సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు(కేఎస్ ఆర్) అరెస్టు నేపథ్యంలో ఆయనపై నమోదైన కేసుల వివరాలను పోలీసులు వెల్లడించారు. అమరావతిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం..అక్కడి మహిళలను తీవ్రంగా కించపరచడం వంటివి సాక్షి టీవీలో వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరైనా.. నాడు యాంకర్గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు వీటిని అప్పటికప్పుడు ఖండించలేదన్నది ప్రధాన విమర్శ.
ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతానికి చెందిన తుళ్లూరు మహిళలు.. ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తుళ్లూరు పోలీసులు ఆయనను సోమవారం ఉదయం హైదరాబాద్లో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తనకు కనీసం ఎలాంటి ఇంటిమేషన్ లేకుండానే అరెస్టు చేస్తున్నారని.. కొమ్మినేని వాదించారు. అంతేకాదు.. తనకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని కోరారు. కానీ, కేసు తీవ్రత కావొచ్చు.. మహిళల ఆగ్రహం కావొచ్చు.. ఏదైనా పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
తర్వాత.. ఇచ్చిన సమాచారం మేరకు కొమ్మినేనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖల చేసిన కేసులో యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్, ఈ వ్యాఖ్యలు చేసిన విశ్లేషకుడు కృష్ణంరాజు, ఈ డిబేట్ నిర్వహించిన సాక్షి యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదైనట్టు పోలీసులు తెలిపారు.
ఇక, సెక్షన్ల విషయానికి వస్తే.. బీఎన్ ఎస్ ఎస్(భారతీయ న్యాయ సురక్షాసంహిత చట్టం) ప్రకారం 79, 196(1), 353(2), 299, 356(2), 61(1)BNS, 67 ITA-2008, 3(1)(U), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ఈ సెక్షన్లు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వీటి ప్రకారం.. బెయిల్ కూడా దక్కే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
This post was last modified on June 9, 2025 3:08 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…