ఆంధ్రప్రదేశ్లో ఓ విషాదాంతం అందరినీ కలచి వేస్తోంది. ఒక సీఐ వేధింపులు తాళలేక ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడటం, చనిపోవడానికి ముందు తమ దీన స్థితిని తెలియజేస్తూ వీడియో రిలీజ్ చేయడం, ఆ వ్యక్తి మైనారిటీ కావడంతో సంబంధిత కేసు చర్చనీయాంశంగా మారింది.
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఇటీవల కౌలూరు ప్రాంతంలో రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అబ్దుల్తో పాటు అతడి భార్య, కొడుకు, కూతురు సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఐతే ఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడ్డ కొన్ని రోజుల తర్వాత వీరి సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది.
ఏడాది క్రితం బంగారం చోరీ కేసులో పోలీసులు అబ్దుల్ను నిందితుడిగా చేర్చారు. ఐతే తాను దొంగతనం చేయకున్నా నేరం ఒప్పుకోవాలని తనపై ఒత్తిడి పెంచుతున్నారని.. అది భరించలేకే కుటుంబంతో సహా ప్రాణాలు తీసుకుంటున్నానని అబ్దుల్ అందులో ఏడుస్తూ చెప్పాడు. తమ ఆత్మహత్యకు నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్లే కారణమని అబ్దుల్ ఆరోపించాడు.
ఈ వీడియో బయటికి రాగానే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సీఐను సస్పెండ్ చేయడమే కాక. ఆయన్ని, కానిస్టేబుల్ గంగాధర్ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు మైనారిటీ కావడంతో ఈ కేసుపై స్వయంగా ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు ఐజీ శంకబత్ర బాగ్చి నంద్యాల చేరుకుని విచారణ చేపట్టారు. సీఐపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు డీఐజీ వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.
This post was last modified on November 9, 2020 7:58 am
మనకు డెవిల్ అంటే ఆ మధ్య వచ్చిన కళ్యాణ్ రామ్ సినిమా గుర్తొస్తుంది కానీ ఇటీవలే కన్నడలో విడుదలైన భారీ…
మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ ఫలితాన్ని విశ్వంభర క్యాష్ చేసుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడం అభిమానులను బాధ…
గత కొన్నేళ్లలో మోస్ట్ అన్ పాపులర్ ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా హార్దిక్ పాండ్య పేరు…
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సువార్తీకుడు కేఏ పాల్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ…
తమ్ముడు తమ్ముడే.. రాజకీయం రాజకీయమే.. బీజేపీ విషయంలో ఇది అక్షరాలా నిజం. తనకు అవకాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…
ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…