Political News

వాళ్లు కూడా ఒక తల్లికి పుట్టిన వాళ్లే కదా: ర‌ఘురామ సీరియ‌స్

అమ‌రావ‌తిలో మ‌హిళ‌ల‌పై సాక్షి టీవీలో జ‌రిగిన చ‌ర్చ‌.. ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యాత‌గా ఉన్న కృష్ణంరాజు చేసిన తీవ్ర వ్యాఖ్య‌ల‌పై రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళ‌లు ఉద్య‌మిస్తున్నారు. ఈ వేడి త‌గ్గ‌క‌పోగా.. మ‌రింత పెరుగుతోంది. తాజాగా ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణరాజు సీరియ‌స్ అయ్యారు. “ఆ వ్యాఖ్య‌లు చేసిన వాళ్లు కూడా ఒక త‌ల్లికి పుట్టిన వాళ్లే క‌దా!” అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును అమరావతి మహిళలు క‌లిశారు. ఆయ‌న‌కు వినతి పత్రం అందజేశారు.

ఈ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ గా పనిచేసిన కొమ్మినేని.. జర్నలిస్టులకు విధివిధానాలు నేర్పాల్సిన వ్యక్తి ఇలా జర్నలిజం విలువలు మర్చిపోయాడని వ్యాఖ్యానించారు. కృష్ణంరాజు అనే నీచుడు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే వెక్కిలి నవ్వులు నవ్వుతూ.. అలా సపోర్ట్ చేయడం అనేది తీవ్రమైన చర్యగా పేర్కొన్నారు.

“రెండు రోజుల నుంచి చూస్తున్నాం మహిళా లోకం ఉవ్వెత్తున తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే డిజిపి కి లేఖ రాశా. బిజెపికి తగు చర్యలు తీసుకోవాలని తెలియపరిచా. నాకైతే విశ్వాసం ఉంది రాబోయే 24 గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేస్తాం అని ముఖ్యమంత్రి కూడా ట్విట్టర్ లో గట్టిగా చెప్పారు. అమరావతి పై ముందు నుంచే విష్ప్రచారం చేశారు. గతంలో మాట్లాడిన దానికంటే ఇప్పుడు రాష్ట్రంలో పరాకాష్టకు చేరింది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తే చెప్పు తీసుకొని కొడతారు.” అని ర‌ఘురామ వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. లక్ష్మీపార్వతిని ఎవడో ఒక మాటంటే సాక్షిలో కట్ చేశాడని, సాక్షిలో ప్రసారం అయితే సాక్షికి సంబంధం లేదు అంటే ఎవరూ ఊరుకుంటారని ప్ర‌శ్నించారు. సాక్షి యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకుంటే సాక్షికి సంబంధం లేదు అనుకునేవాళ్లమ‌ని వ్యాఖ్యానించారు. “వాళ్లు కూడా ఒక తల్లికి పుట్టిన వాళ్లే కదా. మహిళల గురించి ఎలా మాట్లాడుతారు?. వాళ్ళు తాలూకా వాళ్లే ఓ ఇంగ్లీష్ పేపర్లో రాయటం. అది పేపర్లో వచ్చిందని ఈ పనికిమాలిన‌ వాళ్లు ప్రసారం చేయటం. ఇదంతా రాజధానిపై బురదజల్లే ప్రయత్నం.” అని ర‌ఘురామ అన్నారు.

This post was last modified on June 9, 2025 3:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

50 minutes ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

53 minutes ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

1 hour ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

1 hour ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

2 hours ago

అస్సీలో అంత మ్యాటర్ ఉందంటారా

గత కొన్ని రోజులుగా ఇంటర్వ్యూలతో హీరోయిన్ తాప్సీ తెగ హడావుడి చేస్తోంది. కారణం తన బాలీవుడ్ మూవీ అస్సీ ఇటీవలే…

4 hours ago