Political News

‘జ‌గ‌న్ కోస‌మా జ‌నం కోస‌మా’ – వైసీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు!

వైసీపీ అధినేత జ‌గన్ ఇచ్చిన పిలుపు మేర‌కు.. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వైసీపీనాయ‌కులు రోడ్డెక్కారు. కూట‌మి పార్టీలు.. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డం లేద‌న్న సాకుతో `వెన్నుపోటు దినం` పేరిట నిర‌స‌న తెల‌పాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. చాలా జిల్లాల్లో ఈ ఊసు క‌నిపించ‌డంలేదు. మ‌రో వైపు కొన్ని కొన్ని జిల్లాల్లో మాత్రం నాయ‌కులు రోడ్డెక్కారు. ముఖ్యంగా ఉమ్మ‌డి కృష్ణ‌జిల్లాలో  మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన పేర్ని నాని.. అక్క‌డ మానేశారు.

ఎక్క‌డో దూరంగా ఉన్న గ‌న్న‌వరం నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న నిర‌స‌న వ్య‌క్తం చేశారు. దీనిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గ‌న్న‌వరంలో వైసీపీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. దీంతో పార్టీలో ఊపు తెచ్చేందుకు ఆయ‌న ఈ కార్య‌క్ర‌మాన్ని వినియోగించుకున్నార‌న్న వాద‌న సొంత పార్టీ నాయ‌కుల్లోనే వినిపిస్తోంది. ఇక‌, క‌ప‌డ‌లో ఎంపీ అవినాష్ రెడ్డి రోడ్డెక్కారు. అయితే.. ఆయ‌న కూడా ప‌ట్టుమ‌ని 10 నిమిషాల్లోనే హ‌డావుడిగా కార్య‌క్ర‌మంలో పాల్గొని.. నాలుగు విమ‌ర్శ‌లు చేసి త‌ప్పించుకున్నారు.

విశాఖ‌లో ఎమ్మెల్సీ వ‌రుదు క‌ల్యాణ్ మీడియాముందుకు వ‌చ్చారు. అదేవిధంగా పార్టీ నుంచి వెళ్లిపోవాల‌ని అనుకున్నట్టు ప్ర‌చారం వ‌చ్చిన మాజీ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ కూడా పాల్గొన్నారు. కానీ, కీల‌క‌మైన గుడివాడ అమ‌ర్నాథ్ స‌హా.. ఇత‌ర నాయ‌కులు దూరంగా ఉండిపోయారు. విజ‌య‌వాడ‌లో దేవినేని అవినాష్ మిన‌హా.. ఇత‌ర నాయ‌కులు ఎవ‌రూ క‌నిపించ‌లేదు. గుంటూరులోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపించింది. దీంతో వైసీపీ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు ఓ రేంజ్‌లో వినిపించాయి.

జ‌గ‌న్ కోస‌మా?  జ‌నం కోస‌మా?  అంటూ.. నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం గ్రాఫ్ ప‌డిపోయిన స్థితిలో ఉన్న జ‌గ‌న్ కోస‌మే నాయ‌కులు తూతూ మంత్రంగా బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని.. నిజంగానే ప్ర‌జ‌ల‌పై ఏమాత్రం కూడా వారికి ప్రేమ లేద‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కేవ‌లం 10 నిమిషాలు మాత్ర‌మే వారు బ‌య‌ట ఉన్నార‌ని.. కొంద‌రు ఎండ ఎక్కువ‌గా ఉంద‌ని.. సాయంత్రానికి వాయిదా వేసుకున్నార‌ని చెబుతున్నారు. దీంతో జ‌గ‌న్ ఇచ్చిన పిలుపు కేవ‌లం పార్టీ గ‌డ‌ప మాత్ర‌మేదాటింద‌ని ప్ర‌జ‌ల‌కు చేర‌లేద‌ని చెబుతున్నారు.

This post was last modified on June 4, 2025 4:55 pm

Share

Recent Posts

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

2 hours ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

2 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

3 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

3 hours ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

6 hours ago

బండ్ల కూతురి పెళ్లికి రానిది పవన్ ఒకరే

బండ్ల గ‌ణేష్ అనే న‌టుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్ర‌లు చేసింది లేదు. న‌టుడిగా అత‌డిది గొప్ప కెరీర్ కాదు.…

7 hours ago