సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు(కేఎస్ ఆర్) అరెస్టు నేపథ్యంలో ఆయనపై నమోదైన కేసుల వివరాలను పోలీసులు వెల్లడించారు. అమరావతిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం..అక్కడి మహిళలను తీవ్రంగా కించపరచడం వంటివి సాక్షి టీవీలో వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరైనా.. నాడు యాంకర్గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు వీటిని అప్పటికప్పుడు ఖండించలేదన్నది ప్రధాన విమర్శ.
ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతానికి చెందిన తుళ్లూరు మహిళలు.. ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తుళ్లూరు పోలీసులు ఆయనను సోమవారం ఉదయం హైదరాబాద్లో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తనకు కనీసం ఎలాంటి ఇంటిమేషన్ లేకుండానే అరెస్టు చేస్తున్నారని.. కొమ్మినేని వాదించారు. అంతేకాదు.. తనకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని కోరారు. కానీ, కేసు తీవ్రత కావొచ్చు.. మహిళల ఆగ్రహం కావొచ్చు.. ఏదైనా పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
తర్వాత.. ఇచ్చిన సమాచారం మేరకు కొమ్మినేనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖల చేసిన కేసులో యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్, ఈ వ్యాఖ్యలు చేసిన విశ్లేషకుడు కృష్ణంరాజు, ఈ డిబేట్ నిర్వహించిన సాక్షి యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదైనట్టు పోలీసులు తెలిపారు.
ఇక, సెక్షన్ల విషయానికి వస్తే.. బీఎన్ ఎస్ ఎస్(భారతీయ న్యాయ సురక్షాసంహిత చట్టం) ప్రకారం 79, 196(1), 353(2), 299, 356(2), 61(1)BNS, 67 ITA-2008, 3(1)(U), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ఈ సెక్షన్లు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వీటి ప్రకారం.. బెయిల్ కూడా దక్కే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
This post was last modified on June 9, 2025 3:08 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…