Political News

గాంధీ భ‌వ‌న్‌లో అటెండ‌రు పోస్టు ఇచ్చినా చేస్తా: జ‌గ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీ కీల‌క నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం పీసీసీ స‌హా.. రాష్ట్ర స్థాయిలో పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్‌, పార్టీ ఇంచార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ కూడా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురి పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నారు. ఇప్ప‌టికే కొంద‌రికి బాధ్య‌త‌లు కూడా అప్ప‌గించారు.

అయితే.. కీల‌క ప‌ద‌వులు అయిపోయాయ‌ని.. ఇక‌, మిగిలింది.. నామ్ కేవాస్తే ప‌ద‌వులేన‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌గ్గారెడ్డి రియాక్ట్ అయ్యారు. ప‌ద‌వుల‌పై త‌నకు ఆశ‌లేద‌ని.. అలాగ‌ని త‌ను వ‌ద్ద‌ని అనుకోవ‌డం లేద‌న్నారు. అన్ని ప‌ద‌వులు అయిపోయాన‌ని.. త‌న స‌హ‌చ‌రులు కూడా చెబుతున్నా ర‌ని చెప్పారు. కానీ.. త‌న‌కు కూడా ఏదో ఒక ప‌ద‌వి ఇస్తార‌ని సంకేతాలు వ‌స్తున్నాయ‌ని చెప్పారు. ఏ ప‌ద‌వి ఇచ్చినా.. త‌న‌కు ఓకేనేని చెప్పారు.

“చివ‌ర‌కు గాంధీభ‌వ‌న్‌లో నువ్వు అటెండ‌రుగా ఉండు. అన్నా.. కూడా చేస్తా. నేను పార్టీ మ‌నిషిని. న‌న్ను ఎవ‌రో గుర్తించేంది..ప్ర‌జ‌లు గుర్తించాలి. గుర్తించారు.” అని జ‌గ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఇదేస‌మ‌యంలో బీజేపీ నాయ‌కుడు ర‌ఘునంద‌న్‌రావుపై తీవ్ర‌స్థాయిలో విమర్శ‌లు గుప్పించారు. రాహుల్ గాంధీని విమ‌ర్శించే స్తాయి ర‌ఘనంద‌న్‌కు లేద‌ని చెప్పారు. ఆయ‌న త‌న స్థాయిని తెలుసుకుని మాట్లాడాల‌ని జ‌గ్గారెడ్డి సూచించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచిన ఘ‌న‌త కాంగ్రెస్‌దేన‌ని చెప్పారు.

దేశంలో 544 సంస్థానాల‌ను, రాచ‌రికాల‌ను కూడా భార‌త్‌లో విలీనం చేసిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీదేన‌ని జ‌గ్గారెడ్డి చెప్పారు. గాందీల‌ కుటుంబం ఈ దేశానికి ఇద్ద‌రిని బ‌లి ఇచ్చింద‌ని.. ఇప్పుడు బీజేపీలో ఉన్న‌వారు ఎంత మందిని ఈ దేశం కోసం త్యాగంచేశారో.. చెప్పాల‌ని స‌వాల్ రువ్వారు. అల్లరి చిల్ల‌రి వేషాలు వేస్తే.. త‌గిన విధంగా బుద్ధి చెప్పాల్సి వ‌స్తుంద‌ని జ‌గ్గారెడ్డి హెచ్చ‌రించారు.

This post was last modified on May 31, 2025 10:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

5 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

7 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

14 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

15 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

15 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

17 hours ago