Political News

`సంతృప్తి`.. మ‌ళ్లీ పెరిగింది.. ఈసారి ఎంతంటే.. !

చంద్ర‌బాబు పాల‌న‌లో సంతృప్తి కొల‌మానాలు స‌హ‌జం. ఎప్ప‌టిక‌ప్పుడు.. ప్ర‌భుత్వం అందిస్తున్న పాల‌న పై ఆయ‌న లెక్క‌లు వేసుకుని గ‌ణాంకాల‌తో స‌హా ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం రివాజు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన 11 మాసాల్లో 10కి పైగా స‌ర్వేలు చేయించారు. వీటిలో ఆయా ప‌థ‌కాలు.. ప్ర‌భుత్వ పాల‌న‌, ఎమ్మెల్యేల ప‌నితీరు, మంత్రుల రికార్డు, సీఎంగా చంద్ర‌బాబు ప‌నితీరు.. ఇలా అనేకం ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా ఎక్క‌డా లేని విధంగా మ‌ద్యంపైనా స‌ర్వే చేయించారు.

తాజాగా రెండు అంశాల‌పై ప్ర‌భుత్వం మ‌రో స‌ర్వే నిర్వ‌హించింది. అది.. 1) రేష‌న్ దుకాణాలు. 2) స‌చివాలయ వ్య‌వ‌స్థ‌. ఈ రెండు కూడా.. కీల‌క‌మ‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న విష‌యం తెలిసిందే. పైగా.. ఈ రెండు కూడా.. మార్పులు జ‌రిగాయి. గ‌త వైసీపీ హ‌యాంలో రేష‌న్ బ‌ళ్లు ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చేవి. అయితే.. ఈ వాహ‌నాల ద్వారా అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని, పైగా 1200 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఏటా ఖ‌ర్చ‌వుతోందని ప్ర‌భుత్వం లెక్క‌లు వేసుకుంది. ఈ నేప‌థ్యంలోనే వాటిని తీసేసింది.

ఇక‌, గ‌త పాత విధానం అయిన రేష‌న్ దుకాణాల‌ను తిరిగి తీసుకువ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ నెల 1వ తేదీ నుంచి కూడా.. రేష‌న్ దుకాణాల ద్వారానే రేష‌న్ పంపిణీ జ‌రుగుతోంది. వృద్ధులు, విక‌లాంగులు ల‌బ్దిదారులుగా ఉంటే వారికి మాత్రం ఇంటి వ‌ద్ద‌కు రేష‌న్ పంపించే బాధ్య‌త‌ను రేష‌న్ దుకాణ దారుల‌కే అప్ప‌గించారు. ఈ నేప‌థ్యంలో ఈ నెల 5న ఒక్క‌రోజులోనే ప్ర‌బుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐవీఆర్ ఎస్ ద్వారా స‌ర్వే చేప‌ట్టింది. రేష‌న్ దుకాణాల‌ను కొన‌సాగించ‌డం బాగుందా? అనే దానిపై అభిప్రాయాలు తీసుకుంది.

దీనికి మెజారిటీ ల‌బ్దిదారులు బాగుంద‌ని స‌మాధానం చెప్పార‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. గ‌తంలో బ‌ళ్లు ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చేవి కాద‌ని.. పైగా అవి ఎప్పుడు వ‌స్తాయో తెలియ‌క త‌మ ప‌నులు మానుకోవాల్సి వ‌చ్చేద‌ని కూడా ల‌బ్ధిదారులు వివ‌రించారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం చేసిన మార్పును 99 శాతం మంది అంగీక‌రించార‌ని స‌ర్వే చెప్పింది. ఇక‌, స‌చివాల‌య వ్య‌వ‌స్థ ఉన్నా.. ప్ర‌యోజ‌నం లేద‌ని.. గ‌తంలో ఉన్న కార్యాల‌యాలే బాగున్నాయ‌ని మ‌రో స‌ర్వేలో ప్ర‌జ‌లు తేల్చిచెప్పారు. దీంతో ప్ర‌భుత్వం ప‌నితీరుకు 90 శాతం మేర‌కు ఆమోదం ల‌భించిన‌ట్టు అయింద‌ని స‌ర్కారు చెప్ప‌డం గ‌మ‌నార్హం. గ‌త స‌ర్వేలో 85 శాతం ఉన్న సంతృప్తి ఇప్పుడు 90కి చేరింద‌ని పేర్కొంది.

Kumar

Recent Posts

ఏనుగు ఇంతలా పగబట్టేసిందా

పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…

3 minutes ago

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

2 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

2 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

2 hours ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

4 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

5 hours ago