ఏపీలో కూటమి ప్రభుత్వం పక్షాన ఇచ్చిన ‘సూపర్-6’ హామీల్లో కీలకమైన తల్లికి వందనం పథకాన్ని గత గురువారం ప్రారంభించారు. శుక్రవారం, శనివారాల్లో లబ్ధిదారులైన మహిళల ఖాతాల్లో రూ.13000 చొప్పున నిధులు జమ చేశారు. ఇంట్లో ఒక తల్లికి ఎంత మంది చదువుకునే చిన్నారులు ఉన్నా.. వారందరికీ ఈ సొమ్ములు జమ చేస్తామని చెప్పినట్టుగానే.. ప్రస్తుతం అదే పనిచేస్తున్నారు. దాదాపు 85 శాతం మందికి ఈ నిధులు ఇచ్చేశారు.
కుటుంబంలో ముగ్గురు పిల్లలున్నా..చివరకు అయిదుగురు పిల్లలు ఉన్నా.. నిధులు ఇచ్చారు. సహజంగా నే ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు.. ప్రభుత్వం క్రెడిట్ కోరుకోవడంలో తప్పులేదు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు అదే పనిచేశారు. ఆదివారం పార్టీ నాయకులకు ఆయన ఫోన్ చేసి.. ప్రజల సంతృప్తి ఎలా ఉందన్నది ఆరా తీశారు. మహిళల ఆనందాన్ని తెలుసుకున్నారు. తల్లికి వందనం పథకంపై ఆనందం ఎలా ఉందని ప్రశ్నించారు. మొత్తంగా క్షేత్రస్థాయిలో పరిస్తితిని ఆయన అడిగి విచారించారు.
ఈ సందర్భంగా ఎక్కువ మంది ఆనందం వ్యక్తం చేయడం గమనార్హం. అయితే.. గ్రామీణ భారతంలో సర్పంచులు, వార్డు మెంబర్ల పిల్లలకు ఈ పథకం చేరకపోవడాన్ని తమ్ముళ్లు చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చారు. వైసీపీ హయాంలో వారికి కూడా అందిందని.. ఇప్పుడు వారిని తప్పించారని చెప్పారు. దీనిపై చంద్రబాబు సరిచూస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇక, పట్టణాలు, నగరాల్లో కూడా.. లబ్ధిదారుల సంఖ్యను కుదించడంపై తమ్ముళ్లు వివరాలు సమర్పించారు.
300 యూనిట్ల విద్యుత్ వినియోగం చేసిన వారిని ఈ పథకం నుంచి తప్పించారు. అలాగే.. నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారిని కూడా తీసేశారు. ఈ విషయంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని.. వీరికి వేరే రూపం లో అయినా.. ప్రభుత్వం సాయం అందించాలని సూచించారు. పైగా.. తెల్లరేషన్ కార్డును కొలమానంగా తీసుకున్నా.. వారిలో కూడా చాలా మందికి ఈ పథకం చేరలేదని చెప్పుకొచ్చారు. ఒకవైపు సంతృప్తి ఉందని చెబుతూనే.. మరోవైపు.. లోపాలను కూడా ఎత్తి చూపారు. ఈ పరిణామాలపై చంద్రబాబు చర్చిస్తానని హామీ ఇవ్వడం గమనార్హం.
This post was last modified on June 15, 2025 10:36 pm
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…