Political News

జోగి ఇల్లు నేల మ‌ట్టం చేస్తాం: టీడీపీ ఎమ్మెల్యే

ఏపీలో ఎన్టీఆర్ జిల్లా రాజ‌కీయాలు వేడి వేడిగా ఉన్నాయి. టీడీపీ ఎంపీ కేశినేని శివ‌నాథ్‌, ఆయ‌న సోద‌రుడు, మాజీ ఎంపీ కేశినేని నానీల మ‌ధ్య రాజ‌కీయ విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు వైసీపీ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ నేత‌, మాజీ మంత్రి జోగి ర‌మేష్ వ‌ర్సెస్ మైల‌వ‌రం ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు, వైసీపీ మాజీ నేత వసంత కృష్ణ ప్ర‌సాద్ మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో రాజ‌కీయ ర‌చ్చ తెర‌మీదికి వ‌చ్చింది.

స్థానిక కొండ‌ప‌ల్లి మునిసిపాలిటీని హైకోర్టు ఆదేశాల‌తో టీడీపీ కైవ‌సం చేసుకుంది. మునిసిప‌ల్ చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ .. ఇత‌ర అధికారిక ప‌ద‌వుల‌కు నాయ‌కుల‌ను నిర్దేశించింది. అయితే.. దీనిపై జోగి ర‌మేష్ తీవ్ర‌స్థాయిలో స్పందించారు. చంద్ర‌బాబు దుష్ట రాజ‌కీయాల‌కు ఇది నిద‌ర్శ‌మ‌ని.. కుటిల యుక్తుల‌తో వ్య‌వహ‌రించి.. కొండ‌ప‌ల్లి మునిసిపాలిటీని టీడీపీ ద‌క్కించుకుంద‌ని జోగి విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. జోగి చేసిన వ్యాఖ్య‌ల‌పై ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ తీవ్రంగా స్పందించారు.

ఈ క్ర‌మంలో జోగి రమేష్ పై వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్ర‌బాబు అంటే త‌మ‌కు ఎంతో గౌర‌వం ఉంద‌ని.. ఆయ‌న చేసిన సూచనల మేరకు టిడిపి క్యాడర్ స‌హా తామంతా ఎంతో సంయ‌మ‌నంతో ఉంటున్నామ‌ని చెప్పారు. అందుకే.. జోగి లాంటి వారు నోరుపారేసుకుంటున్నా.. తాము మౌనంగా ఉంటున్న‌ట్టు తెలిపారు. కుటిల య‌త్నాలు చేసింది వైసీపీనేన‌ని.. గ‌త ఎన్నిక‌ల్లో క‌నీసం టీడీపీ వారిని నామినేష‌న్ కూడా వేయ‌కుండా అడ్డుకున్నార‌ని చెప్పుకొచ్చారు.

అలాంటి వారు ఇప్పుడు చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేస్తారా? అంటూ.. వ‌సంత ఊగిపోయారు. మరోసారి చంద్రబాబు జోలికి వస్తే జోగి రమేష్ ఇల్లు నేలమట్టం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. “నేనే స్వ‌యంగా ద‌గ్గ రుండి జోగి ఇల్లు కూల్చేయిస్తా. బుల్ డోజ‌ర్ల‌తో రెప్ప‌పాటులో ఆయ‌న ఇంటిని నాశ‌నం చేస్తా” అని వ‌సంత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 16, 2025 3:17 pm

Share

Recent Posts

పాత రోజుల్లోకి నారా రోహిత్

రాజకీయాలకు పేరుపడ్డ నారా కుటుంబం నుంచి ఒక నటుడు వస్తున్నాడంటే మొదట్లో అందరూ ఆశ్చర్యపోయారు. ఇతను ఏమాత్రం సక్సెస్ అవుతాడో…

15 minutes ago

అఖిల్ భారతీయుడు కాదా?

భారతీయులకు విదేశీ పౌరసత్వాలు దక్కడం కొత్తేమీ కాదు. ముందు ఇండియాలోనే పుట్టి పెరిగి.. తర్వాత విదేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడ్డాక…

1 hour ago

ష‌ర్మిల ఎక్క‌డున్నారు… ఫోన్ స్విచ్ఛాఫ్‌!?

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల ఎక్క‌డున్నారు? ఏం చేస్తున్నారు? అనే విష‌యాలు పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ప్ర‌స్తుతం…

1 hour ago

మోడీ పై ఆర్ ఎస్ ఎస్ గుస్సా…?

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి.. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో…

4 hours ago

అన్ని దారులు `ధ‌ర్మేంద్ర` వైపే..!

కేంద్ర ప్ర‌భుత్వం ఎన్ని రూపాల్లో ప్ర‌య‌త్నించినా.. విద్యార్థుల ఆందోళ‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక‌పోతోంది. ఇప్ప‌టికే బ‌ల ప్ర‌యోగం చేయ‌డంతో ఇది తీవ్ర వివాదానికి…

6 hours ago

36 వేల దరఖాస్తులు… పవన్‌కు పెద్ద టాస్కే!

ఉప ముఖ్యమంత్రి పవన్ కు ఇది పెద్ద పరీక్షే. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక ముందడుగు వేస్తున్న ఆ…

8 hours ago