Political News

బాబు సెలెక్షన్ ఏపాటిదో చెప్పే ఘటన ఇది!

ఏపీలో 2019-24 మధ్య సాగిన వైసీపీ పాలనలో ప్రభుత్వ సలహాదారుల ఎంపిక ఏ రీతిన సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన కుటుంబం ఆధ్వర్యంలోని సాక్షిలో పనిచేసిన చాలా మంది జర్నలిస్టులకు ఆయన ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. ఇంకా లోతుగా వెళితే చాలానే ఉంది గానీ… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సలహాదారులుగా ఎంపిక చేస్తున్న వారి అర్హతలు, వారి పూర్వానుభవం, వారి రంగాల్లో వారు సాధించిన ఘనతలు చెప్పుకుంటూ పోతే… చాంతాడంత అవుతుంది. అలాంటి ఎంపికల్లో డీఆర్డీఓ చైర్మన్ గా సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన ఏపీ వాసి సతీష్ రెడ్డికి ఇటీవలే బాబు ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఎంపిక చేశారు.

సరే… సతీష్ రెడ్డి గురించి చెప్పాలంటే నిజంగానే చాంతాడంత ఉంటుంది. రక్షణ రంగంలో ఆయన విశేష కృషి చేశారు. ఏపీలో కూటమి సర్కారు అధికారం చేపట్టిన కొంతకాలానికి సతీష్ రెడ్డి, ఇస్రో చైర్మన్ గా పనిచేసిన తన మిత్రుడిని తీసుకుని బాబును కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య ఏపీ అబివృద్ధి, రక్షణ రంగానికి సంబంధించి ఏపీలో ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసుకునే విషయాలపై ఈ సందర్భంగా చర్చ జరగగా… ఆ బాధ్యతలేవో మీరే తీసుకోవచ్చు కదా అంటూ బాబు సతీష్ రెడ్డికి ఆఫర్ చేశారు. సతీష్ రెడ్డీ ఒప్పుకున్నారు. ఇంకేముంది ఏపీ శాస్త్ర, సాంకేతిక రంగాల సలహాదారుగా సతీష్ రెడ్డి నియమితులయ్యారు.

తాజాగా ఇప్పుడు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓ కీలక విభాగాన్ని ఏర్పాటు చేసింది. జాతీయ భద్రతా సలహా మండలి (ఎన్ఎస్ఏబీ)ని ఏర్పాటు చేసింది. రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ అలోక్ జోషి అధ్యక్షతన ఏర్పాటు అయిన ఈ సంస్థలో సతీష్ రెడ్డిని ఓ సభ్యుడిగా ఎంపిక చేస్తూ మోదీ సర్కారు మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థలో సతీష్ రెడ్డి రెండేళ్ల పాటు పనిచేయనున్నారు. ఆ తర్వాత కూడా ఆయన అందులో కొనసాగే అవకాశం ఉందని చెప్పక తప్పదు. పహల్ గాం ఉగ్రదాడి నేపథ్యంలో జాతీయ భద్రతను మరింత బలోపేతం చేసేందుకే ఈ సంస్థను కేంద్రం ఏర్పాటు చేసింది.

ఇప్పటికే జాతీయ స్థాయిలో రక్షణ శాఖ వంటి కీలక శాఖల్లో సుదీర్ఘ కాలం పాటు పనిచేయడమే కాకుండా… ఇప్పటికీ దేశ భద్రతపై ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్న సతీష్ రెడ్డికి ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చిన చంద్రబాబు ఆయనను గౌరవించడంతో పాటుగా ఆయన సేవలను ఏపీ అభివృద్ది కోసం వినియోగించుకోవాలని భావించారు. అయితే సతీష్ రెడ్డి లాంటి సమర్థుడి సేవలు ఇప్పుడు దేశానికి అవసరం అయ్యాయి. నిజంగానే ఓ ప్రభుత్వ సలహాదారు అయినా, ఓ కీలక పదవిలో నియమించే నేత అయినా, ఓ కీలక బాధ్యతను భుజానికెత్తుకునే నేత అయినా చంద్రబాబు అన్ని రకాలుగా ఆలోచించి అత్యుత్తమ ఎంపికలే చేస్తారు. ఆ మాట నిజమని ఇప్పటికే ఎన్నో సార్లు నిరూపితం కాగా… ఇప్పుడు సతీష్ రెడ్డి రూపంలో మరోమారు రుజువు అయ్యింది.

This post was last modified on June 10, 2025 10:46 pm

Share

Recent Posts

తెలుగు సినిమాను గిల్లుతున్న షారుఖ్ డైరెక్టర్

‘బాహుబలి’ దగ్గర్నుంచి ఉత్తరాదిన తెలుగు సినిమాల ఆధిపత్యం ఎలా సాగుతోందో చూస్తూనే ఉన్నాం. ‘బాహుబలి’ని తక్కువ అంచనా వేసిన బాలీవుడ్…

18 minutes ago

తండ్రి, కొడుకులు ఏపీ చ‌ట్ట‌స‌భ‌ల్లోనే…

తెలుగు రాజ‌కీయాల్లో కుటుంబ రాజ‌కీయాలు కొత్త కాదు. ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకులు, భార్య‌భ‌ర్త‌లు కూడా చ‌ట్ట‌స‌భ‌ల‌కు ప్రాథినిత్యం వ‌హించిన…

1 hour ago

టికెట్ రేట్ల తీర్పులో లాభనష్టాలు ఎవరికి

సోషల్ మీడియాలో, పరిశ్రమలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన టికెట్ రేట్ల జిఓ మీద పెద్ద చర్చ జరుగుతోంది. ప్రీమియం…

2 hours ago

అనిల్ రావిపూడి ముందే ఊహించి పెట్టారా

వెంకటేష్ - కళ్యాణ్ రామ్ కలయికలో దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న సినిమాకు 'జనవరి 12 విడుదల' టైటిల్ లాక్…

3 hours ago

న్యూయార్క్ అటార్నీ జనరల్ రేసులో తెలంగాణా బిడ్డ

ఇప్పుడు అమెరికాలో కొత్తగా వినిపిస్తున్న పేరు సరితా కోమటిరెడ్డి. ఈ తెలంగాణా బిడ్డ న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి రేసులో…

3 hours ago

విశ్వనాథ్ కాళ్లకు ఇరుముడి బంధనం

తమిళం కంటే తెలుగులోనే బాగా పెర్ఫార్మ్ చేస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ కు రెండో వారం చాలా కీలకం కానుంది.…

4 hours ago