తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల కిందట తన కేబినెట్ను విస్తరించిన విషయం తెలిసిందే. అనేక తర్జన భర్జనలు సహా.. అనేక మందిని సంప్రదించి, అధిష్టానంతో చర్చించిన తర్వాత.. ముగ్గురంటే ముగ్గురికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. వీరిలో నూ ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. వాస్తవానికి ఐదు నుంచి ఆరుగురికి అవకాశం ఉన్నా.. కేవలం ముగ్గురికి మాత్రమే అవకాశం కల్పించారు. ఇక, వీరికి తాజాగా శాఖలు కేటాయించారు. పైకి దీనిపై అధిష్టానంతో చర్చించలేదని చెబుతున్నా.. తాజాగా వెల్లడించిన శాఖలను బట్టి.. అధిష్టానం సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
ఇక, తాజాగా మంత్రివర్గంలోకి వచ్చిన వారిలో గడ్డం వివేక్( చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం), వాకాటి శ్రీహరి(మక్తల్ ఎమ్మెల్యే ), అడ్లూరి లక్ష్మణ్(ధర్మపురి ఎమ్మెల్యే)లకు అవకాశం ఇచ్చారు. ఇక, తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వీరికి శాఖలు కేటాయించారు. గడ్డం వివేక్ – కార్మిక, న్యాయ, క్రీడా శాఖలు, వాకిటి శ్రీహరి – పశుసంవర్థక, కమర్షియల్ టాక్స్ శాఖలు, అడ్లూరి లక్ష్మణ్ – ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖను కేటాయించారు. కానీ.. అందరూ ఆశించినట్టుగా.. కీలకమైన హోం శాఖను మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఎవరికీ కేటాయించకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు సీఎం వద్దే.. సుమారు 7 శాఖల వరకు ఉన్నాయి. వీటిలో ప్రధానమైంది హోం శాఖ. దీనిని అడ్లూరి లక్ష్మణ్ ఎస్సీ కోటాలో ఆశించినట్టు వార్తలు వచ్చాయి.
కానీ, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ శాఖను తన దగ్గరే పెట్టుకున్నారు. అయితే.. తాజాగా ఇచ్చిన కేటాయింపులను చూస్తే.. దీనిపై పార్టీ అధిష్టానం స్పష్టమైన ముద్ర కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. గడ్డం వివేక్కు కార్మిక, న్యాయ, క్రీడా శాఖలను కేటాయించారు. వీటిలో కీలకమైంది కేవలం కార్మిక శాఖ మాత్రమే. ఇక, వాకిటి శ్రీహరికి పశుసంవర్థక, కమర్షియల్ టాక్స్ శాఖలు ఇచ్చారు. వీటిలోనూ కమర్షియల్ టాక్స్ కీలకం.
అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు కేటాయించారు. కానీ, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు.. శాంతి భద్రతలు.. రాబోయే రాజకీయ అంశాలను పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. శాంతి భద్రతలను సీఎం రేవంత్ దగ్గరే ఉంచినట్టు తెలుస్తోంది. మొత్తానికి కీలకమైన శాఖను మాత్రం రేవంత్ తనదగ్గరే పెట్టుకున్నారన్న వాదనవినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on June 11, 2025 9:11 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…