వైసీపీ అధినేతగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై పార్టీలో నాయకుల మధ్య చిత్రమైన చర్చ సాగుతోంది. “ఈ సలహాలు ఇస్తోందెవరు? జగన్ను నడిపిస్తోందెవరు? “ అని సీనియర్ నాయకులు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి గత వారంలో రెండు కార్యక్రమాలకు జగన్ శ్రీకారం చుట్టారు. అయితే.. రెండు కార్యక్రమాలు కూడా.. పార్టీకి ప్లస్ కాకపోగా.. మైనస్ అయ్యాయి. పైగా.. వ్యతిరేకత మరింత పెరిగేలా కూడా చేశాయి. ఈ వ్యవహారమే పార్టీలో చర్చకు దారితీసింది.
అంతేకాదు.. అసలు ఈ సలహాలు ఇస్తోందెవరని కూడా ఆరా తీస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికలకు ముందు కూడా.. ఇలాంటి సలహాలే కొంపముంచాయన్న భావన పార్టీ నాయకుల్లో ఉంది. నియోజకవర్గాల్లో మార్పుల నుంచి పార్టీ నుంచి నాయకులు పోయినా.. వారిని కనీసం చర్చించకపోవడం.. పార్టీ పరంగా వారిని బుజ్జగించే ప్రయత్నం కూడా చేయకపోవడాన్ని నాయకులు ప్రశ్నించారు.అయినా.. పార్టీలో ఎలాంటి మార్పులూ రాలేదు.
ఇక, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రధానంగా అసెంబ్లీకి వెళ్లబోమని భీష్మించడంపై ఎమ్మెల్యేలు కూడా ఆగ్రహంతోనే ఉన్నారు. కానీ. ఎవరూ కూడా బయటకు చెప్పుకొనే పరిస్థితి లేకుండా పోయింది. ఇక, రౌడీ షీటర్ల కుటుంబాలను పరామర్శించే కార్యక్రమానికి సంబంధించి కూడా.. ఎవరికీ చెప్పకుండానే నిర్ణయం తీసుకున్నారని.. నాయకులు చెవులుకొరుక్కుంటున్నారు. ఇది సరికాదని.. మనం వరద ప్రభావిత ప్రాంతమైన విజయవాడలో కూడా బాధితులను ఇప్పటి వరకు పరామర్శించలేదని.. కొందరు గుర్తు చేస్తున్నారు.
రౌడీషీటర్ల కుటుంబాలను పరామర్శించకుండా.. నేరుగా న్యాయపోరాటానికి దిగి ఉంటే బాగుండేదని చాలా మంది నాయకులు చెబుతున్నారు. “ఇక్కడ వ్యక్తులు కాదు.. వ్యవస్థను మేం టార్గెట్ చేసి ఉంటే బాగుండేది“ అని అనంతపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం. కానీ.. ఈ విషయంలో ఎవరు సలహా ఇచ్చారో.. అని ఆయన తలపట్టుకున్నారు. ఇక, వెన్నుపోటు దినంపైనా.. ఇదే తరహా చర్చ సాగుతోంది. ఇక పై అయినా.. అదినేత నిర్ణయం తీసుకునేముందు.. ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలని సూచిస్తున్నారు. మరి ఇది జరుగుతుందా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్న.
This post was last modified on June 6, 2025 2:57 pm
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…