ఓబులాపురం మైనింగ్ వ్యవహారంలో అక్రమాలు చేసి.. జైలుకు కూడా వెళ్లిన కర్ణాటక వ్యాపార వేత్త., ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డి కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షపై హైకోర్టు తాజాగా స్టే విధించింది. దీంతో ఆయనకు ఊరట లభించినట్టయింది. ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డి చంచల్ గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. 2009-10 మధ్య కర్ణాటక-అనంతపురం మధ్య ఉన్న ఓబులాపురం గనులను అనుమతికి మించి దోచుకున్నారన్న కేసులో గత మేలో సీబీఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డి సహా.. ఆయన బావ.. ఐఆర్ ఎస్ అధికారి బీవీ శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, అలీఖాన్లకు ఏడేళ్లపాటు జైలు శిక్ష విధించింది.
దీంతో పోలీసులు.. చంచల గూడ జైలుకు తరలించారు. అయితే.. ఇంతలోనే గాలి జనార్దన్ రెడ్డి సహా.. మిగిలిన వారు.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జైలు జీవితం గడపలేక పోతున్నామని.. వయసు రీత్యా అయినా.. తమను కరుణించాలని వారు వేడుకున్నారు. ఈ పిటిషన్లో గాలి సహా .. మిగిలిన దోషులు పలు కీలక విషయాలతో కోర్టును అభ్యర్థించారు. వయసు, తమ వ్యాపారాలు, కుటుంబాలు సహా.. ఆరోగ్య అంశాలను ప్రస్తావించారు.
“వయసు రీత్యా వచ్చిన బీపీ, షుగర్తో ఇబ్బంది పడుతున్నాను. నాపై చేసిన అభియోగాలకు ఆధారాలు లేవు. గతంలో విచారించినప్పుడు కూడా.. ఎలాంటి ఆధారాలను ప్రవేశ పెట్టలేదు. అందుకే గతంలో బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చారు కదా.. అని నేనేమీ తప్పు చేయలేదు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు బెయిల్ మంజూరు చేయండి. ఎలాంటి నిబంధనలు విధించినా.. కట్టుబడి ఉంటాం“ అని గాలి తరపున న్యాయవాది వాదనలు వినిపించారు.
అయితే.. గాలి, ఇతర దోషులకు బెయిల్ ఇవ్వరాదని.. వారు చేసిన నేరాలు రుజువయ్యాయని సీబీఐ తర ఫున న్యాయవాదులు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు తాజాగా శిక్షను నిలిపి వేస్తూ.. తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించి కొన్ని షరతులు కూడా విధించింది. 2 లక్షల రూపాయల చొప్పున పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అదేవిధంగా పాస్ పోర్టులను పోలీసులకు స్వాధీనం చేయాలని పేర్కొంది. ఎట్టి పరిస్థితిలోనూ దేశం విడిచి వెళ్లరాదని, షరతులను ఉల్లంఘించడానికి వీల్లేదని తెలిపింది.
This post was last modified on June 11, 2025 11:40 am
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…