ఏపీలో ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలు వేడి వేడిగా ఉన్నాయి. టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్, ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నానీల మధ్య రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు వైసీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ వర్సెస్ మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు, వైసీపీ మాజీ నేత వసంత కృష్ణ ప్రసాద్ మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ రచ్చ తెరమీదికి వచ్చింది.
స్థానిక కొండపల్లి మునిసిపాలిటీని హైకోర్టు ఆదేశాలతో టీడీపీ కైవసం చేసుకుంది. మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ .. ఇతర అధికారిక పదవులకు నాయకులను నిర్దేశించింది. అయితే.. దీనిపై జోగి రమేష్ తీవ్రస్థాయిలో స్పందించారు. చంద్రబాబు దుష్ట రాజకీయాలకు ఇది నిదర్శమని.. కుటిల యుక్తులతో వ్యవహరించి.. కొండపల్లి మునిసిపాలిటీని టీడీపీ దక్కించుకుందని జోగి విమర్శలు గుప్పించారు. అయితే.. జోగి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్రంగా స్పందించారు.
ఈ క్రమంలో జోగి రమేష్ పై వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు అంటే తమకు ఎంతో గౌరవం ఉందని.. ఆయన చేసిన సూచనల మేరకు టిడిపి క్యాడర్ సహా తామంతా ఎంతో సంయమనంతో ఉంటున్నామని చెప్పారు. అందుకే.. జోగి లాంటి వారు నోరుపారేసుకుంటున్నా.. తాము మౌనంగా ఉంటున్నట్టు తెలిపారు. కుటిల యత్నాలు చేసింది వైసీపీనేనని.. గత ఎన్నికల్లో కనీసం టీడీపీ వారిని నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకున్నారని చెప్పుకొచ్చారు.
అలాంటి వారు ఇప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేస్తారా? అంటూ.. వసంత ఊగిపోయారు. మరోసారి చంద్రబాబు జోలికి వస్తే జోగి రమేష్ ఇల్లు నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. “నేనే స్వయంగా దగ్గ రుండి జోగి ఇల్లు కూల్చేయిస్తా. బుల్ డోజర్లతో రెప్పపాటులో ఆయన ఇంటిని నాశనం చేస్తా” అని వసంత సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
This post was last modified on June 16, 2025 3:17 pm
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…