మీరు చదివింది నిజమే. ఆంధ్రప్రదేశ్కు చాలా దూరంగా ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంపైనా, అక్కడి పోలీసులపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇదేనా మీరు పాటించే లౌకికత్వం?” అంటూ నిప్పులు చెరిగారు. లౌకికత్వం అంటే అందరికీ సమానంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అయితే, కొందరి విషయంలో లౌకికత్వం కవచంగా మారుతోందని, మరికొందరి విషయంలో ఖడ్గంగా మారుతోందని తీవ్రంగా విమర్శించారు. “ఇదేం పోలీసింగ్?” అంటూ పశ్చిమ బెంగాల్ పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాస్తవానికి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పటివరకు పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోలేదు. ఆయన తమిళనాడు, కర్ణాటక వరకే పరిమితమయ్యారు. అయితే తాజాగా పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్న ఓ అరెస్టుపై పవన్ కల్యాణ్ స్పందించారు. ‘‘ఈ అరెస్టు సరే… కానీ మిగిలిన అరెస్టుల సంగతేంటి?’’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసిన అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నేతల సంగతేంటి? అంటూ సీఎం మమతా బెనర్జీ (దీదీ)ని ప్రశ్నించారు.
అసలు ఏం జరిగింది?
‘ఆపరేషన్ సిందూర్’ పై పశ్చిమ బెంగాల్కు చెందిన శర్మిష్ఠ ముఖర్జీ అనే యువతి ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆమె న్యాయశాస్త్రం చదువుతోంది. అందులో కొన్ని లా పాయింట్లు కూడా ఆమె ఉదహరించారు. ఈ సంఘటన గత వారంలో జరిగింది. ఈ పోస్ట్పై తీవ్ర విమర్శలు రావడంతో శర్మిష్ఠ వెంటనే ఆ పోస్ట్ను తొలగించి క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ, వివాదం చెలరేగింది. దీంతో కోల్కతా పోలీసులు వెంటనే స్పందించి ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. లౌకికవాదాన్ని దెబ్బతీసినట్లు ఆమెపై అభియోగాలు మోపారు.
ఈ ఘటనపైనే పవన్ కల్యాణ్ స్పందించారు. లౌకికవాదం పేరుతో ఒకవైపు మత కసి తీర్చుకుంటూ, మరోవైపు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినవారిని కాపాడే ప్రయత్నం చేయడాన్ని ఆయన తుప్పులు పేల్చారు. ‘‘లౌకికవాదం అంటే అందరికీ సమానంగా ఉండడమే కాదా? సనాతన ధర్మాన్ని అవమానించిన అధికార పార్టీ నేతలపై కేసులు పెట్టారా? వాళ్లు అసలు క్షమాపణలు చెప్పారా? ఇదేనా మీ లౌకికత్వం?’’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ‘జైలర్’ సినిమాకు సీక్వెల్ మొదలై రెండేళ్లు కావస్తోంది. కానీ ఎంతకీ…
దర్శకులు నటులుగా మారినంత తేలిగ్గా.. నటులు దర్శకులు కాలేరు. ఎందుకంటే 24 విభాగాలనూ కోఆర్డినేట్ చేస్తూ సినిమా తీయడం అన్నది…
తమ భాషను, తమ సంస్కృతిని, తమ సామిత్యాన్ని గౌరవించుకోవడంలో మిగతా వాళ్లతో పోలిస్తే తెలుగు వాళ్లది ఎప్పుడూ వెనుకబాటే అన్న…
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…