Political News

ఎగ్జిట్ పోల్స్ మొత్తం ఫెయిలయ్యాయా ?

బీహార్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరిగాయి. ఎందుకంటే ఎన్నికల ఫలితాల విషయంలో ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ నూరుశాతం ఫెయిలయ్యాయా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మూడు దశల్లో జరిగిన పోలింగ్ పూర్తియిన తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేలు తమ రిజల్ట్స్ ను విడుదల చేశారు. వాటి ప్రకారం మహాగట్ బంధన్ అధికారంలోకి రాబోతోందని చాలా స్పష్టంగా చెప్పాయి. ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఎంజీబీ అధికారంలోకి రావటం ఖాయమంటూ బల్లగుద్ది మరీ చెప్పాయి.

ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే ఎన్డీయే లేకపోతే బీజేపీకి మద్దతుగా ఉండే రిపబ్లిక్ టీవీ జరిపించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా ఎంజీబీదే అధికారమని తేలటంతో అందరు నమ్మేశారు. కౌంటింగ్ మొదలైన కొద్దిసేపటి వరకు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనాలు వేసినట్లే కనబడింది. అయితే కౌంటింగ్ మొదలైన రెండు గంటల తర్వాత నుండి పరిస్ధితుల్లో మార్పులు మొదలయ్యాయి. ఎంజీబీకి ఉన్న ఆధిక్యతలన్నీ తగ్గిపోయి ఎన్డీయే వైపు పెరిగాయి. అలా పెరిగి పెరిగి చివరకు ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని పెంచేశాయి.

సో జరిగింది చూసిన తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేలు నూటికి నూరు శాతం తప్పుపోవటం బహుశా ఇదే మొదటిసారేమో. కౌంటింగ్ తర్వాత వస్తున్న విశ్లేషణల ప్రకారం ఎన్డీయేలోని ప్రధాన భాగస్వాముల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పూర్తిగా దెబ్బ తినేసినట్లు అర్ధమైపోతోంది. ఇదే సమయంలో జేడీయుని మించి బీజేపీ అభ్యర్ధులు గెలిచారు. అంటే ఎన్డీయే కూటమిలో బీజేపీ లేకపోతే ఈ కూటమికి ఘోర పరాజయం ఎదురయ్యేదనటంలో సందేహం లేదు.

ఇదే సమయంలో ఎంజీబీ కూటమిలో కాంగ్రెస్ పార్టీనే కూటమి విజయావకాశాలను దెబ్బ కొట్టిందని అర్ధమైపోతోంది. ఎలాగంటే కూటమిలో కాంగ్రెస్ అభ్యర్ధులు పోటి చేసిన 70 సీట్లలో మెజారిటిలో ఉన్నది 20 మంది అభ్యర్ధులు మాత్రమే. మిగిలిన 50 సీట్లలో ఎన్డీయే కూటమి అభ్యర్ధులే లీడ్స్ లో ఉన్నారు. అదే ఆర్జేడీ పోటి చేసిన నియోజకవర్గాల్లో మెజారిటి సీట్లలో ఆర్జేడీ అభ్యర్ధులే గెలుపుదిశగా వెళుతున్నారు. ఆశ్చర్యమేమిటంటే ఎంజేబీ కూటమిలో పార్టీగా పోటి చేసిన సిపిఐ(ఎంఎల్) అభ్యర్ధులు కూడా మెజారిటి స్ధానాల్లో దూసుకుపోవటమే. చాలా కాలం తర్వాత లెఫ్ట్ పార్టీ మంచి ఫలితాలను చూసిందనే చెప్పాలి.

This post was last modified on November 11, 2020 2:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

1 hour ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago