వైసీపీ అధినేత జగన్ సొంత మీడియా చానెల్ సాక్షిలో అమరావతి రాజధానిపై ఓ రాజకీయ వ్యాఖ్యాత, జర్నలిస్టు.. చేసిన అత్యంత జుగుప్సాకర వ్యాఖ్యలు.. ప్రజల్లో ఎంత తీవ్రమైన ఆవేదన కలిగిస్తోందో.. వారి గుండెలు ఎలా రగిలిపోతున్నాయో.. చెప్పేందుకు.. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమరావతిలో ఉన్నవారంతా.. ‘ఆ తరహా’ మహిళలేనని సదరు వ్యాఖ్యాత కామెంట్లు చేయడం.. దానిని పూర్తిగా ఖండించకుండా.. యాంకర్ వ్యవహరించడంపై ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు.
నిజానికి నిన్నటి వరకు వైసీపీ నాయకులు.. ఇది టీడీపీ, జనసేనలకు మాత్రమే పరిమితమైందని అనుకు న్నారు. కానీ, ఇప్పుడు జన సామాన్యానికి కూడా ఈ వ్యవహారం అర్ధమైంది. దీంతో ప్రజలు తిరగబడుతు న్నారు. పైకి ఎలా ఉన్నా.. వారు చేస్తున్న చేతలు చూస్తే.. వైసీపీని,.. సాక్షి మీడియాను ఎంతగా తిట్టి పోస్తున్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా ఓ మహిళ తన టీవీని బయటకు తీసుకువచ్చి.. నీటితో కడగడమే కాకుండా.. ఒకటికి రెండు సార్లు లిక్విడ్ వేసి మరీ శుభ్రం చేయడం.. శుద్ధి చేసుకోవడం గమనార్హం.
ఇది మహిళల్లో ఉన్న ఆగ్రహాన్ని.. విషయ తీవ్రతను కళ్లకు కడుతోంది. ఇదేమీ చిన్న విషయం కాదు. చాలా సీరియస్గానే ప్రజలు చర్చిస్తున్నారు. దీనిపై కారాలు మిరియాలు నూరుతున్నారు.లేకపోతే.. వేలకు వేలు పోసి కొనుగోలుచేసుకున్న టీవీలకు దిష్టి తీయడం.. నీటితో శుద్ధి చేసుకోవడం.. లిక్విడ్ వేసు కడుక్కోవడం అంటే.. మాటలా?! ప్రత్యర్థి పక్షం ఔనన్నా కాదన్నా.. రాష్ట్ర ప్రజలు అమరావతిని కోరుకుంటున్నారు. అలాంటి ప్రాంతంపై వేరే రూపంలో వెగటు పుట్టించేలా చేయాలన్న వైసీపీ ప్రయత్నాలను కూడా వారు “కడిగేస్తున్నారనే” వాదన వినిపిస్తోంది.
This post was last modified on June 9, 2025 12:17 pm
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…