2019-24 మధ్య వైసీసీ ప్రభుత్వం అధికారంలో ఉండగా రెచ్చిపోయి వ్యవహరించిన నాయకులు, అధికారులను గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోంది. ఒక పద్ధతి ప్రకారం వారి మీద కేసులు పెడుతూ.. వారికి చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా చాలామంది వైసీపీ నేతలు చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఐతే ఇప్పటికే చాలామంది నాయకులను టార్గెట్ చేసినప్పటికీ.. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని జోలికి మాత్రం కూటమి ప్రభుత్వం వెళ్లకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు ఈ విషయంలో రగిలిపోతున్నారు. అధికారంలో ఉండగా నాని ఎంత దారుణమైన మాటలు మాట్లాడాడో, ఎంత హద్దులు దాటి ప్రవర్తించాడో అందరికీ తెలిసిందే. కేసులకు దొరికేలా నాని ఎన్నో తప్పులు చేశాడని.. అయినా అతణ్ని ఎలా వదిలేస్తున్నారని కార్యకర్తలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఐతే తప్పు చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని.. సమయం వచ్చినపుడు అన్నీ వాటంతట అవే జరిగిపోతాయని మంత్రి నారా లోకేష్ సంకేతాలు ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి లక్ష్యంగా మారిన మాజీ మంత్రి పేర్ని నాని.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని అరెస్ట్ విషయంలో ఆయన జోస్యం చెప్పారు.
తనకున్న అంచనా ప్రకారం ఇంకో ఆరు నెలల్లో కొడాలి నాని అరెస్ట్ అవుతారని ఆయన వ్యాఖ్యానించారు. నారా లోకేష్ ఆలోచన, రెడ్ బుక్ లెక్కల ప్రకారం.. కొడాలి నాని అరెస్ట్ కోసం ఇంకొంత కాలం ఆగుతారన్నారు. ప్రస్తుతం నాని ఆరోగ్యం బాగా లేదని.. హార్ట్ సర్జరీ జరిగిందని.. ఒకవేళ అరెస్ట్ చేసినా అనారోగ్య కారణాలు చూపించి సులువుగా బెయిల్ తీసుకుంటారని పేర్ని నాని అన్నారు. అందుకే నాని ఆరోగ్యం మెరుగుపడి, జిమ్ అదీ చేసి బలంగా తయారైతే.. అప్పుడు సమయం చూసి ఆయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారని.. ఇందుకు ఆరు నెలల టైం పట్టొచ్చని.. అరెస్ట్ తర్వాత సులువుగా బయటికి రాకుండా చూసేందుకే టైం తీసుకుంటున్నారని ఆయన విశ్లేషించడం విశేషం.
This post was last modified on June 16, 2025 3:12 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…