ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిన సంగతి తెలిసిందే. వెంటిలేటర్ పైకి చేరిన కాంగ్రెస్ పార్టీని బ్రతికించేందుకు కిరణ్ కుమార్ రెడ్డి మొదలు షర్మిల వరకు ఎంతోమంది విశ్వప్రయత్నాలు చేశారు. అయినా సరే, ప్రత్యేక తెలంగాణను ప్రకటించి ఆంధ్రాకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర ప్రజలు ఇంకా కోపంగానే ఉన్నారు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, నేతల మధ్య సఖ్యత లేకపోవడం వంటి పలు కారణాలతో పార్టీ పుంజుకోలేకపోతోంది.
పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు చెక్ చెప్పి నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తాజాగా అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. షర్మిల మాట్లాడుతున్న సమయంలో కార్యకర్తలు గొడవపడ్డారు. కార్యకర్తలను సమన్వయకర్తలు పట్టించుకోవడంలేదని, ప్రజల్లో తిరగడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, గుంతకల్లు కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్తలను మార్చాలని కార్యకర్తలు పట్టుబట్టారు.
ఈ క్రమంలోనే అక్కడ హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీంతో, పోలీసులు, బౌన్సర్లు రంగ ప్రవేశం చేసి కాంగ్రెస్ కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ దశలో షర్మిల కూడా జోక్యం చేసుకొని కార్యకర్తలు ఇలాగే గొడవపడితే తాను సమావేశం నుంచి వెళ్లిపోతానని హెచ్చరించారు. షర్మిల సర్దిచెప్పడంతో వ్యవహారం సద్దుమణిగింది. ఆ తర్వాత సమావేశం కొనసాగింది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం రాబోతుందని, ఇటువంటి సమయంలో అంతర్గత కలహాలను పక్కనబెట్టాలని, విభధాలు వీడి కలిసి పని చేయాలని షర్మిల పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి సర్కార్ నిలబెట్టుకోలేకపోయిందని అన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. కూటమితో పాటు వైసీపీ కూడా ప్రజా పాలనలో విఫలమైంని, విభేదాలు వీడి 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.
This post was last modified on June 12, 2025 12:27 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…