భారత ప్రధాని నరేంద్రమోదీని తన ట్విట్టర్ ఖాతా నుంచి వైట్ హౌస్ అన్ఫాలో చేయడం సంచలనమైంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తోపాటు అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్.. మోదీని తన ట్విట్టర్ ఖాతా నుంచి అన్ఫాలో చేశారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. అమెరికా, ఇండియా మధ్య రిలేషన్ దెబ్బతినిందని, అందుకే ఇలా జరిగిందని చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వైట్హౌస్ వివరణ ఇచ్చింది. తాము కొద్దిరోజుల పాటే, ప్రత్యేక కారణాల వల్లే.. ట్విట్టర్లో అకౌంట్లు ఫాలో అవుతామని తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో మన దేశ టూర్కు వచ్చారు. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, పీఎంవో, అమెరికాలోని మన దౌత్యకార్యాలయం, మన దేశంలోని అమెరికా దౌత్య కార్యాలయం, మన దేశంలోన అమెరికా రాయబారి ట్విట్టర్ అకౌంట్లను ఫాలో అయింది. ఈ మధ్య ఆ ఆరు ఖాతాలను అన్ఫాలో చేసింది. దీంతో పెద్ద దుమారమే రేగింది. ట్విట్టర్ ఖాతాలను వైట్హౌస్ అన్ఫాలో చేసిన విషయంపై క్లారిటీ ఇచ్చింది.
అమెరికా అధ్యక్షుని పర్యటన సందర్భంగా ట్విట్టర్ అకౌంట్లను ఫాలో అవుతామని, ఆ తర్వాత కొన్ని రోజులకు అన్ఫాలో చేస్తామని వైట్హౌస్లోని అధికారులు వివరణ ఇచ్చారు. పర్యటనకు మద్దతుగా.. వారి ట్వీట్స్ను రీ ట్వీట్ చేసేందుక కొద్ది కాలం పాటు మాత్రమే అకౌంట్లను ఫాలో అవుతున్నట్లు చెప్పారు. “ వైట్హౌస్ కేవలం అమెరికాలోని సీనియర్ ప్రభుత్వ అధికారుల ట్విట్టర్ను మాత్రమే ఫాలో అవుతుంది. అధ్యక్షుడి విదేశీ పర్యటన సమయంలో మాత్రం ఆతిథ్య దేశానికి సంబంధించిన అకౌంట్లను కొన్ని రోజులు ఫాలో అవుతుంది” అని అధికారి చెప్పారు. కాగా, ఇప్పుడు వైట్హౌస్ ట్విట్టర్లో అనుసరిస్తున్న అకౌంట్లు 13 మాత్రమే.
This post was last modified on May 1, 2020 2:38 pm
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…