ఏపీలో కూటమి ప్రభుత్వం పక్షాన ఇచ్చిన ‘సూపర్-6’ హామీల్లో కీలకమైన తల్లికి వందనం పథకాన్ని గత గురువారం ప్రారంభించారు. శుక్రవారం, శనివారాల్లో లబ్ధిదారులైన మహిళల ఖాతాల్లో రూ.13000 చొప్పున నిధులు జమ చేశారు. ఇంట్లో ఒక తల్లికి ఎంత మంది చదువుకునే చిన్నారులు ఉన్నా.. వారందరికీ ఈ సొమ్ములు జమ చేస్తామని చెప్పినట్టుగానే.. ప్రస్తుతం అదే పనిచేస్తున్నారు. దాదాపు 85 శాతం మందికి ఈ నిధులు ఇచ్చేశారు.
కుటుంబంలో ముగ్గురు పిల్లలున్నా..చివరకు అయిదుగురు పిల్లలు ఉన్నా.. నిధులు ఇచ్చారు. సహజంగా నే ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు.. ప్రభుత్వం క్రెడిట్ కోరుకోవడంలో తప్పులేదు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు అదే పనిచేశారు. ఆదివారం పార్టీ నాయకులకు ఆయన ఫోన్ చేసి.. ప్రజల సంతృప్తి ఎలా ఉందన్నది ఆరా తీశారు. మహిళల ఆనందాన్ని తెలుసుకున్నారు. తల్లికి వందనం పథకంపై ఆనందం ఎలా ఉందని ప్రశ్నించారు. మొత్తంగా క్షేత్రస్థాయిలో పరిస్తితిని ఆయన అడిగి విచారించారు.
ఈ సందర్భంగా ఎక్కువ మంది ఆనందం వ్యక్తం చేయడం గమనార్హం. అయితే.. గ్రామీణ భారతంలో సర్పంచులు, వార్డు మెంబర్ల పిల్లలకు ఈ పథకం చేరకపోవడాన్ని తమ్ముళ్లు చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చారు. వైసీపీ హయాంలో వారికి కూడా అందిందని.. ఇప్పుడు వారిని తప్పించారని చెప్పారు. దీనిపై చంద్రబాబు సరిచూస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇక, పట్టణాలు, నగరాల్లో కూడా.. లబ్ధిదారుల సంఖ్యను కుదించడంపై తమ్ముళ్లు వివరాలు సమర్పించారు.
300 యూనిట్ల విద్యుత్ వినియోగం చేసిన వారిని ఈ పథకం నుంచి తప్పించారు. అలాగే.. నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారిని కూడా తీసేశారు. ఈ విషయంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని.. వీరికి వేరే రూపం లో అయినా.. ప్రభుత్వం సాయం అందించాలని సూచించారు. పైగా.. తెల్లరేషన్ కార్డును కొలమానంగా తీసుకున్నా.. వారిలో కూడా చాలా మందికి ఈ పథకం చేరలేదని చెప్పుకొచ్చారు. ఒకవైపు సంతృప్తి ఉందని చెబుతూనే.. మరోవైపు.. లోపాలను కూడా ఎత్తి చూపారు. ఈ పరిణామాలపై చంద్రబాబు చర్చిస్తానని హామీ ఇవ్వడం గమనార్హం.
This post was last modified on June 15, 2025 10:36 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…