అప్పు ఇచ్చుడు దాకా ఓకే. దానిని వసూలు చేయడం అంత వీజీ కాదు. కాస్తంత టెక్నిక్ తెలిసిన రుణ దాతలు అయితే ఫరవా లేదు గానీ… అదో లోకం రుణ దాతలు అయితే మాత్రం అప్పులు ఇవ్వరాదు, ఇబ్బందులు కొని తెచ్చుకోరాదు. ఇప్పుడు తమిళనాడుకు వెళితే… రుణ గ్రహీతలకు వర ప్రసాదం లాంటి ఓ చట్టం వచ్చింది. అదేంటంటే… అప్పు ఇచ్చిన వారు అప్పు తీసుకున్న వారి దగ్గర నుంచి ఆ అప్పును సామరస్యపూర్వకంగానే వసూలు చేసుకోవాలి. అప్పు వసూలులో ఏమాత్రం బలవంతం చోటుచేసుకున్నా అప్పు ఇచ్చిన పాపానికి రుణ దాతలకు ఐదేళ్ల జైలు శిక్ష తప్పదట.
ఈ మేరకు బలవంతపు అప్పుల వసూళ్లను నిలువరించే దిశగా తమిళనాడులోని డీఎంకే సర్కారు ఓ బిల్లును రూపొందించి…దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టగా..అక్కడ ఆ బిల్లు పాస్ అయిపోయింది. ఈ బిల్లును ఎంకే స్టాలిన్ ప్రభుత్వం గవర్నర్ కు పంపగా… అసెంబ్లీ ఆమోదించిన ఈ బిల్లుకు రాజ్ భవన్ ఆమోద ముద్ర వేసింది. వెరసి ఈ బిల్లు చట్టంగా మారిపోయింది. రాష్ట్రంలో అమలులోకి వచ్చేసింది కూడా. అంటే… తమిళనాట ఇకపై అప్పు వసూలుకు బలప్రయోగం తగదు. పొరపాటున బలప్రయోగం చేసి అప్పు వసూలు చేస్తే మాత్రం ఐదేళ్ల జైలు శిక్ష తప్పదు మరి.
ఇక ఈ అప్పు బలవంతపు వసూలులో భాగంగా రుణ గ్రహీతల ఆస్తులను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం కూడా కుదరదట. అంతేకాదండోయ్… రుణ దాతల వేధింపులతో తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని రుణ గ్రహీతలు పొరపాటున నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంటే… ఇక ఆ రుణ దాతకు కనీసం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే హక్కు కూడా ఉండదట. అంటే… దేశవ్యాప్తంగా ఏదో నార్కోటిక్, అట్రాసిటీ కేసుల మాదిరిగా అన్న మాట. ఇక రుణ దాతల విషయంలో వ్యక్తులతో పాటుగా సంస్థలకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని స్టాలిన్ సర్కారు తేల్చి చెప్పింది.
This post was last modified on June 14, 2025 1:46 pm
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…