Political News

వై నాట్ గొడ్డలి పోటు టీడీపీ విధానం కాదు: చంద్రబాబు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందన్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి కంపెనీలు రాకపోవడం, ఉన్న కంపెనీలు వెళ్ళిపోవడం, జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం అప్పుల కుప్పగా మారడం, రాజధాని లేకపోవడం వంటి కారణాలతో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ పేరు భ్రష్టుపట్టిందని విమర్శలు వచ్చాయి. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరువు నిలబడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు వేసిన ఓట్లతో కూటమి గెలిచిందని, అందువల్ల ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ పరపతి పెరిగిందని తెలిపారు.

మహానాడు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు వైఎస్సార్సీపీ పై మండిపడ్డారు. అహంకారంతో విర్రవీగిన వారికి ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని, కూటమి ప్రభుత్వంతో ఢిల్లీలో రాష్ట్ర ప్రతిష్ట పెరిగిందని పేర్కొన్నారు. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమి ఏర్పాటు చేశాయని వివరించారు. కడప గడపలో రాజకీయ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. రాయలసీమలో వైసీపీకి 7 సీట్లు వస్తే, కడప జిల్లాలోనే కూటమి 7 సీట్లు గెలిచిందని గుర్తు చేశారు. 2029 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలోని 10 స్థానాలన్నింటినీ గెలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

వైసీపీ పాలనలో కడపలో హింసా రాజకీయాలు, కేసులు రాజ్యమేలాయని అన్నారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హింసా, కక్షా రాజకీయాలు తగ్గాయని తెలిపారు. గతంలో రాయలసీమలో ఫ్యాక్షన్‌ను రూపుమాపిన తాను, కఠినంగా వ్యవహరించానని చంద్రబాబు గుర్తు చేశారు. ఫ్యాక్షన్ తగ్గిన తర్వాత సీమ అభివృద్ధి చెందిందా లేదా అనే ప్రశ్నను ఆయన ఎదురుపెట్టారు.

“వై నాట్ గొడ్డలి పోటు” అనేది టీడీపీ విధానం కాదని, ప్రతి క్షణం కష్టపడి ప్రజల సంక్షేమం కోసం పనిచేయడమే తమ విధానమని చంద్రబాబు స్పష్టం చేశారు. “క్లైమోర్ మెన్‌లకే భయపడని నేను, ఈ సమస్యలను చూసి భయపడతానా?” అంటూ ప్రశ్నించారు. సంపద సృష్టించడం, పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం తన జీవిత లక్ష్యమని తెలిపారు. పార్టీని నమ్మిన ప్రజల కోసం అందరం కలిసికట్టుగా ఉండాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు మహానాడు వేదికగా చంద్రబాబు పిలుపునిచ్చారు.

This post was last modified on May 30, 2025 6:34 am

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

గ‌ద్ద‌ర్ అవార్డుల్లో గందరగోళం.. ఏం జరిగింది?

గ‌త ఏడాది ప్ర‌తిష్ఠాత్మ‌కంగా గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను మొద‌లుపెట్టిన తెలంగాణ ప్ర‌భుత్వం.. ఒకేసారి చాలా ఏళ్ల‌కు క‌లిపి అవార్డులు ప్ర‌క‌టించిన సంగ‌తి…

1 hour ago

యూత్ హీరోలు రూటు మారుస్తున్నారు

దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…

4 hours ago

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

8 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

8 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

8 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

9 hours ago