Political News

గిరిపుత్రుల మ‌న‌సులో ‘దారులు’.. ఇక జ‌న‌సేన కే జై కొట్టేనా…!

సాధార‌ణ ప్ర‌జానీకానికీ.. గిరిజ‌నుల‌కు మ‌ధ్య కొంత వ్య‌త్యాసం ఉంటుంది. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఎప్పుడూ ఏదో ఒక‌టి వారికి క‌నిపించాలి. ప్ర‌భుత్వాలు వారిని మెప్పించాలి. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌చారాల‌కు ప‌డిపోతూ ఉంటార‌న్న పేరు కూడా ఉంది. అందుకే ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. న‌గ‌ర ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు పార్టీలు వేయ‌ని వ్యూహాలు లేవు. ప్ర‌క‌టించ‌ని ఫ‌థ‌కాలు కూడా లేవు. అయినా..వారి ఓటు బ్యాంకుపై ఎప్పుడు సందిగ్థ‌తే కొన‌సాగుతుంది. ఎప్పుడూ సందేహాలు..ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంటాయి. చివ‌ర‌కు రిజ‌ల్ట్ వ‌చ్చే వ‌ర‌కు కూడా పార్టీల‌కు గుండె కొట్టుకుంటూనే ఉంటుంది.

కానీ.. గిరిజ‌నుల ప‌రిస్థితి అలాకాదు. వారికి ఉడ‌త సాయం చేసినా.. కొండంత అండ‌గా ఉంటారు. మేలును చిర‌కాలం గుర్తు పెట్టు కుంటారు. త‌మ‌కు ఏ చిన్న సాయం చేసిన వారినైనా వారు.. జీవిత‌కాలం నిల‌బెట్టుకుంటారు. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఈ గుణాన్ని గ‌మ‌నించి.. గిరిజ‌నుల‌కు ఉడ‌త సాయం కింద‌.. వైద్య సాయం చేశారు. ఆరోగ్య శ్రీ కార్డులు ఇచ్చారు. ఇది ఆయ‌న‌ను మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేలా చేసింది. గిరిజ‌న తండాల్లో వైఎస్ విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేసుకునేలా చేసింది. అంతేకాదు.. ఆయ‌న త‌ర్వాత కూడా.. ఆయ‌న కుమారుడు జ‌గ‌న్‌లో వైఎస్‌ను చూసుకునేలా చేసింది. గిరిజ‌న ప్రాబ‌ల్య ప్రాంతాల్లో వైసీపీకి ఓటు బ్యాంకు స్థిర‌ప‌డింది.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు అదే ప‌రిణామాలు.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌వైపు మొగ్గు చూపుతున్నాయి. గిరిజ‌నులు ఇప్పుడు ప‌వ‌న్ నామ‌స్మరణ‌లో మునుగుతున్నారు. చేసిన సాయం క‌న్నా.. ప‌వ‌న్‌లోని మ‌న‌సును చూస్తున్నారు. వారిని క‌లుసుకోవ‌డం, వారి క‌ష్టాలు విన‌డంతో పొంగిపోతున్నారు. అంతేకాదు.. గిరిజ‌నుల‌కుచెప్పులు పంపించ‌డం ద‌గ్గ‌ర నుంచి తాజాగా ర‌హ‌దారుల నిర్మాణం వ‌ర‌కు ప‌వ‌న్ చేసిన మేలును వారు వేనోళ్ల కొనియాడుతున్నారు. తాజాగా అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ప‌లు గిరిజ‌న ప్రాంతాల‌ను క‌లుపుతూ.. వేసిన ఒకే ఒక్క కిలో మీట‌రు తారు రోడ్డు.. ప‌వ‌న్ గ్రాఫ్‌ను కొన్ని వంద‌ల కిలోమీట‌ర్ల మేర‌కు పెంచిందంటే అతిశ‌యోక్తికాదు.

ఇప్ప‌టి వ‌ర‌కు డోలీ మోత‌లు.. న‌డ‌క మార్గాలుగానే ఉన్న ర‌హ‌దారిని 88 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏకాగ్ర త‌తో ప్రాజెక్టును పూర్తి చేయించారు. తాజాగా ఇది గిరిజ‌నుల‌కుఅందుబాటులోకి వ‌చ్చింద‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. ఇది గిరిజ‌ను ల‌ను అమితోత్సాహానికి గురి చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రోడ్డు అన్న మాటే ఎరుగ‌ని తండాలు.. ప‌వ‌న్ ప్ర‌య‌త్నంతో పండ‌గ చేసుకుంటున్నాయి. అంతేకాదు.. ప‌వ‌న్ కృషిని అభినందిస్తున్నారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని కిలోమీట‌ర్ల మేర‌కు ర‌హ‌దారులు నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ ప‌రిణామాలు.. గిరిజ‌నుల‌ను జ‌న‌సేన వైపు నిల‌బెడుతున్నాయి. ప‌వ‌న్‌కు జైకొట్టిస్తున్నాయి. త‌మ నాయ‌కుడిగా గిరిజ‌నులు భావించేలా చేస్తున్నాయి. ఇక‌, మార్పు మొద‌లైంద‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి.

This post was last modified on June 1, 2025 6:52 am

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

1 hour ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

3 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

3 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

3 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

5 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

8 hours ago