కడప గడ్డపై టీడీపీ నిర్వహించిన పసుపు పండుగ మహానాడు చూశాక.. తమ పార్టీలోనూ మార్పులు చేయక తప్పదన్న సంకేతాలను వైసీపీ నాయకులు వెలిబుచ్చుతున్నారు. ఒక మార్పు మంచిదే అన్నట్టుగా నాయకులు గుసగుసలాడుతున్నారు. బలమైన గళం, ప్రత్యర్థులను వెంటాడడం, ప్రజలను మానసికంగా సంసిద్ధులను చేయడం వంటివి మహానాడులో స్పష్టంగా కనిపిస్తున్నాయని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇది చాలా జోరుగా, తీవ్రంగానే జరుగుతోంది.
“మేం ఊహించిన దానికంటే మహానాడు బాగానే జరిగింది. మా వాళ్లు ఇప్పటికైనా తెలుసుకోవాలి. లేకపోతే.. ఈ ప్రచారంలో పడి మేం కొట్టుకుపోతాం,” అని అనంతపురానికి చెందిన ఓ మాజీ యువ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇది వాస్తవం. టీడీపీ మహానాడును గమనిస్తే.. ఎన్నికల ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. వైసీపీ చెబుతున్నట్టు ‘సూపర్ సిక్స్’ను పట్టుకుని వేలాడలేదు. వాటిపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని కూడా ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
పైగా.. ‘సూపర్ సిక్స్’పై మరింత బలమైన ప్రచారాన్ని చేశారు. తద్వారా మహానాడు విజృంభణ ఒకరకంగా ప్రజలకు బలమైన సంకేతాలు పంపించింది. అంతేకాదు, టీడీపీకి రెండు బలమైన కంచు కంఠాలు ఉన్నాయన్నది స్పష్టమైంది. చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ కూడా విజృంభించి ప్రసంగించారు. ప్రజల మనసులను చూరగొనే ప్రయత్నంలో ఠారెత్తించారు. ఏం చేశారు? ఏం చేస్తారు? అనేది పక్కన పెడితే.. బలమైన వాయిస్ వినిపించడం ద్వారా ప్రజలకు భరోసా ఇచ్చారు.
ఇది టీడీపీకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తోంది. బీజేపీతో జతకట్టినా, దానిని సమర్థించుకున్న తీరు.. రాష్ట్రానికి మేలు చేసేలా పనులు చేయిస్తామన్న విధానం వంటివి ప్రజలను ఆకట్టుకున్నాయి. ఇవి వైసీపీలో చర్చకు రావడం గమనార్హం. అందుకే మహానాడు విఫలమైందన్న చర్చను మొదలు పెట్టాలని అనుకున్న నాయకులు కూడా వెనక్కి తగ్గారు. “మహానాడు చూశాక.. మాకు కూడా బలమైన గళాల అవసరం ఏర్పడిందని అనిపించింది,” అని విజయవాడకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
సో.. మొత్తానికి మహానాడు టీడీపీ కంటే కూడా వైసీపీలోనే చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on May 31, 2025 11:06 am
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…