కడప గడ్డపై టీడీపీ నిర్వహించిన పసుపు పండుగ మహానాడు చూశాక.. తమ పార్టీలోనూ మార్పులు చేయక తప్పదన్న సంకేతాలను వైసీపీ నాయకులు వెలిబుచ్చుతున్నారు. ఒక మార్పు మంచిదే అన్నట్టుగా నాయకులు గుసగుసలాడుతున్నారు. బలమైన గళం, ప్రత్యర్థులను వెంటాడడం, ప్రజలను మానసికంగా సంసిద్ధులను చేయడం వంటివి మహానాడులో స్పష్టంగా కనిపిస్తున్నాయని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇది చాలా జోరుగా, తీవ్రంగానే జరుగుతోంది.
“మేం ఊహించిన దానికంటే మహానాడు బాగానే జరిగింది. మా వాళ్లు ఇప్పటికైనా తెలుసుకోవాలి. లేకపోతే.. ఈ ప్రచారంలో పడి మేం కొట్టుకుపోతాం,” అని అనంతపురానికి చెందిన ఓ మాజీ యువ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇది వాస్తవం. టీడీపీ మహానాడును గమనిస్తే.. ఎన్నికల ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. వైసీపీ చెబుతున్నట్టు ‘సూపర్ సిక్స్’ను పట్టుకుని వేలాడలేదు. వాటిపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని కూడా ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
పైగా.. ‘సూపర్ సిక్స్’పై మరింత బలమైన ప్రచారాన్ని చేశారు. తద్వారా మహానాడు విజృంభణ ఒకరకంగా ప్రజలకు బలమైన సంకేతాలు పంపించింది. అంతేకాదు, టీడీపీకి రెండు బలమైన కంచు కంఠాలు ఉన్నాయన్నది స్పష్టమైంది. చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ కూడా విజృంభించి ప్రసంగించారు. ప్రజల మనసులను చూరగొనే ప్రయత్నంలో ఠారెత్తించారు. ఏం చేశారు? ఏం చేస్తారు? అనేది పక్కన పెడితే.. బలమైన వాయిస్ వినిపించడం ద్వారా ప్రజలకు భరోసా ఇచ్చారు.
ఇది టీడీపీకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తోంది. బీజేపీతో జతకట్టినా, దానిని సమర్థించుకున్న తీరు.. రాష్ట్రానికి మేలు చేసేలా పనులు చేయిస్తామన్న విధానం వంటివి ప్రజలను ఆకట్టుకున్నాయి. ఇవి వైసీపీలో చర్చకు రావడం గమనార్హం. అందుకే మహానాడు విఫలమైందన్న చర్చను మొదలు పెట్టాలని అనుకున్న నాయకులు కూడా వెనక్కి తగ్గారు. “మహానాడు చూశాక.. మాకు కూడా బలమైన గళాల అవసరం ఏర్పడిందని అనిపించింది,” అని విజయవాడకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
సో.. మొత్తానికి మహానాడు టీడీపీ కంటే కూడా వైసీపీలోనే చర్చనీయాంశంగా మారింది.
ఎంతో టాలెంట్ ఉన్నా సరే.. సరైన సక్సెస్ పడక ఒక స్థాయికి మించి ఎదగలేకపోతున్న హీరో సత్యదేవ్. నటుడిగా అతను…
అమెరికాలో మరో విషాదకర ఘటన తెలుగు కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. తెలంగాణకు చెందిన ఓ యువ విద్యార్థి తన స్నేహితుల…
అక్క చెల్లెమ్మలకు.. 2 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు ఇచ్చాం. జగనన్న తోడు, భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన,…
తమిళ అగ్ర కథాానాయకుల్లో ఒకరైన అజిత్ కుమార్కు నిన్న మాతృ వియోగం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన తల్లి మోహిని…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు.. పార్టీలో అంతర్గత…
తెలంగాణ అన్న పదం డిక్షనరీలోనే లేదని.. కొందరు ప్రాంతీయ వాదులు సృష్టించిన పదమని.. ఇటీవల తెలంగాణకు చెందిన కీలక టీడీపీ…