కడప గడ్డపై టీడీపీ నిర్వహించిన పసుపు పండుగ మహానాడు చూశాక.. తమ పార్టీలోనూ మార్పులు చేయక తప్పదన్న సంకేతాలను వైసీపీ నాయకులు వెలిబుచ్చుతున్నారు. ఒక మార్పు మంచిదే అన్నట్టుగా నాయకులు గుసగుసలాడుతున్నారు. బలమైన గళం, ప్రత్యర్థులను వెంటాడడం, ప్రజలను మానసికంగా సంసిద్ధులను చేయడం వంటివి మహానాడులో స్పష్టంగా కనిపిస్తున్నాయని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇది చాలా జోరుగా, తీవ్రంగానే జరుగుతోంది.
“మేం ఊహించిన దానికంటే మహానాడు బాగానే జరిగింది. మా వాళ్లు ఇప్పటికైనా తెలుసుకోవాలి. లేకపోతే.. ఈ ప్రచారంలో పడి మేం కొట్టుకుపోతాం,” అని అనంతపురానికి చెందిన ఓ మాజీ యువ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇది వాస్తవం. టీడీపీ మహానాడును గమనిస్తే.. ఎన్నికల ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. వైసీపీ చెబుతున్నట్టు ‘సూపర్ సిక్స్’ను పట్టుకుని వేలాడలేదు. వాటిపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని కూడా ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
పైగా.. ‘సూపర్ సిక్స్’పై మరింత బలమైన ప్రచారాన్ని చేశారు. తద్వారా మహానాడు విజృంభణ ఒకరకంగా ప్రజలకు బలమైన సంకేతాలు పంపించింది. అంతేకాదు, టీడీపీకి రెండు బలమైన కంచు కంఠాలు ఉన్నాయన్నది స్పష్టమైంది. చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ కూడా విజృంభించి ప్రసంగించారు. ప్రజల మనసులను చూరగొనే ప్రయత్నంలో ఠారెత్తించారు. ఏం చేశారు? ఏం చేస్తారు? అనేది పక్కన పెడితే.. బలమైన వాయిస్ వినిపించడం ద్వారా ప్రజలకు భరోసా ఇచ్చారు.
ఇది టీడీపీకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తోంది. బీజేపీతో జతకట్టినా, దానిని సమర్థించుకున్న తీరు.. రాష్ట్రానికి మేలు చేసేలా పనులు చేయిస్తామన్న విధానం వంటివి ప్రజలను ఆకట్టుకున్నాయి. ఇవి వైసీపీలో చర్చకు రావడం గమనార్హం. అందుకే మహానాడు విఫలమైందన్న చర్చను మొదలు పెట్టాలని అనుకున్న నాయకులు కూడా వెనక్కి తగ్గారు. “మహానాడు చూశాక.. మాకు కూడా బలమైన గళాల అవసరం ఏర్పడిందని అనిపించింది,” అని విజయవాడకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
సో.. మొత్తానికి మహానాడు టీడీపీ కంటే కూడా వైసీపీలోనే చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on May 31, 2025 11:06 am
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…