Political News

ఏపీలో సంచ‌ల‌నం రేపుతున్న ఆ కేసు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓ విషాదాంతం అంద‌రినీ క‌ల‌చి వేస్తోంది. ఒక సీఐ వేధింపులు తాళ‌లేక ఒక కుటుంబం మొత్తం ఆత్మ‌హత్య‌కు పాల్ప‌డ‌టం, చ‌నిపోవ‌డానికి ముందు త‌మ దీన స్థితిని తెలియ‌జేస్తూ వీడియో రిలీజ్ చేయ‌డం, ఆ వ్య‌క్తి మైనారిటీ కావ‌డంతో సంబంధిత కేసు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

క‌ర్నూలు జిల్లా నంద్యాల‌కు చెందిన ఆటో డ్రైవ‌ర్ అబ్దుల్ స‌లాం కుటుంబం ఇటీవ‌ల కౌలూరు ప్రాంతంలో రైలు ప‌ట్టాల‌పై ప‌డుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. అబ్దుల్‌తో పాటు అత‌డి భార్య, కొడుకు, కూతురు సామూహికంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఐతే ఈ కుటుంబం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ కొన్ని రోజుల త‌ర్వాత వీరి సెల్ఫీ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఏడాది క్రితం బంగారం చోరీ కేసులో పోలీసులు అబ్దుల్‌ను నిందితుడిగా చేర్చారు. ఐతే తాను దొంగ‌త‌నం చేయ‌కున్నా నేరం ఒప్పుకోవాల‌ని త‌నపై ఒత్తిడి పెంచుతున్నార‌ని.. అది భ‌రించ‌లేకే కుటుంబంతో స‌హా ప్రాణాలు తీసుకుంటున్నానని అబ్దుల్ అందులో ఏడుస్తూ చెప్పాడు. త‌మ ఆత్మ‌హ‌త్య‌కు నంద్యాల సీఐ సోమ‌శేఖ‌ర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌లే కార‌ణ‌మ‌ని అబ్దుల్ ఆరోపించాడు.

ఈ వీడియో బ‌య‌టికి రాగానే ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. సీఐను సస్పెండ్ చేయ‌డ‌మే కాక‌. ఆయ‌న్ని, కానిస్టేబుల్ గంగాధ‌ర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు మైనారిటీ కావ‌డంతో ఈ కేసుపై స్వ‌యంగా ముఖ్య‌మంత్రి దృష్టి సారించారు. ఆయ‌న ఆదేశాల మేర‌కు ఐజీ శంక‌బ‌త్ర బాగ్చి నంద్యాల చేరుకుని విచార‌ణ చేప‌ట్టారు. సీఐపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేసిన‌ట్లు డీఐజీ వెంక‌ట్రామిరెడ్డి వెల్ల‌డించారు.

This post was last modified on November 9, 2020 7:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

46 seconds ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

3 minutes ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

52 minutes ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

2 hours ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

2 hours ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago