Political News

రేపే విచారణకు కేసీఆర్.. మేనల్లుడితో సుదీర్ఘ చర్చ

తెలంగాణ రాజకీయాల్లో బుధవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. భారత రాష్ట్ర సమతి (బీఆర్ఎస్) అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనా కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారు. అయితే ఆ ప్రాజెక్టులోని కీలక భాగం అయిన మేడిగడ్డ డ్యామ్ ఉపరితలం కుంగింది. దీనిపై ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఏకంగా విచారణకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ విచారణకు ఇప్పటికే నాటి సాగునీటి శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ లు హాజరయ్యారు.

ఈ క్రమంలో ఈ నెల 11న అంటే… బుధవారం కేసీఆర్ ఈ కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. ఇంందుకోసం కమిషన్ కార్యాలయం ఉన్న బీఆర్కే భవన్ కు కేసీఆర్ వెళ్లనున్నారు. కేసీఆర్ వెంట ఆ పార్టీకి చెందిన కీలక నేతలు చాలా మందే బీఆర్కే భవన్ కు తరలివెళ్లనున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ నెల 5ననే కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఏమనుకున్నారో, ఏమో తెలియదు గానీ, తాను ఈ నెల 5న కాకుండా 11న విచారణకు హాజరు అవుతానంటూ కేసీఆర్ కమిషన్ కు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు కమిషన్ కూడా ఓకే అనడంతో బుధవారం కేసీఆర్ విచారణకు హాజరు అవుతున్నారు.

బుధవారం కేసీఆర్ విచారణకు హాజరు అవుతున్న నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నమే ఆయన మేనల్లుడు, ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్లి వచ్చిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఎర్రవలి ఫామ్ హౌస్ చేరుకున్నారు. కమిషన్ విచారణలో ఎలాంటి ప్రశ్నలు ఎధురు కానున్నాయి? వాటికి ఎలాంటి సమాధానాలు ఇవ్వాలన్న విషయంపై మామాఅల్లుళ్లు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చర్చలు మంగళవారం రాత్రి పొద్దు పోయేదాకా జరిగాయి. మొత్తం ప్రాజెక్టుపై సమగ్ర విశ్లేషణలు చేసుకున్న వీరిద్దరూ… కమిషన్ ప్రశ్నలకు తడబడకుండా సమాధానాలు ఇవ్వడంతో పాటుగా వాటికి సంబంంధించిన ఆధారాలను కూడా అందజేసే దిశగా ెకసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.

This post was last modified on June 10, 2025 7:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…

44 minutes ago

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

2 hours ago

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

2 hours ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

3 hours ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

3 hours ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

4 hours ago