వైసీపీ అధినేత జగన్ సొంత మీడియా చానెల్ సాక్షిలో అమరావతి రాజధానిపై ఓ రాజకీయ వ్యాఖ్యాత, జర్నలిస్టు.. చేసిన అత్యంత జుగుప్సాకర వ్యాఖ్యలు.. ప్రజల్లో ఎంత తీవ్రమైన ఆవేదన కలిగిస్తోందో.. వారి గుండెలు ఎలా రగిలిపోతున్నాయో.. చెప్పేందుకు.. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమరావతిలో ఉన్నవారంతా.. ‘ఆ తరహా’ మహిళలేనని సదరు వ్యాఖ్యాత కామెంట్లు చేయడం.. దానిని పూర్తిగా ఖండించకుండా.. యాంకర్ వ్యవహరించడంపై ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు.
నిజానికి నిన్నటి వరకు వైసీపీ నాయకులు.. ఇది టీడీపీ, జనసేనలకు మాత్రమే పరిమితమైందని అనుకు న్నారు. కానీ, ఇప్పుడు జన సామాన్యానికి కూడా ఈ వ్యవహారం అర్ధమైంది. దీంతో ప్రజలు తిరగబడుతు న్నారు. పైకి ఎలా ఉన్నా.. వారు చేస్తున్న చేతలు చూస్తే.. వైసీపీని,.. సాక్షి మీడియాను ఎంతగా తిట్టి పోస్తున్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా ఓ మహిళ తన టీవీని బయటకు తీసుకువచ్చి.. నీటితో కడగడమే కాకుండా.. ఒకటికి రెండు సార్లు లిక్విడ్ వేసి మరీ శుభ్రం చేయడం.. శుద్ధి చేసుకోవడం గమనార్హం.
ఇది మహిళల్లో ఉన్న ఆగ్రహాన్ని.. విషయ తీవ్రతను కళ్లకు కడుతోంది. ఇదేమీ చిన్న విషయం కాదు. చాలా సీరియస్గానే ప్రజలు చర్చిస్తున్నారు. దీనిపై కారాలు మిరియాలు నూరుతున్నారు.లేకపోతే.. వేలకు వేలు పోసి కొనుగోలుచేసుకున్న టీవీలకు దిష్టి తీయడం.. నీటితో శుద్ధి చేసుకోవడం.. లిక్విడ్ వేసు కడుక్కోవడం అంటే.. మాటలా?! ప్రత్యర్థి పక్షం ఔనన్నా కాదన్నా.. రాష్ట్ర ప్రజలు అమరావతిని కోరుకుంటున్నారు. అలాంటి ప్రాంతంపై వేరే రూపంలో వెగటు పుట్టించేలా చేయాలన్న వైసీపీ ప్రయత్నాలను కూడా వారు “కడిగేస్తున్నారనే” వాదన వినిపిస్తోంది.
This post was last modified on June 9, 2025 12:17 pm
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…