భారత ప్రధాని నరేంద్రమోదీని తన ట్విట్టర్ ఖాతా నుంచి వైట్ హౌస్ అన్ఫాలో చేయడం సంచలనమైంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తోపాటు అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్.. మోదీని తన ట్విట్టర్ ఖాతా నుంచి అన్ఫాలో చేశారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. అమెరికా, ఇండియా మధ్య రిలేషన్ దెబ్బతినిందని, అందుకే ఇలా జరిగిందని చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వైట్హౌస్ వివరణ ఇచ్చింది. తాము కొద్దిరోజుల పాటే, ప్రత్యేక కారణాల వల్లే.. ట్విట్టర్లో అకౌంట్లు ఫాలో అవుతామని తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో మన దేశ టూర్కు వచ్చారు. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, పీఎంవో, అమెరికాలోని మన దౌత్యకార్యాలయం, మన దేశంలోని అమెరికా దౌత్య కార్యాలయం, మన దేశంలోన అమెరికా రాయబారి ట్విట్టర్ అకౌంట్లను ఫాలో అయింది. ఈ మధ్య ఆ ఆరు ఖాతాలను అన్ఫాలో చేసింది. దీంతో పెద్ద దుమారమే రేగింది. ట్విట్టర్ ఖాతాలను వైట్హౌస్ అన్ఫాలో చేసిన విషయంపై క్లారిటీ ఇచ్చింది.
అమెరికా అధ్యక్షుని పర్యటన సందర్భంగా ట్విట్టర్ అకౌంట్లను ఫాలో అవుతామని, ఆ తర్వాత కొన్ని రోజులకు అన్ఫాలో చేస్తామని వైట్హౌస్లోని అధికారులు వివరణ ఇచ్చారు. పర్యటనకు మద్దతుగా.. వారి ట్వీట్స్ను రీ ట్వీట్ చేసేందుక కొద్ది కాలం పాటు మాత్రమే అకౌంట్లను ఫాలో అవుతున్నట్లు చెప్పారు. “ వైట్హౌస్ కేవలం అమెరికాలోని సీనియర్ ప్రభుత్వ అధికారుల ట్విట్టర్ను మాత్రమే ఫాలో అవుతుంది. అధ్యక్షుడి విదేశీ పర్యటన సమయంలో మాత్రం ఆతిథ్య దేశానికి సంబంధించిన అకౌంట్లను కొన్ని రోజులు ఫాలో అవుతుంది” అని అధికారి చెప్పారు. కాగా, ఇప్పుడు వైట్హౌస్ ట్విట్టర్లో అనుసరిస్తున్న అకౌంట్లు 13 మాత్రమే.
This post was last modified on May 1, 2020 2:38 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…