూరు జిల్లాలో ఐటీ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఇది రాజధాని పరిధిలోనే ఉంటుందని గతంలో చంద్రబాబు ప్రకటించారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆయన పెట్టుబడులు కూడా సమీకరిస్తున్నారు.
ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా ఈ ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని.. ఇటీవల మహానాడులోనూ సీఎం చంద్రబాబు ప్రకటన జారీ చేశారు. ఐటీ పార్కు రాకతో బెంగళూరును మించిన ఐటీ వ్యాపారం ఏపీకి సొంత మవుతుందని కూడా సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఈ క్రమంలోనే గుంటూరులో 233 ఎకరాల భూములను ఐటీ పార్కుకు కేటాయిస్తూ.. ఇటీవల కేబినెట్ కూడా తీర్మానం చేసింది. వీటిలో 100 ఎకరాలు ఒకే చోట ఉండగా.. మరో 100 వేరే చోట ఉన్నాయి.
అయితే.. మొత్తంగా అమరావతి రాజధాని పరిధిలోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. కానీ.. ఇప్పుడు ఈ భూముల కేటాయింపే పెను వివాదంగా మారింది. ఐటీ పార్కు కోసం కేటాయిస్తున్న భూములు తమవంటూ.. ముస్లిం సంఘాలుగళం వినిపిస్తున్నాయి. తాజాగా సోమవారం గుంటూరు కలెక్టర్ చేపట్టిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో మైనారిటీ ముస్లింలు ఫిర్యాదులపై ఫిర్యాదులు చేశారు. ఐటీ పార్కు కోసం కేటాయించేందుకు సిద్ధం చేసిన భూములు ఇవ్వడానికి వీల్లేదన్నారు.
“ఆ భూములన్నీ మా వక్ఫ్ భూములు. వాటిని ఎట్టి పరిస్థితిలోనూ కేటాయించేందుకు వీల్లేదు.” అని ముస్లిం నాయకులు తేల్చి చెప్పారు. కలెక్టర్కు ఇచ్చిన వినతి పత్రంలోనూ ఇదే విషయాన్ని స్పస్టం చేశారు. చిన్న కాకాని, మల్లాయపాలెంలలో ఐటీ పార్కుకు కేటాయించిన భూములు ముస్లింల ధార్మిక సంస్థకు చెందిన భూములని వారు వెల్లడించారు. తమ భూముల జోలికి రావద్దని కూడా వారు తెగేసి చెప్పడం గమనార్హం.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…