మీరు చదివింది నిజమే. ఆంధ్రప్రదేశ్కు చాలా దూరంగా ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంపైనా, అక్కడి పోలీసులపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇదేనా మీరు పాటించే లౌకికత్వం?” అంటూ నిప్పులు చెరిగారు. లౌకికత్వం అంటే అందరికీ సమానంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అయితే, కొందరి విషయంలో లౌకికత్వం కవచంగా మారుతోందని, మరికొందరి విషయంలో ఖడ్గంగా మారుతోందని తీవ్రంగా విమర్శించారు. “ఇదేం పోలీసింగ్?” అంటూ పశ్చిమ బెంగాల్ పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాస్తవానికి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పటివరకు పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోలేదు. ఆయన తమిళనాడు, కర్ణాటక వరకే పరిమితమయ్యారు. అయితే తాజాగా పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్న ఓ అరెస్టుపై పవన్ కల్యాణ్ స్పందించారు. ‘‘ఈ అరెస్టు సరే… కానీ మిగిలిన అరెస్టుల సంగతేంటి?’’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసిన అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నేతల సంగతేంటి? అంటూ సీఎం మమతా బెనర్జీ (దీదీ)ని ప్రశ్నించారు.
అసలు ఏం జరిగింది?
‘ఆపరేషన్ సిందూర్’ పై పశ్చిమ బెంగాల్కు చెందిన శర్మిష్ఠ ముఖర్జీ అనే యువతి ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆమె న్యాయశాస్త్రం చదువుతోంది. అందులో కొన్ని లా పాయింట్లు కూడా ఆమె ఉదహరించారు. ఈ సంఘటన గత వారంలో జరిగింది. ఈ పోస్ట్పై తీవ్ర విమర్శలు రావడంతో శర్మిష్ఠ వెంటనే ఆ పోస్ట్ను తొలగించి క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ, వివాదం చెలరేగింది. దీంతో కోల్కతా పోలీసులు వెంటనే స్పందించి ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. లౌకికవాదాన్ని దెబ్బతీసినట్లు ఆమెపై అభియోగాలు మోపారు.
ఈ ఘటనపైనే పవన్ కల్యాణ్ స్పందించారు. లౌకికవాదం పేరుతో ఒకవైపు మత కసి తీర్చుకుంటూ, మరోవైపు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినవారిని కాపాడే ప్రయత్నం చేయడాన్ని ఆయన తుప్పులు పేల్చారు. ‘‘లౌకికవాదం అంటే అందరికీ సమానంగా ఉండడమే కాదా? సనాతన ధర్మాన్ని అవమానించిన అధికార పార్టీ నేతలపై కేసులు పెట్టారా? వాళ్లు అసలు క్షమాపణలు చెప్పారా? ఇదేనా మీ లౌకికత్వం?’’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
This post was last modified on June 1, 2025 10:29 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…