Political News

‘వాళ్ళు కడప లో పెడితే మనం కుప్పం లో పెడదాం’

‘వాళ్లు కడపలో పెడితే, మనం కుప్పంలో పెడదాం’

ప్రస్తుతం టీడీపీ నిర్వహిస్తున్న మహానాడును తొలిసారిగా కడపలో ఏర్పాటు చేశారు. ఇది వైసీపీ అధినేత జగన్‌కు కంచుకోట అనే విషయం తెలిసిందే. అయితే రాజకీయంగా దూకుడు చూపించాలని భావించిన చంద్రబాబు, నేరుగా కడపలోనే ఈసారి మహానాడుకు శ్రీకారం చుట్టారు. ఈ పరిణామం రాజకీయంగా చర్చకు దారితీసింది.

ఇదిలా ఉంటే, వైసీపీ కేంద్ర కార్యాలయంలో పలువురు నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహానాడుపైనే ఎక్కువగా చర్చ జరిగింది. ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు పక్కన పెట్టారని, స్వోత్కర్ష మరియు పరనిందలకే మహానాడును పరిమితం చేశారని పలువురు నేతలు పేర్కొన్నారు. అలాగే, “సూపర్ సిక్స్” హామీల గురించి చంద్రబాబు ప్రస్తావించలేదని జగన్ వ్యాఖ్యానించారు.

ఈ సమయంలో ఓ మహిళా నాయకురాలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అది కూడా వచ్చే ఏడాది నిర్వహించనున్న వైసీపీ ప్లీనరీకి సంబంధించి కావడం గమనార్హం. వచ్చే ఏడాది జూలైలో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని వైసీపీ ప్లీనరీ నిర్వహించాలని జగన్ ఇటీవల దిశానిర్దేశం చేశారు. ఈ ప్లీనరీని ఘనంగా నిర్వహించుకోవాలని కూడా వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో ఆసక్తికర చర్చ జరిగింది. ప్రస్తుతం టీడీపీ మహానాడును జగన్ స్వస్థలమైన కడపలో నిర్వహిస్తున్నారని, కాబట్టి మన వైసీపీ ప్లీనరీను కుప్పంలో నిర్వహించుకుందాం, అప్పుడే ‘ఢీ అంటే ఢీ’ అన్నట్టుగా రాజకీయంగా బలమైన సందేశం వెళ్లుతుందని ఆ మహిళా నాయకురాలు పేర్కొన్నారు.

దీనిపై కొద్దిసేపు మౌనం వహించిన జగన్, ఇతర నాయకుల అభిప్రాయాలు కూడా వినాలని అన్నారు. మెజారిటీ నాయకులు పోటాపోటీగా నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన జగన్, “మనమూ పోటాపోటీగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోము. ప్రజల కోసం చేసే కార్యక్రమం ఎక్కడ నిర్వహించినా ఒకటే. ప్రజలను మనవైపు తిప్పుకోవడానికి చేసే ప్రయత్నమే ముఖ్యం. వేదిక ఎక్కడ అనే విషయంలో నాకు వదిలేయండి” అని స్పష్టం చేశారు.

This post was last modified on May 30, 2025 6:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

3 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

4 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

5 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

5 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

6 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

8 hours ago