Political News

ఏపీలో సంచ‌ల‌నం రేపుతున్న ఆ కేసు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓ విషాదాంతం అంద‌రినీ క‌ల‌చి వేస్తోంది. ఒక సీఐ వేధింపులు తాళ‌లేక ఒక కుటుంబం మొత్తం ఆత్మ‌హత్య‌కు పాల్ప‌డ‌టం, చ‌నిపోవ‌డానికి ముందు త‌మ దీన స్థితిని తెలియ‌జేస్తూ వీడియో రిలీజ్ చేయ‌డం, ఆ వ్య‌క్తి మైనారిటీ కావ‌డంతో సంబంధిత కేసు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

క‌ర్నూలు జిల్లా నంద్యాల‌కు చెందిన ఆటో డ్రైవ‌ర్ అబ్దుల్ స‌లాం కుటుంబం ఇటీవ‌ల కౌలూరు ప్రాంతంలో రైలు ప‌ట్టాల‌పై ప‌డుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. అబ్దుల్‌తో పాటు అత‌డి భార్య, కొడుకు, కూతురు సామూహికంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఐతే ఈ కుటుంబం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ కొన్ని రోజుల త‌ర్వాత వీరి సెల్ఫీ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఏడాది క్రితం బంగారం చోరీ కేసులో పోలీసులు అబ్దుల్‌ను నిందితుడిగా చేర్చారు. ఐతే తాను దొంగ‌త‌నం చేయ‌కున్నా నేరం ఒప్పుకోవాల‌ని త‌నపై ఒత్తిడి పెంచుతున్నార‌ని.. అది భ‌రించ‌లేకే కుటుంబంతో స‌హా ప్రాణాలు తీసుకుంటున్నానని అబ్దుల్ అందులో ఏడుస్తూ చెప్పాడు. త‌మ ఆత్మ‌హ‌త్య‌కు నంద్యాల సీఐ సోమ‌శేఖ‌ర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌లే కార‌ణ‌మ‌ని అబ్దుల్ ఆరోపించాడు.

ఈ వీడియో బ‌య‌టికి రాగానే ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. సీఐను సస్పెండ్ చేయ‌డ‌మే కాక‌. ఆయ‌న్ని, కానిస్టేబుల్ గంగాధ‌ర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు మైనారిటీ కావ‌డంతో ఈ కేసుపై స్వ‌యంగా ముఖ్య‌మంత్రి దృష్టి సారించారు. ఆయ‌న ఆదేశాల మేర‌కు ఐజీ శంక‌బ‌త్ర బాగ్చి నంద్యాల చేరుకుని విచార‌ణ చేప‌ట్టారు. సీఐపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేసిన‌ట్లు డీఐజీ వెంక‌ట్రామిరెడ్డి వెల్ల‌డించారు.

This post was last modified on November 9, 2020 7:58 am

Share

Recent Posts

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

59 minutes ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

1 hour ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

5 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

6 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

6 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

6 hours ago