Political News

బాబు లెక్క తో జగన్ జాగ్రత్త పడాలి

మ‌హానాడు వేదిక‌గా చంద్ర‌బాబు గ‌ర్జ‌న విన్నాక‌.. ప్ర‌త్య‌క్షంగా చూశాక‌.. ఆయ‌న ఉద్దేశం స్ప‌ష్టంగా తెలిసిపోయింది. క‌డ‌ప జిల్లా ఎవ‌రి సొత్తూ కాదని తేల్చేశారు. ఇక నుంచి క‌డప కేంద్రంగానే చంద్ర‌బాబు రాజ‌కీయాలు సాగించ‌నున్నార‌న్న సందేశం స్పష్టంగా క‌నిపించింది. గండికోట ప్రాజెక్టు నుంచి క‌డ‌ప ఉక్కు క‌ర్మాగారం వ‌ర‌కు చంద్ర‌బాబు త‌న వ్యూహాల‌ను వివరించారు. అంతేకాదు, బలమైన ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకోవడానికీ కృషి చేశారు.

ఇది సాధారణంగా జగన్‌ ప్రభావం బలంగా ఉన్న కడపలాంటి జిల్లాలో సాధ్యం కాద‌న్న భావనను చంద్ర‌బాబు దాదాపు తుడిచిపెట్టేశారు. కానీ, రెండు సంవత్సరాల క్రితంతో పోల్చుకుంటే.. అదే సమయంలో జగన్ కూడా చంద్ర‌బాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో బలంగా అడుగుపెట్టారు. అప్పట్లో సీఎం అయిన జగన్ అక్కడ రెండు కీలక సభలు నిర్వహించారు. కుప్పంలో జెండా ఎగరేస్తామ‌ని ప్రకటించారు. చంద్ర‌బాబును ఓడించి తీరుతామ‌న్నారు. కానీ, చివరికి వైసీపీ జెండా ఎగరలేదు.

ఇప్పుడు చంద్ర‌బాబు నోటి నుంచి అటువంటి తీవ్ర వ్యాఖ్యలు రాక‌పోయినా.. క‌డ‌పలోని 10 స్థానాల‌ను తాము కైవసం చేసుకుంటామ‌ని చెప్ప‌డం ద్వారా.. ఆయ‌న సంకల్పం స్పష్టమైంది. ఈ నేప‌థ్యంలో, అప్ప‌ట్లో కుప్పంను కాపాడుకోవడంలో చంద్ర‌బాబు అనుసరించిన వ్యూహాలను.. ఇప్పుడు జగన్ అనుసరిస్తారా? లేక ఏం జరిగినా తనకు సంబంధం లేదని భావిస్తారా? అనేది చూడాలి. ముఖ్యంగా, ప్రజలు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియని పరిస్థితుల్లో జగన్ ప్రణాళిక ఎంతో కీలకంగా మారనుంది.

మార్పుకు సిద్ధంగా ఉన్న ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో జగన్ సచేతంగా వ్యవహరించకపోతే.. అది వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితులను తీసుకురావచ్చు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ఆ మార్పు దిశగానే క‌డ‌ప ప్రజలను తనదైన శైలిలో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలను అంచనా వేసుకుని జగన్ తగిన విధంగా స్పందించకపోతే, రాబోయే రోజుల్లో పార్టీకి సవాళ్లు తప్పవన్న సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.

అయితే, రాజకీయాల్లో ఈరోజు పరిస్థితి నాలుగు సంవత్సరాలు కొనసాగుతుందా? అన్నది ప్రశ్న. ఏదేమైనా.. ఇక జగన్ వంతు వచ్చింది. మరి ఆయన ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.

This post was last modified on May 30, 2025 9:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

2 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

2 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

2 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

11 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

11 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

12 hours ago