Political News

జ‌గ‌న్ ‘పేటెంట్‌’ను లాగేసుకున్న చంద్ర‌బాబు..!

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. ఒక్క‌రికి మాత్ర‌మే ప‌రిమితం అనుకునే ప‌రిస్థితి ఇప్పుడు లేదు. ఒక‌ప్పుడు రూ.2కే కిలో బియ్యం అనేది ఎన్టీఆర్ నినాదం. త‌ర్వాత‌.. అది ఆయ‌న‌కు పేటెంట్‌గా కూడా మారిపోయింది. అయితే.. త‌ర్వాత వ‌చ్చిన ప్ర‌భుత్వాలు కూడా దీనిని చెర‌ప‌లేక‌పోయాయి. ఇక‌, చంద్ర‌బాబు..ఐటీ-విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ఇది కూడా ఆయ‌న‌కు పేటెంట్‌గా మారింది. అయితే.. త‌ర్వాత కాలంలో ఎన్ని ప్ర‌భుత్వాలు మారినా.. ఆయ‌న‌కు ఉన్న పేటెంట్‌ను మార్చ లేక‌పోయాయి. లాగేసుకోలేక పోయాయి.

ఇక‌, ఈ ప‌రంప‌ర‌లోనే జ‌గ‌న్ 2019-24 మ‌ధ్య కొన్ని ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టారు. వాటిలో ఎక్కువ‌గా ఖ‌ర్చుతో కూడుకున్న‌ది.. మ‌హిళ‌లను ముఖ్యంగా ఆక‌ర్షించింది.. ‘అమ్మ ఒడి’ ప‌థ‌కం. ఒక‌ర‌కంగా.. ఇది జ‌గ‌న్‌కు పేటెంట్‌గా మారింది. దీనిని తాము త‌ప్ప‌.. ఎవ‌రూ ఇవ్వ‌లేర‌న్న వాద‌న‌ను కూడా తెర‌మీదికి తీసుకువ‌చ్చింది. ఎందుకంటే.. ఏటా 6500 కోట్ల రూపాయ‌ల‌ను అప్ప‌ట్లో జ‌గ‌న్ ఖ‌ర్చుచేసేవారు. ఇంత పెద్ద మొత్తం ఏ ప్ర‌భుత్వం ఇవ్వ‌లేద‌ని.. ముఖ్యంగా చంద్ర‌బాబు అయితే.. అస‌లు ఇవ్వ‌ర‌ని కూడా.. వైసీపీ నాయ‌కులు ప్ర‌చారం చేసుకున్నారు. దీనిలో జ‌గ‌న్ కూడా ఉన్నారు.

నిజ‌మే.. అత్యంత భారీ ఖ‌ర్చుతో కూడిన ఈ ప‌థ‌కాన్ని దేశంలో ఏ ప్ర‌భుత్వం కూడా ఇవ్వ‌లేదు. ఇచ్చే ఆలోచన కూడా చేయ‌లే దు. ఎందుకంటే.. వేల కోట్ల రూపాయ‌ల‌ను సంక్షేమానికి ఇచ్చే బ‌దులు పెట్టుబ‌డిగా పెట్టి అభివృద్ది సాధిస్తే బెట‌ర్ అనే ఆలోచ‌న ఉండ‌డ‌మే. అందుకే.. గ‌తంలో పంజాబ్, క‌ర్ణాట‌క ప్ర‌భుత్వాలు కూడా.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌ద్ద‌కు వ‌చ్చి అమ్మ ఒడి ప‌థ‌కాన్ని అధ్య‌య‌నం చేశాయే త‌ప్ప‌.. అవి అమ‌లు చేయ‌లేక‌పోయాయి. అంతేకాదు.. ఇంత పెద్ద మొత్తం ఇవ్వ‌లేమ‌ని కూడా పంజాబ్ పాల‌కులు అప్ప‌ట్లో చెప్పారు. దీంతో అమ్మ ఒడి వంటి ఘ‌న‌మైన ప‌థ‌కాన్ని తాము త‌ప్ప ఎవ‌రూ అమ‌లు చేయ‌లేర‌ని జ‌గ‌న్ కూడా చెప్పుకొచ్చారు.

అయితే.. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం జ‌గ‌న్‌కు మాత్ర‌మే ఉంద‌ని భావించిన ఈ పేటెంట్‌ను లాగేసుకుంటోంది. చంద్ర‌బాబు ఈ ప‌థ‌కాన్ని ఓవ‌ర్ టేక్ చేస్తూ.. త‌ల్లికి వంద‌నం పేరుతో అమ‌లుకు శ్రీకారం చుట్టారు. ఏకంగా 68 ల‌క్ష‌ల మంది త‌ల్లుల‌కు ఎంత మంది పిల్ల‌లు ఉన్నా.. త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్ని అమ‌లు చేసేందుకు.. సుమారు.. 8.5 వేల కోట్ల‌రూపాయ‌ల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇది ఒక‌ర‌కంగా.. జ‌గ‌న్ చేసిన ఖ‌ర్చు 6.5 వేల కోట్ల‌తో పోల్చితే.. మ‌రో 2 వేల కోట్ల రూపాయ‌లు ఎక్కువ‌. సో.. దీనిని బ‌ట్టి ఇప్ప‌టి వ‌రకు జ‌గ‌న్ మాత్ర‌మే చెప్పుకొన్న అమ్మ ఒడి పేటెంట్‌ను ఇక‌, ఇప్పుడు చంద్ర‌బాబు లాగేసుకున్న‌ట్టు అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదేమైనా ఎప్పుడూ ఒక్క‌రి ఆలోచ‌నే స‌రికాదు క‌దా!!.

This post was last modified on June 12, 2025 12:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

2 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

2 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

2 hours ago

ఉభయకుశలోపరి… తెలంగాణ ‘అఖండ’ 2 ధరలు

ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…

2 hours ago

అఖండ హీరోయిన్ ను ఎందుకు తీసేసారో లీక్ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్  కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…

3 hours ago

టికెట్ రేట్లలో పెంచిన 100 రూపాయల్లో నిర్మాతకి వచ్చేది అంతేనా?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…

3 hours ago