Political News

`సంతృప్తి`.. మ‌ళ్లీ పెరిగింది.. ఈసారి ఎంతంటే.. !

చంద్ర‌బాబు పాల‌న‌లో సంతృప్తి కొల‌మానాలు స‌హ‌జం. ఎప్ప‌టిక‌ప్పుడు.. ప్ర‌భుత్వం అందిస్తున్న పాల‌న పై ఆయ‌న లెక్క‌లు వేసుకుని గ‌ణాంకాల‌తో స‌హా ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం రివాజు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన 11 మాసాల్లో 10కి పైగా స‌ర్వేలు చేయించారు. వీటిలో ఆయా ప‌థ‌కాలు.. ప్ర‌భుత్వ పాల‌న‌, ఎమ్మెల్యేల ప‌నితీరు, మంత్రుల రికార్డు, సీఎంగా చంద్ర‌బాబు ప‌నితీరు.. ఇలా అనేకం ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా ఎక్క‌డా లేని విధంగా మ‌ద్యంపైనా స‌ర్వే చేయించారు.

తాజాగా రెండు అంశాల‌పై ప్ర‌భుత్వం మ‌రో స‌ర్వే నిర్వ‌హించింది. అది.. 1) రేష‌న్ దుకాణాలు. 2) స‌చివాలయ వ్య‌వ‌స్థ‌. ఈ రెండు కూడా.. కీల‌క‌మ‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న విష‌యం తెలిసిందే. పైగా.. ఈ రెండు కూడా.. మార్పులు జ‌రిగాయి. గ‌త వైసీపీ హ‌యాంలో రేష‌న్ బ‌ళ్లు ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చేవి. అయితే.. ఈ వాహ‌నాల ద్వారా అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని, పైగా 1200 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఏటా ఖ‌ర్చ‌వుతోందని ప్ర‌భుత్వం లెక్క‌లు వేసుకుంది. ఈ నేప‌థ్యంలోనే వాటిని తీసేసింది.

ఇక‌, గ‌త పాత విధానం అయిన రేష‌న్ దుకాణాల‌ను తిరిగి తీసుకువ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ నెల 1వ తేదీ నుంచి కూడా.. రేష‌న్ దుకాణాల ద్వారానే రేష‌న్ పంపిణీ జ‌రుగుతోంది. వృద్ధులు, విక‌లాంగులు ల‌బ్దిదారులుగా ఉంటే వారికి మాత్రం ఇంటి వ‌ద్ద‌కు రేష‌న్ పంపించే బాధ్య‌త‌ను రేష‌న్ దుకాణ దారుల‌కే అప్ప‌గించారు. ఈ నేప‌థ్యంలో ఈ నెల 5న ఒక్క‌రోజులోనే ప్ర‌బుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐవీఆర్ ఎస్ ద్వారా స‌ర్వే చేప‌ట్టింది. రేష‌న్ దుకాణాల‌ను కొన‌సాగించ‌డం బాగుందా? అనే దానిపై అభిప్రాయాలు తీసుకుంది.

దీనికి మెజారిటీ ల‌బ్దిదారులు బాగుంద‌ని స‌మాధానం చెప్పార‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. గ‌తంలో బ‌ళ్లు ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చేవి కాద‌ని.. పైగా అవి ఎప్పుడు వ‌స్తాయో తెలియ‌క త‌మ ప‌నులు మానుకోవాల్సి వ‌చ్చేద‌ని కూడా ల‌బ్ధిదారులు వివ‌రించారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం చేసిన మార్పును 99 శాతం మంది అంగీక‌రించార‌ని స‌ర్వే చెప్పింది. ఇక‌, స‌చివాల‌య వ్య‌వ‌స్థ ఉన్నా.. ప్ర‌యోజ‌నం లేద‌ని.. గ‌తంలో ఉన్న కార్యాల‌యాలే బాగున్నాయ‌ని మ‌రో స‌ర్వేలో ప్ర‌జ‌లు తేల్చిచెప్పారు. దీంతో ప్ర‌భుత్వం ప‌నితీరుకు 90 శాతం మేర‌కు ఆమోదం ల‌భించిన‌ట్టు అయింద‌ని స‌ర్కారు చెప్ప‌డం గ‌మ‌నార్హం. గ‌త స‌ర్వేలో 85 శాతం ఉన్న సంతృప్తి ఇప్పుడు 90కి చేరింద‌ని పేర్కొంది.

This post was last modified on June 7, 2025 6:10 pm

Share

Recent Posts

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

5 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

20 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

20 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

2 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago