Political News

బాబు సెలెక్షన్ ఏపాటిదో చెప్పే ఘటన ఇది!

ఏపీలో 2019-24 మధ్య సాగిన వైసీపీ పాలనలో ప్రభుత్వ సలహాదారుల ఎంపిక ఏ రీతిన సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన కుటుంబం ఆధ్వర్యంలోని సాక్షిలో పనిచేసిన చాలా మంది జర్నలిస్టులకు ఆయన ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. ఇంకా లోతుగా వెళితే చాలానే ఉంది గానీ… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సలహాదారులుగా ఎంపిక చేస్తున్న వారి అర్హతలు, వారి పూర్వానుభవం, వారి రంగాల్లో వారు సాధించిన ఘనతలు చెప్పుకుంటూ పోతే… చాంతాడంత అవుతుంది. అలాంటి ఎంపికల్లో డీఆర్డీఓ చైర్మన్ గా సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన ఏపీ వాసి సతీష్ రెడ్డికి ఇటీవలే బాబు ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఎంపిక చేశారు.

సరే… సతీష్ రెడ్డి గురించి చెప్పాలంటే నిజంగానే చాంతాడంత ఉంటుంది. రక్షణ రంగంలో ఆయన విశేష కృషి చేశారు. ఏపీలో కూటమి సర్కారు అధికారం చేపట్టిన కొంతకాలానికి సతీష్ రెడ్డి, ఇస్రో చైర్మన్ గా పనిచేసిన తన మిత్రుడిని తీసుకుని బాబును కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య ఏపీ అబివృద్ధి, రక్షణ రంగానికి సంబంధించి ఏపీలో ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసుకునే విషయాలపై ఈ సందర్భంగా చర్చ జరగగా… ఆ బాధ్యతలేవో మీరే తీసుకోవచ్చు కదా అంటూ బాబు సతీష్ రెడ్డికి ఆఫర్ చేశారు. సతీష్ రెడ్డీ ఒప్పుకున్నారు. ఇంకేముంది ఏపీ శాస్త్ర, సాంకేతిక రంగాల సలహాదారుగా సతీష్ రెడ్డి నియమితులయ్యారు.

తాజాగా ఇప్పుడు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓ కీలక విభాగాన్ని ఏర్పాటు చేసింది. జాతీయ భద్రతా సలహా మండలి (ఎన్ఎస్ఏబీ)ని ఏర్పాటు చేసింది. రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ అలోక్ జోషి అధ్యక్షతన ఏర్పాటు అయిన ఈ సంస్థలో సతీష్ రెడ్డిని ఓ సభ్యుడిగా ఎంపిక చేస్తూ మోదీ సర్కారు మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థలో సతీష్ రెడ్డి రెండేళ్ల పాటు పనిచేయనున్నారు. ఆ తర్వాత కూడా ఆయన అందులో కొనసాగే అవకాశం ఉందని చెప్పక తప్పదు. పహల్ గాం ఉగ్రదాడి నేపథ్యంలో జాతీయ భద్రతను మరింత బలోపేతం చేసేందుకే ఈ సంస్థను కేంద్రం ఏర్పాటు చేసింది.

ఇప్పటికే జాతీయ స్థాయిలో రక్షణ శాఖ వంటి కీలక శాఖల్లో సుదీర్ఘ కాలం పాటు పనిచేయడమే కాకుండా… ఇప్పటికీ దేశ భద్రతపై ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్న సతీష్ రెడ్డికి ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చిన చంద్రబాబు ఆయనను గౌరవించడంతో పాటుగా ఆయన సేవలను ఏపీ అభివృద్ది కోసం వినియోగించుకోవాలని భావించారు. అయితే సతీష్ రెడ్డి లాంటి సమర్థుడి సేవలు ఇప్పుడు దేశానికి అవసరం అయ్యాయి. నిజంగానే ఓ ప్రభుత్వ సలహాదారు అయినా, ఓ కీలక పదవిలో నియమించే నేత అయినా, ఓ కీలక బాధ్యతను భుజానికెత్తుకునే నేత అయినా చంద్రబాబు అన్ని రకాలుగా ఆలోచించి అత్యుత్తమ ఎంపికలే చేస్తారు. ఆ మాట నిజమని ఇప్పటికే ఎన్నో సార్లు నిరూపితం కాగా… ఇప్పుడు సతీష్ రెడ్డి రూపంలో మరోమారు రుజువు అయ్యింది.

This post was last modified on June 10, 2025 10:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

4 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

8 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

9 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

10 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

10 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

12 hours ago