Political News

సాక్షి ఎఫెక్ట్‌: టీవీల‌ను శుద్ధి చేసుకుంటున్నారు!

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత మీడియా చానెల్ సాక్షిలో అమ‌రావ‌తి రాజ‌ధానిపై ఓ రాజ‌కీయ వ్యాఖ్యాత‌, జ‌ర్న‌లిస్టు.. చేసిన అత్యంత జుగుప్సాక‌ర వ్యాఖ్య‌లు.. ప్ర‌జ‌ల్లో ఎంత తీవ్రమైన ఆవేద‌న క‌లిగిస్తోందో.. వారి గుండెలు ఎలా రగిలిపోతున్నాయో.. చెప్పేందుకు.. తాజాగా ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అమ‌రావ‌తిలో ఉన్న‌వారంతా.. ‘ఆ త‌ర‌హా’ మ‌హిళ‌లేన‌ని స‌ద‌రు వ్యాఖ్యాత కామెంట్లు చేయ‌డం.. దానిని పూర్తిగా ఖండించ‌కుండా.. యాంక‌ర్ వ్య‌వ‌హ‌రించ‌డంపై ప్ర‌జ‌లు నిప్పులు చెరుగుతున్నారు.

నిజానికి నిన్న‌టి వ‌ర‌కు వైసీపీ నాయ‌కులు.. ఇది టీడీపీ, జ‌న‌సేన‌ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంద‌ని అనుకు న్నారు. కానీ, ఇప్పుడు జ‌న సామాన్యానికి కూడా ఈ వ్య‌వ‌హారం అర్ధ‌మైంది. దీంతో ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డుతు న్నారు. పైకి ఎలా ఉన్నా.. వారు చేస్తున్న చేత‌లు చూస్తే.. వైసీపీని,.. సాక్షి మీడియాను ఎంత‌గా తిట్టి పోస్తున్నార‌న్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. తాజాగా ఓ మ‌హిళ త‌న టీవీని బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి.. నీటితో క‌డ‌గ‌డ‌మే కాకుండా.. ఒక‌టికి రెండు సార్లు లిక్విడ్ వేసి మ‌రీ శుభ్రం చేయ‌డం.. శుద్ధి చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఇది మ‌హిళ‌ల్లో ఉన్న ఆగ్ర‌హాన్ని.. విష‌య తీవ్ర‌త‌ను క‌ళ్ల‌కు క‌డుతోంది. ఇదేమీ చిన్న విష‌యం కాదు. చాలా సీరియ‌స్‌గానే ప్ర‌జ‌లు చ‌ర్చిస్తున్నారు. దీనిపై కారాలు మిరియాలు నూరుతున్నారు.లేక‌పోతే.. వేల‌కు వేలు పోసి కొనుగోలుచేసుకున్న టీవీల‌కు దిష్టి తీయ‌డం.. నీటితో శుద్ధి చేసుకోవ‌డం.. లిక్విడ్ వేసు క‌డుక్కోవ‌డం అంటే.. మాటలా?! ప్ర‌త్య‌ర్థి ప‌క్షం ఔన‌న్నా కాద‌న్నా.. రాష్ట్ర ప్ర‌జ‌లు అమ‌రావ‌తిని కోరుకుంటున్నారు. అలాంటి ప్రాంతంపై వేరే రూపంలో వెగ‌టు పుట్టించేలా చేయాల‌న్న వైసీపీ ప్ర‌య‌త్నాలను కూడా వారు “క‌డిగేస్తున్నార‌నే” వాద‌న వినిపిస్తోంది.

This post was last modified on June 9, 2025 12:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago