Political News

బాబు సెలెక్షన్ ఏపాటిదో చెప్పే ఘటన ఇది!

ఏపీలో 2019-24 మధ్య సాగిన వైసీపీ పాలనలో ప్రభుత్వ సలహాదారుల ఎంపిక ఏ రీతిన సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన కుటుంబం ఆధ్వర్యంలోని సాక్షిలో పనిచేసిన చాలా మంది జర్నలిస్టులకు ఆయన ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. ఇంకా లోతుగా వెళితే చాలానే ఉంది గానీ… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సలహాదారులుగా ఎంపిక చేస్తున్న వారి అర్హతలు, వారి పూర్వానుభవం, వారి రంగాల్లో వారు సాధించిన ఘనతలు చెప్పుకుంటూ పోతే… చాంతాడంత అవుతుంది. అలాంటి ఎంపికల్లో డీఆర్డీఓ చైర్మన్ గా సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన ఏపీ వాసి సతీష్ రెడ్డికి ఇటీవలే బాబు ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఎంపిక చేశారు.

సరే… సతీష్ రెడ్డి గురించి చెప్పాలంటే నిజంగానే చాంతాడంత ఉంటుంది. రక్షణ రంగంలో ఆయన విశేష కృషి చేశారు. ఏపీలో కూటమి సర్కారు అధికారం చేపట్టిన కొంతకాలానికి సతీష్ రెడ్డి, ఇస్రో చైర్మన్ గా పనిచేసిన తన మిత్రుడిని తీసుకుని బాబును కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య ఏపీ అబివృద్ధి, రక్షణ రంగానికి సంబంధించి ఏపీలో ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసుకునే విషయాలపై ఈ సందర్భంగా చర్చ జరగగా… ఆ బాధ్యతలేవో మీరే తీసుకోవచ్చు కదా అంటూ బాబు సతీష్ రెడ్డికి ఆఫర్ చేశారు. సతీష్ రెడ్డీ ఒప్పుకున్నారు. ఇంకేముంది ఏపీ శాస్త్ర, సాంకేతిక రంగాల సలహాదారుగా సతీష్ రెడ్డి నియమితులయ్యారు.

తాజాగా ఇప్పుడు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓ కీలక విభాగాన్ని ఏర్పాటు చేసింది. జాతీయ భద్రతా సలహా మండలి (ఎన్ఎస్ఏబీ)ని ఏర్పాటు చేసింది. రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ అలోక్ జోషి అధ్యక్షతన ఏర్పాటు అయిన ఈ సంస్థలో సతీష్ రెడ్డిని ఓ సభ్యుడిగా ఎంపిక చేస్తూ మోదీ సర్కారు మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థలో సతీష్ రెడ్డి రెండేళ్ల పాటు పనిచేయనున్నారు. ఆ తర్వాత కూడా ఆయన అందులో కొనసాగే అవకాశం ఉందని చెప్పక తప్పదు. పహల్ గాం ఉగ్రదాడి నేపథ్యంలో జాతీయ భద్రతను మరింత బలోపేతం చేసేందుకే ఈ సంస్థను కేంద్రం ఏర్పాటు చేసింది.

ఇప్పటికే జాతీయ స్థాయిలో రక్షణ శాఖ వంటి కీలక శాఖల్లో సుదీర్ఘ కాలం పాటు పనిచేయడమే కాకుండా… ఇప్పటికీ దేశ భద్రతపై ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్న సతీష్ రెడ్డికి ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చిన చంద్రబాబు ఆయనను గౌరవించడంతో పాటుగా ఆయన సేవలను ఏపీ అభివృద్ది కోసం వినియోగించుకోవాలని భావించారు. అయితే సతీష్ రెడ్డి లాంటి సమర్థుడి సేవలు ఇప్పుడు దేశానికి అవసరం అయ్యాయి. నిజంగానే ఓ ప్రభుత్వ సలహాదారు అయినా, ఓ కీలక పదవిలో నియమించే నేత అయినా, ఓ కీలక బాధ్యతను భుజానికెత్తుకునే నేత అయినా చంద్రబాబు అన్ని రకాలుగా ఆలోచించి అత్యుత్తమ ఎంపికలే చేస్తారు. ఆ మాట నిజమని ఇప్పటికే ఎన్నో సార్లు నిరూపితం కాగా… ఇప్పుడు సతీష్ రెడ్డి రూపంలో మరోమారు రుజువు అయ్యింది.

This post was last modified on June 10, 2025 10:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

2 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago