Political News

బాబును రెండోసారీ జైలుకు పంపేవాళ్లం: సజ్జల

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును నాటి వైసీపీ సర్కారు అరెస్టు చేసిన ఫలితం… కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. బాబు అరెస్టుతో జనం వైసీపీ పాలనపై భయాందోళనలకు గురయ్యారు. ఫలితంగా గంపగుత్తగా టీడీపీ నేతృత్వంలోని కూటమికి ఓట్లు వేసి… రికార్డు మెజారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఇప్పటికీ వైసీపీ గుర్తించనట్లే ఉంది. ఎందుకంటే… ఇప్పటికీ ఆ పార్టీకి చెందిన కీలక నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. అందులో భాగంగానే శనివారం వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తలచుకుని ఉంటే… బాబు రెండోసారి కూడా అరెస్టు అయ్యేవారని ఆయన అన్నారు.

అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు అయిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో సజ్జల శనివారం నెల్లూరు జైలులో ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడిన సందర్భంగా సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ అనుకుని ఉంటే చంద్రబాబు రెండోసారి కూడా అరెస్టు అయ్యేవారన్న సజ్జల… తామేమీ కక్షపూరిత రాజకీయాల జోలికి వెళ్లలేదని చెప్పారు. అయితే ఇప్పటి కూటమి ప్రభుత్వం మాత్రం విపక్షాలకు చెందిన బలమైన నేతలను టార్గెట్ చేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తూ అరెస్టులు చేస్తోందని ఆయన ఆరోపించారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో వైసీపీకి బలమైన నేతగా ఉన్న కాకాణిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేసి జైల్లో పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఉంటే… తామేదో ఊరకే అలా మాటలు చెబుతున్నారులే అని అకున్నామని సజ్జల వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికలకు ముందు చెప్పినట్లుగానే కూటమి సర్కారు రెడ్ బుక్ రాజ్యాంగాన్నే అమలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రత్యర్థులను ఏదో ఒక రూపంలో వేధించి, అరెస్టులు చేసి వారిని బలహీనం చేయడమే లక్ష్యంగా కూటమి పాలన సాగుతోందని ఆయన విరుచుకుపడ్డారు. కూటమి సాగిస్తున్న రాక్షస పాలనతో వైసీపీ బక్కచిక్కిపోతుందని ఆ పార్టీల నేతలు భావిస్తున్నారని…అయితే అందుకు విరుద్ధంగా కూటమి ఎంత నిర్బంధ పాలన సాగిస్తే…వైసీపీ అంత బలం పుంజుకుంటుందని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతున్నాయి.

This post was last modified on May 31, 2025 12:51 pm

Share
Show comments

Recent Posts

ఇక ఎవరొచ్చినా అమరావతిని ముట్టుకోలేరు

తెలుగు నేల విభజన తర్వాత రాజధాని లేకుండానే ఆంధ్ర ప్రదేశ్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. ఓ వైపు రాజధాని లేమి,…

8 minutes ago

బస్సు ప్రమాదం… కత్తితో 8 మందిని కాపాడిన రియల్ హీరో

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…

59 minutes ago

సంక్షోభాన్ని అడ్డుకునేందుకు భారత్ ప్లాన్ బీ

పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…

1 hour ago

పవన్ భార్యకు కూడా చిరు అన్నయే…

​మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్…

2 hours ago

‘ఉస్తాద్’కు లాస్ట్ ఛాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ…

2 hours ago

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…

2 hours ago