ఏపీ సీఎం చంద్రబాబుకు ఇంటా-బయటా కూడా.. ప్రధాన సవాళ్లు ఎదురవుతున్నాయి. గతంలో టీడీపీలో పనిచేసి.. ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటున్న ఒకరిద్దరు సీనియర్ నాయకులు రాజధాని అమరావతికివ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమమే లేవదీ స్తున్నారు. వయసు రీత్యా వృద్ధులే అయినా.. మాటల పరంగా వారు చేస్తున్న ప్రచారం.. అమరావతికి శరాఘాతంగా మారు తోంది. ఉదాహరణకు మాజీ మంత్రి, టీడీపీ మాజీ నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు.. అమరావతి రాజధానికి వ్యతిరేకంగా గత నెల రోజులుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా శనివారం కూడా ఆయన అమరావతిలోనే ప్రసంగాలతో దంచికొట్టారు.
ఇప్పటికే 33 వేల ఎకరాలను సేకరించారని.. ఇప్పుడు మరో 44 వేల ఎకరాలను తీసుకుంటున్నారని.. దీనివల్ల.. ప్రయోజనం లేదని.. వడ్డే చెబుతున్నారు.రాజధానికి భూములు ఇవ్వొద్దని.. ఆయన చెబుతున్నారు. అంతేకాదు.. వ్యవసాయ సంఘాలను కూడా ఏకం చేసి రైతుల మైండ్ సెట్ను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి మరోవైపు ప్రతిపక్షం వైసీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారానికి చంద్రబాబు చెక్ పెడుతున్నా.. ఇలా.. గతంలో తన దగ్గరే మంత్రులుగా చక్రాలు తిప్పిన వారు చేస్తున్న యాంటీ ప్రచారాన్ని చంద్రబాబు అడ్డుకోలేక పోతున్నారు.
ఇక, మరో కీలక విషయం.. పోలవరం, బనకచర్ల. ఈ రెండు ప్రాజెక్టులను కూడా చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే 2027 నాటికి పోలవరం, 2028 నాటికి బనకచర్ల పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పోలవరం అంటే అందరికీ తెలిసిందే. ఇప్పటికే నిర్మాణ పనులు కూడా సాగుతున్నాయి. ఇక, కొత్త ప్రాజెక్టు బనకచర్ల. దీనికి డీపీఆర్ మాత్రమే ఇప్పటి వర కు రెడీ అయింది. దీనికి కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. ఇది సాగుతున్న క్రమంలోనే తెలంగాణ నుంచి తీవ్రమైన ఒత్తిడి పడుతోంది.
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ నుంచి బనకచర్ల ప్రాజెక్టుకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. అంతేకాదు.. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు.. గత వారం రోజులుగా బనకచర్ల ప్రాజెక్టును టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వివాదంలోకి బీజేపీని, కాంగ్రెస్ను కూడా చాలా లౌక్యంగా తీసుకువస్తున్నారు. ఈ పరిణామాలు తీవ్ర రూపం దాల్చితే.. బనకచర్లపై కేంద్రం యూటర్న్ తీసుకునే ప్రమాదం కూడా ఉంది.
అంతేకాదు.. బీజేపీకి ఏపీ మాత్రమే కాదు.. తెలంగాణ రాజకీయ పరిణామాలు కూడా కీలకమైన నేపథ్యంలో ఈ ప్రబావం కూడా చంద్రబాబుపై పడనుందని అంటున్నారు. సో.. అటు అమరావతి, ఇటు పోలవరం, బనకచర్ల విషయాల్లో చంద్రబాబుకు ఇంటా -బయటా కూడా.. సెగ తగులుతుండడం గమనార్హం.
This post was last modified on June 8, 2025 12:09 pm
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…