Political News

బాబు లెక్క తో జగన్ జాగ్రత్త పడాలి

మ‌హానాడు వేదిక‌గా చంద్ర‌బాబు గ‌ర్జ‌న విన్నాక‌.. ప్ర‌త్య‌క్షంగా చూశాక‌.. ఆయ‌న ఉద్దేశం స్ప‌ష్టంగా తెలిసిపోయింది. క‌డ‌ప జిల్లా ఎవ‌రి సొత్తూ కాదని తేల్చేశారు. ఇక నుంచి క‌డప కేంద్రంగానే చంద్ర‌బాబు రాజ‌కీయాలు సాగించ‌నున్నార‌న్న సందేశం స్పష్టంగా క‌నిపించింది. గండికోట ప్రాజెక్టు నుంచి క‌డ‌ప ఉక్కు క‌ర్మాగారం వ‌ర‌కు చంద్ర‌బాబు త‌న వ్యూహాల‌ను వివరించారు. అంతేకాదు, బలమైన ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకోవడానికీ కృషి చేశారు.

ఇది సాధారణంగా జగన్‌ ప్రభావం బలంగా ఉన్న కడపలాంటి జిల్లాలో సాధ్యం కాద‌న్న భావనను చంద్ర‌బాబు దాదాపు తుడిచిపెట్టేశారు. కానీ, రెండు సంవత్సరాల క్రితంతో పోల్చుకుంటే.. అదే సమయంలో జగన్ కూడా చంద్ర‌బాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో బలంగా అడుగుపెట్టారు. అప్పట్లో సీఎం అయిన జగన్ అక్కడ రెండు కీలక సభలు నిర్వహించారు. కుప్పంలో జెండా ఎగరేస్తామ‌ని ప్రకటించారు. చంద్ర‌బాబును ఓడించి తీరుతామ‌న్నారు. కానీ, చివరికి వైసీపీ జెండా ఎగరలేదు.

ఇప్పుడు చంద్ర‌బాబు నోటి నుంచి అటువంటి తీవ్ర వ్యాఖ్యలు రాక‌పోయినా.. క‌డ‌పలోని 10 స్థానాల‌ను తాము కైవసం చేసుకుంటామ‌ని చెప్ప‌డం ద్వారా.. ఆయ‌న సంకల్పం స్పష్టమైంది. ఈ నేప‌థ్యంలో, అప్ప‌ట్లో కుప్పంను కాపాడుకోవడంలో చంద్ర‌బాబు అనుసరించిన వ్యూహాలను.. ఇప్పుడు జగన్ అనుసరిస్తారా? లేక ఏం జరిగినా తనకు సంబంధం లేదని భావిస్తారా? అనేది చూడాలి. ముఖ్యంగా, ప్రజలు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియని పరిస్థితుల్లో జగన్ ప్రణాళిక ఎంతో కీలకంగా మారనుంది.

మార్పుకు సిద్ధంగా ఉన్న ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో జగన్ సచేతంగా వ్యవహరించకపోతే.. అది వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితులను తీసుకురావచ్చు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ఆ మార్పు దిశగానే క‌డ‌ప ప్రజలను తనదైన శైలిలో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలను అంచనా వేసుకుని జగన్ తగిన విధంగా స్పందించకపోతే, రాబోయే రోజుల్లో పార్టీకి సవాళ్లు తప్పవన్న సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.

అయితే, రాజకీయాల్లో ఈరోజు పరిస్థితి నాలుగు సంవత్సరాలు కొనసాగుతుందా? అన్నది ప్రశ్న. ఏదేమైనా.. ఇక జగన్ వంతు వచ్చింది. మరి ఆయన ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.

Satya

Recent Posts

బండ్ల గణేష్… త్రివిక్రమ్… కలిసిపోయారు!

టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…

2 hours ago

మహిష్మతి మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుందా

బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…

2 hours ago

రావిపూడి కన్ను రాయలసీమపై పడింది

టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…

3 hours ago

వివాదాలు ఎన్ని ఉన్నా అవకాశాలకు లోటు లేదు

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…

4 hours ago

టాక్సిక్ ఫిక్సు… పోటీ సినిమాలకు చిక్కు

అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…

5 hours ago

సీఐ నాగ‌రాజుకు మహిళల మద్దతు

విజ‌య‌వాడ కృష్ణ‌లంక పోలీసు స్టేషన్ సీఐ నాగ‌రాజుపై ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించి.. ఆయ‌న‌ను స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే..…

6 hours ago