Political News

మ‌ట్టిని కూడా వ‌ద‌ల్లేదా.. వైసీపీ నేత‌ల‌పై నివేదిక‌లు..!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన అక్ర‌మాలు, అవినీతిపై ప్ర‌భుత్వం ఇంకా నివేదిక‌లు తెప్పించుకుంటూనే ఉంది. గ‌త జ‌గ‌న్ పాల‌న‌లో జ‌రిగిన మ‌ద్యం, ఇసుక అక్ర‌మాల‌పై విచార‌ణ‌లు జ‌రుగుతున్నాయి. అయితే.. ఇప్పుడు ఇసుక ల‌భ్య‌త లేని సీమ‌లోని ప‌లు జిల్లాల్లో మ‌ట్టి అక్ర‌మాల‌పై విచార‌ణ చేయించేందుకు ప్ర‌భు త్వం రెడీ అయింది. మ‌ట్టిని కూడా వ‌ద‌ల‌కుండా గ‌త వైసీపీ నాయ‌కులు, మంత్రులు దోచుకున్నార‌న్న‌ది స‌ర్కారుకు వ‌చ్చిన ఫిర్యాదుల‌ను బ‌ట్టి తెలుస్తోంది.

వీటిపైనే ఇప్పుడు ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించేందుకు సిద్ధ‌మైంది. మ‌ట్టి అక్ర‌మాలు ఏ రేంజ్‌లో జ‌రిగాయి? ఎవ‌రెవ‌రి పాత్ర ఉంది? ఎంత మొత్తం నిధులు దారి మ‌ళ్లాయి? అప్ప‌టి ప్ర‌భుత్వానికి ఈ విష‌యం తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉంది? ఇలా.. అనేక విష‌యాల‌పై కూపీ లాగేందుకు నిర్ణ‌యించుకుంది. ఈ బాధ్య‌త‌ల‌ను జిల్లాల డిప్యూటీ క‌లెక్ట‌ర్ల‌కు అప్ప‌గించింది. దీంతో గ‌త నాలుగు రోజుల కింద‌టే మ‌ట్టి అక్ర‌మాల‌పై నివేదిక‌లు ప్ర‌భుత్వానికి చేరాయ‌ని తెలిసింది.

అయితే.. వీటిని గోప్యంగా ఉంచుతున్నారు. దీనికి కూడా కార‌ణం ఉంద‌ని స‌మాచారం. అప్ప‌ట్లో జ‌రిగిన అక్ర‌మాల్లో కొంద‌రు అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నాయ‌కులు కూడా ఉన్నార‌ని నివేదిక‌లు తేల్చాయ‌ని స‌మాచారం. అయిన‌ప్ప‌టికీ.. విచార‌ణ‌కు ఆదేశించాల‌న్న‌ది ప్ర‌భుత్వ ఉద్దేశం. కానీ.. ఇది విచార‌ణ‌కు వ‌స్తే.. కొంద‌రు అధికార పార్టీ నాయ‌కులు కూడా ఇరుకున ప‌డే అవ‌కాశం ఉంద‌ని మ‌రో వాద‌న వినిపిస్తోంది. అలాగ‌ని వైసీపీ నాయ‌కుల‌ను వ‌దిలేది లేద‌న్న వాద‌నా వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. క‌ర్నూలు, క‌డ‌ప‌, కృష్ణా, వెస్ట్ గోదావ‌రి ఉమ్మ‌డి జిల్లాల్లో వైసీపీ నాయ కులు భారీ ఎత్తున మ‌ట్టిని త‌ర‌లించారు. అప్ప‌ట్లో నిర్మాణాలు ప్రారంభించిన జ‌గ‌న‌న్న ఇళ్ల‌కు ఈ మ‌ట్టిని త‌ర‌లించి.. అటు ప్ర‌భుత్వం నుంచి ఇటు.. అక్ర‌మాల రూపంలోనూ సొమ్ములు పోగేసుకున్న‌ట్టు నివేదిక‌లు చెబుతున్నాయ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం నిర్మాణం పూర్తి చేసుకున్న జ‌గ‌నన్న ఇళ్ల‌పైనా విచార‌ణ‌కు ఆదేశిస్తే.. మ‌రిన్ని వాస్త‌వాలు వెలుగు చూసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు పేర్కొన్నారు. దీనిపై ప్ర‌స్తుతం అంత‌ర్గ‌త విచార‌ణ అయితే.. జోరుగా సాగుతోంది.

This post was last modified on June 8, 2025 2:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

8 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

9 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

10 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

10 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

13 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

14 hours ago