Political News

టీ టీడీపీ రీయూనియన్ మొదలైనట్టే!

తెలుగు దేశం పార్టీ… తెలుగు ప్రజల ఆత్మ గౌరవ పరిరక్షణే పరమావధిగా ఏర్పాటైన పార్టీ. 40 ఏళ్లకు పైగా ప్రస్థానం సాగిస్తున్న టీడీపీ… అన్ని సమయాల్లో కంటే ఇప్పుడు అత్యంత బలీయంగా ఉందని చెప్పాలి. జనసేన, బీజేపీలతో జత కట్టిన టీడీపీ… ఏపీ అసెంబ్లీని దాదాపుగా క్లీన్ స్వీప్ చేసినంత పనిచేసింది. తిరుగులేని విజయాన్ని నమోదు చేసిన టీడీపీ.. అటు కేంద్రంలోని ఎన్డీఏలో కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఆవిర్భవించిన తెలంగాణలో తిరిగి పార్టీకి పూర్వవైభవం కల్పించే దిశగా పార్టీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చర్యలు ప్రారంబించేశారు.

గత కొంతకాలం క్రితమే చంద్రబాబు ప్రారంభించిన ఈ చర్యలు క్రమంగా సఫలం అవుతున్నాయి. గతంలో టీడీపీలో కీలక నేతగా పనిచేసిన నల్లగొండ కీలక రాజకీయవేత్త, కేంద్ర మాజీ మంత్రి గుత్తా సుఖేందర్ రెడ్డి శనివారం హైదరాబాద్ లో చంద్రబాబుతో బేటీ అయ్యారు. ఏపీ సీఎంగా బిజీబిజీగా ఉంటున్న చంద్రబాబు… వీకెండ్స్ లో ఫ్యామిలీతో్ గడిపేందుకు హైదరాబాద్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం హైదరాబాద్ చేరిన బాబుతో గుత్తా భేటీ అయ్యారు. వీరి భేటీలో ఏఏ అంశాలు చర్చకు వచ్చాయన్న విషయాన్ని పక్కనపెడితే… టీ టీడీపీ రీయూనియన్ దిశగా పకడ్బందీగానే అడుగులు పడుతున్నాయని చెప్పక తప్పదు.

ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ చాలా వీక్ గా ఉంది. పదేళ్ల పాటు తెలంగాణ ప్రజలు ఇచ్చిన అదికారాన్ని దుర్వినియోగం చేసిందంటూ ఇంటా బయటా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన కీలక పరిణామాలపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. కేసీఆర్ సహా బీఆర్ఎస్ కు చెందిన చాలా మంది నేతలు ఈ విచారణలు, కేసుల్లో ఇరుక్కుని నానా అవస్థలు పడుతున్నారు. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్… అంతగా బలంగా లేదనే చెప్పాలి. అదికారం ఉంది కదా అన్న థీమా తప్పించి వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరతారమన్న నమ్మకం అయితే ఆ పార్టీ నేతల్లో పెద్దగా కనిపించడం లేదు.

ఇదిలా ఉంటే…ఇప్పుడున్న కాంగ్రెస్ కేబినెట్ లో సీఎం రేవంత్ రెడ్డితో సహా ఇద్దరు కీలక మంత్రులు టీడీపీ నుంచి వచ్చిన వారే. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నేతలే. రాష్ట్ర విభజన నేపథ్యంలో వీరు పార్టీ మారక తప్పలేదు. ఇక ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ లో ఒకింత ఇనాక్టివ్ గా ఉన్న మండవ వెంకటేశ్వరరావు, మాజీ మంత్రులు దేవేందర్ గౌడ్ కుమారులు, నాగం జనార్థన్ రెడ్డి కుమారుడు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాసరెడ్డి తదితరులు బాబు ఇలా పిలిస్తే… అలా టీడీపీలోకి వచ్చి యాక్టివ్ అయ్యేందుకు సదా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన 2028 చివరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీ టీడీపీ సత్తా చాటడం ఖాయమేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

This post was last modified on June 14, 2025 11:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

3 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

5 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

7 hours ago