Political News

రేష‌న్‌కు సొమ్ములు.. బాబుకు ప్ల‌స్సా.. మైన‌స్సా.. !

రేష‌న్‌.. పేద కుటుంబాల‌కు ప్ర‌భుత్వం స‌ర‌ఫ‌రా చేసే నిత్య‌వ‌స‌రాలు. ఇప్ప‌టి వ‌ర‌కు పేద‌ల‌కు అందించే ఈ సరుకుల విష‌యంపై స‌ర్కారు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. దీనిని ఇచ్చే విష‌యంపై క్లారిటీ ఉన్నా.. వీటిని ప్ర‌జ‌లు వినియోగించుకునే విష‌యంలో మాత్రం తేడా కొడుతోంది. దీనిపైనే ఇప్పుడు స‌ర్కారు క‌స‌ర‌త్తు చేస్తోంది. తాజాగా రేష‌న్‌కు సొమ్ములు ఇస్తే బెట‌ర్ అనే ఆలోచ‌న చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్త‌మవుతున్నాయి.

పేద‌ల‌కు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం భారీధ‌ర‌ల‌కే బియ్యాన్ని, ఇత‌ర స‌రుకుల‌ను కొనుగోలు చేస్తోంది. అయితే.. ప్ర‌జ‌లు బియ్యాన్ని తిన‌డం లేదు. నిజానికి ఎంత మంచి బియ్యం ఇచ్చినా.. `కోటా బియ్యం`గా ముద్ర ప‌డిన ద‌రిమిలా.. దీనిని తినేందుకు ల‌బ్ధిదారులు ముందుకు రావ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే బ్లాక్ మార్కెటింగ్ పెరిగిపోతోంది. దీనిని గ‌మ‌నించిన ప్ర‌భుత్వం మార్పు దిశ‌గా అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించుకుంది.

అయితే.. ఇక్క‌డే మ‌రో విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. పేద‌ల‌కు ఇస్తున్న బియ్యంలో 30 శాతం మందికి పైగానే పేద‌లు వాటిని వాడుకుంటున్నారు. ఇప్పుడు వారిని పూర్తిగా త‌గ్గించి.. కేవ‌లం సొమ్ములు ఇస్తే.. స‌రిపోతుందా? అనేది ప్ర‌శ్న‌. పైగా.. రేష‌న్ బియ్యం కొన‌సాగుతున్నందునే.. మార్కెట్‌లో సాధార‌ణ బియ్యం ధ‌రలు ఓ మాదిరిగా అయినా నిల‌క‌డ‌గా ఉంటున్నాయి. అలా కాకుండా.. అంద‌రూ బ‌హిరంగ మార్కెట్‌పైనే ఆధార‌ప‌డ్డార‌న్న సంకేతాలు వ‌స్తే.. మాత్రం అప్పుడు బియ్యం మార్కెట్ను అదుపులో ఉంచ‌డం దుస్సా ధ్యం అంటున్నారు ప‌రిశీల‌కులు.

పైగా.. స‌ర్కారు రూ.45 చొప్పున రేష‌న్ బియ్యాన్ని బ‌హిరంగ మార్కెట్‌నుంచి లేదా మిల్ల‌ర్ల నుంచి కొని.. పేదలకు పంపిణీ చేస్తోంది. ఇప్పుడు రేష‌న్ వ‌ద్ద‌నుకునే వారికి ఆ మొత్తాన్ని లెక్క‌గ‌ట్టి ఇస్తారా? అనేది సందేహం. ఎందుకంటే.. రూ.1కే ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు బియ్యాన్ని కొంటున్నారు. కానీ, ప్ర‌భుత్వం మాత్రం రూ.45-48 మ‌ధ్య ఖ‌ర్చు చేస్తోంది. రేపు రేష‌న్ మానేసి డ‌బ్బులు ఇవ్వాల‌ని అనుకుంటే.. రూ.45 చొప్పున పేద‌ల‌కు పంపిణీ చేస్తారా?  లేక‌.. రూ.1 కిందే జ‌మ‌క‌ట్టి.. ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా.. ప్ర‌స్తుతం లెక్క‌లుమాత్రం స‌ర్కారుకు కొరుకుడు ప‌డ‌డం లేదు.

This post was last modified on June 4, 2025 4:11 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మొన్న పెంగ్విన్.. నేడు పంచ్! ప్రపంచాన్ని కదిలించాయి

నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…

3 hours ago

ఒక్క లుక్‌తో మంటలు పుట్టించిన రుక్కు

కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…

9 hours ago

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

12 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

14 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

15 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

15 hours ago