రాష్ట్రంలో సర్వేలకు ప్రాధాన్యం పెరుగుతోంది. పార్టీ ఏదైనా.. నాయకులు ఎవరైనా.. సర్వేలకు ఇస్తున్న ప్రా ధాన్యం అంతా ఇంతా కాదు. నిజానికి సర్వేలంటే.. ఎన్నికలకు ముందు లేదా.. ఎన్నికల ఏడాదిలో జరుగుతాయి. అప్పుడు ప్రజల నాడిని తెలుసుకునేందుకు నాయకులు ప్రయత్నాలు చేస్తారు. ప్రజలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముందస్తు సర్వేలు చేయించుకుంటారు. ఇది కొన్ని దశాబ్దాలుగా ఉన్న పద్ధతి.
అయితే.. ఇప్పుడు ట్రెండ్ మారింది. నాయకుల తీరుతో పాటు.. ప్రజల నాడికూడా మారింది. నమ్ముకున్న వారే.. ఎన్నికల సమయానికి అంతా యూటర్న్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఇదే కనిపించింది. తాము అమలు చేసిన సంక్షేమం.. పధకాలు వంటివి తమకు గెలుపు గుర్రాన్ని అందిస్తాయని వైసీపీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. కానీ.. బలమైన స్థానాల్లోనూ వైసీపీ పరాజయం పాలైంది. ఇది చాలా సీరియస్ అంశం.
ఈ నేపథ్యంలోనే నాయకులు తమ తమ గ్రాఫ్ను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటున్నారు. ఏడాది అయిన నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యేలు తమ గ్రాఫ్పై దృష్టి పెట్టారు. ప్రజలు తమపై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. వాస్తవానికి ఒకప్పుడు ఈ సమాచారం కోసం తమ అనుచరులను వినియోగించుకునేవారు. కానీ.. వీరు సరిగ్గా సమాచారాన్ని అందించే విషయంలో వెనుక బడుతున్నారు. పైగా మొహమాటాలు కూడా అడ్డం వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ప్రైవేటు సర్వే సంస్థలకు ప్రాధాన్యం పెరిగింది. ఎమ్మెల్యేలు ఎంతఖర్చయిన భరించేందుకు రెడీ అవుతున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలు తమ గురించి ఏమనుకుంటున్నారు.. ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? అనే విషయాలపై సర్వే చేయించుకుంటున్నారు. అయితే.. చిత్రం ఏంటంటే.. ఎమ్మెల్యేల్లో మార్పులు రానంత వరకు.. ఈ సర్వేలు ఎన్ని చేయించుకున్నా ప్రయోజనం ఉంటుందా? అనేది ప్రశ్న. ప్రజలకు దూరంగా ఉన్న నాయకుల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది.
This post was last modified on June 10, 2025 10:43 pm
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…
సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆ కేసులో బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే.…
కేవలం ఒక్క రోజు గ్యాప్ లో శ్రీవిష్ణు రెండు సినిమాలు రిలీజ్ కానుండటం గురించి అభిమానుల కంటే ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్…