Political News

ఎమ్మెల్సీ ఓకే!… మంత్రి పదవి ఎప్పుడు?

తెలంగాణలో అదికార పార్టీ కాంగ్రెస్ లో మంత్రి పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. మంత్రివర్గ విస్తరణ అదుగో, ఇదుగో అంటూ అధిష్ఠానం కాలయాపన చేస్తున్న కొద్దీ కొత్తగా ఆశావహులు చేరిపోతున్నారు. ఫలితంగా మంత్రి పదవుల కోసం పోటీ ఓ రేంజిలో పెరిగిపోతోంది. ఈ పోటీ, నేతల మధ్య మాటల తూటాలు.. ఇవేవీ పట్టని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ మాత్రం తన పని తాను చేసుకుని పోతున్నారు. ఆయా నేతలను పిలిచి వేర్వేరుగా భేటీ అవుతున్నారు. అందులో బాగంగా సెలవు దినం ఆదివారం ఇటీవలే ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సినీ నటి విజయశాంతి, పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ లు మీనాక్షితో భేటీ అయ్యారు.

మీనాక్షితో విజయశాంతి భేటీ సుమారుగా 15 నిమిషాల పాటు సాగింది. ఈ భేటీలో బీసీ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని విజయశాంతి డిమాండ్ చేసినట్టు సమాచారం. అంతేకాకుండా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన తనకు మంత్రి పదవికి అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర, ఏ పార్టీలో ఉన్నా కూడా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించడమే లక్ష్యంగా సాగానని… తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఇచ్చిన కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా నిలిచానని కూడా ఆమె వివరించారట. రాజకీయాల్లో తన సీనియారిటీ, వైరి వర్గాలను తాను ఎదుర్కొొంటున్న తీరులనూ రాములమ్మ ఆమెకు వివరించినట్లు సమాచారం. విజయశాంతి చెప్పినవన్నీ నోట్ చేసుకున్న మీనాక్షి చూద్దాం అంటూ ఆమెకు చెప్పి పంపారట.

ఇదిలా ఉంటే… పార్టీని ఆది నుంచి అంటిపెట్టుకుని ఉన్న వారిలో తాను ఒకడినని అద్దంకి దయాకర్ తనను తాను మీనాక్షి ముందు ప్రొజెక్ట్ చేసుకునే యత్నం చేశారట. ఏళ్లుగా ఎలాంటి పదవులు దక్కకున్నా… పార్టీనే నమ్ముకుని ఉన్నానని, ఇప్పటికి గానీ తనకు ఎమ్మెల్సీ .పదవి దక్కిందని ఆయన చెప్పారట. ఇలాంటి కీలక సమయంలో తనలాంటి పార్టీ విధేయుులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తే…ప్రజల్లో పార్టీకి మంచి మైలేజీ పెరుగుతుందని తెలిపారట. తెలంగాణకు ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత తనను పలు పార్టీలు ఎన్నెన్నో ప్రలోభాలకు గురి చేశాయని, కాని తాను మాత్రం పార్టీనే నమ్ముకుని ఉన్నానని తెలిపారట. ఈ నేపథ్యంలో అన్ని పరిస్థితులను పరిశీలించిన తనకు మంత్రి పదవి కేటాయించాల్సిందేనని ఆయన మీనాక్షిని కోరారట. 

వాస్తవంగా అటు రాములమ్మ అయినా, ఇటు అద్దంకి దయాకర్ అయినా మంత్రి పదవులకు నూటికి నూరు పాళ్లు అర్హులే. సమర్థత ఉన్న నేతలే. అధికారం ఉన్నా, లేకున్నా ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడంలో వీరు ఏ ఒక్కరికీ తక్కువ కాదని చెప్పక తప్పదు. సమకాలీన రాజకీయాలతో పాటు పాలనాపరమైన అంశాలపైనా వీరిద్దరికీ సమగ్రమైన పట్టు ఉందని కూడా చెప్పాలి. వీరిద్దరికీ ఒకేసారి ఎమ్మెల్సీ పదవులు దక్కిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వీరిద్దరి మంత్రి పదవులూ ఖాయమేనన్న విశ్లేషణలు సాగాయి. అయితే మంత్రివర్గ విస్తరణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్న నేపథ్యంలో వీరికి మంత్రి పదవులు దక్కుతాయా? లేదా? అన్నది సస్పెన్స్ గానే మిగిలిపోయింది.

This post was last modified on June 1, 2025 10:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago