భారత ప్రధాని నరేంద్రమోదీని తన ట్విట్టర్ ఖాతా నుంచి వైట్ హౌస్ అన్ఫాలో చేయడం సంచలనమైంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తోపాటు అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్.. మోదీని తన ట్విట్టర్ ఖాతా నుంచి అన్ఫాలో చేశారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. అమెరికా, ఇండియా మధ్య రిలేషన్ దెబ్బతినిందని, అందుకే ఇలా జరిగిందని చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వైట్హౌస్ వివరణ ఇచ్చింది. తాము కొద్దిరోజుల పాటే, ప్రత్యేక కారణాల వల్లే.. ట్విట్టర్లో అకౌంట్లు ఫాలో అవుతామని తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో మన దేశ టూర్కు వచ్చారు. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, పీఎంవో, అమెరికాలోని మన దౌత్యకార్యాలయం, మన దేశంలోని అమెరికా దౌత్య కార్యాలయం, మన దేశంలోన అమెరికా రాయబారి ట్విట్టర్ అకౌంట్లను ఫాలో అయింది. ఈ మధ్య ఆ ఆరు ఖాతాలను అన్ఫాలో చేసింది. దీంతో పెద్ద దుమారమే రేగింది. ట్విట్టర్ ఖాతాలను వైట్హౌస్ అన్ఫాలో చేసిన విషయంపై క్లారిటీ ఇచ్చింది.
అమెరికా అధ్యక్షుని పర్యటన సందర్భంగా ట్విట్టర్ అకౌంట్లను ఫాలో అవుతామని, ఆ తర్వాత కొన్ని రోజులకు అన్ఫాలో చేస్తామని వైట్హౌస్లోని అధికారులు వివరణ ఇచ్చారు. పర్యటనకు మద్దతుగా.. వారి ట్వీట్స్ను రీ ట్వీట్ చేసేందుక కొద్ది కాలం పాటు మాత్రమే అకౌంట్లను ఫాలో అవుతున్నట్లు చెప్పారు. “ వైట్హౌస్ కేవలం అమెరికాలోని సీనియర్ ప్రభుత్వ అధికారుల ట్విట్టర్ను మాత్రమే ఫాలో అవుతుంది. అధ్యక్షుడి విదేశీ పర్యటన సమయంలో మాత్రం ఆతిథ్య దేశానికి సంబంధించిన అకౌంట్లను కొన్ని రోజులు ఫాలో అవుతుంది” అని అధికారి చెప్పారు. కాగా, ఇప్పుడు వైట్హౌస్ ట్విట్టర్లో అనుసరిస్తున్న అకౌంట్లు 13 మాత్రమే.
This post was last modified on May 1, 2020 2:38 pm
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…