Political News

సాక్షి ఎఫెక్ట్‌: టీవీల‌ను శుద్ధి చేసుకుంటున్నారు!

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత మీడియా చానెల్ సాక్షిలో అమ‌రావ‌తి రాజ‌ధానిపై ఓ రాజ‌కీయ వ్యాఖ్యాత‌, జ‌ర్న‌లిస్టు.. చేసిన అత్యంత జుగుప్సాక‌ర వ్యాఖ్య‌లు.. ప్ర‌జ‌ల్లో ఎంత తీవ్రమైన ఆవేద‌న క‌లిగిస్తోందో.. వారి గుండెలు ఎలా రగిలిపోతున్నాయో.. చెప్పేందుకు.. తాజాగా ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అమ‌రావ‌తిలో ఉన్న‌వారంతా.. ‘ఆ త‌ర‌హా’ మ‌హిళ‌లేన‌ని స‌ద‌రు వ్యాఖ్యాత కామెంట్లు చేయ‌డం.. దానిని పూర్తిగా ఖండించ‌కుండా.. యాంక‌ర్ వ్య‌వ‌హ‌రించ‌డంపై ప్ర‌జ‌లు నిప్పులు చెరుగుతున్నారు.

నిజానికి నిన్న‌టి వ‌ర‌కు వైసీపీ నాయ‌కులు.. ఇది టీడీపీ, జ‌న‌సేన‌ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంద‌ని అనుకు న్నారు. కానీ, ఇప్పుడు జ‌న సామాన్యానికి కూడా ఈ వ్య‌వ‌హారం అర్ధ‌మైంది. దీంతో ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డుతు న్నారు. పైకి ఎలా ఉన్నా.. వారు చేస్తున్న చేత‌లు చూస్తే.. వైసీపీని,.. సాక్షి మీడియాను ఎంత‌గా తిట్టి పోస్తున్నార‌న్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. తాజాగా ఓ మ‌హిళ త‌న టీవీని బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి.. నీటితో క‌డ‌గ‌డ‌మే కాకుండా.. ఒక‌టికి రెండు సార్లు లిక్విడ్ వేసి మ‌రీ శుభ్రం చేయ‌డం.. శుద్ధి చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఇది మ‌హిళ‌ల్లో ఉన్న ఆగ్ర‌హాన్ని.. విష‌య తీవ్ర‌త‌ను క‌ళ్ల‌కు క‌డుతోంది. ఇదేమీ చిన్న విష‌యం కాదు. చాలా సీరియ‌స్‌గానే ప్ర‌జ‌లు చ‌ర్చిస్తున్నారు. దీనిపై కారాలు మిరియాలు నూరుతున్నారు.లేక‌పోతే.. వేల‌కు వేలు పోసి కొనుగోలుచేసుకున్న టీవీల‌కు దిష్టి తీయ‌డం.. నీటితో శుద్ధి చేసుకోవ‌డం.. లిక్విడ్ వేసు క‌డుక్కోవ‌డం అంటే.. మాటలా?! ప్ర‌త్య‌ర్థి ప‌క్షం ఔన‌న్నా కాద‌న్నా.. రాష్ట్ర ప్ర‌జ‌లు అమ‌రావ‌తిని కోరుకుంటున్నారు. అలాంటి ప్రాంతంపై వేరే రూపంలో వెగ‌టు పుట్టించేలా చేయాల‌న్న వైసీపీ ప్ర‌య‌త్నాలను కూడా వారు “క‌డిగేస్తున్నార‌నే” వాద‌న వినిపిస్తోంది.

This post was last modified on June 9, 2025 12:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

2 hours ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

4 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

4 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

5 hours ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

6 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

6 hours ago