Political News

ముక్కోడు..తిక్కోడు.. నన్నూరి పంచ్ వైరల్

టీటీడీ బోర్డు సభ్యుడు నన్నూరి నర్సిరెడ్డి పేరు టీడీపీ కార్యకర్తలందరికీ సుపరిచితమే. తెలంగాణ టీడీపీ నేత అయిన నన్నూరి నర్సిరెడ్డి తన వాగ్ధాటితో అందరినీ కట్టిపడేస్తుంటారు. తనకు మాత్రమే సొంతమైన ప్రాసతో, పంచ్ డైలాగులతో ప్రత్యర్థి పార్టీ నేతలపై నర్సిరెడ్డి వేసే పంచులు, సెటైర్లు వైరల్‌గా మారుతుంటాయి. మహానాడు వంటి మహాసభలతో పాటు టీడీపీ సభలలో తనదైన శైలిలో నన్నూరి చెప్పే డైలాగులు సభకు వచ్చిన నేతలతో పాటు టీడీపీ శ్రేణులలో కొత్త జోష్ నింపుతుంటాయి.

ఈ క్రమంలోనే తాజాగా కడపలో జరుగుతున్న మహానాడులో కూడా నన్నూరి చెప్పిన డైలాగ్ ఒకటి వైరల్‌గా మారింది. ఆంధ్రా, తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయని చెప్పే క్రమంలో నన్నూరి చెప్పిన డైలాగ్ ట్రెండ్ అవుతోంది. ‘‘ప్రస్తుతం అద్భుతమైన వాతావరణం ఉంది… మొన్నటి వరకు ఒక రకంగా ఉండే… మాకాడ ముక్కోడు పోయిండు… మీ కాడ తిక్కోడు పోయిండు…ముక్కాయన లిఫ్ట్ ఇరిగేషన్… తిక్కాయన ఆత్మలతో మాట్లాడుతున్నడు’’ అంటూ మాజీ సీఎం కేసీఆర్‌ను, మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి నర్సిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

ఢిల్లీ వీధుల్లో దిగజారుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని నర్సిరెడ్డి అన్నారు. పేదల కోసం, బీదల కోసం… ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ 9 నెలల్లోనే అధికారం చేపట్టి దేశ రాజకీయాల్లో సంచలనం రేపిందని తెలిపారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ప్రజలకు రాజకీయ చైతన్యం వచ్చిందని, గ్రామాలకు మౌలిక సదుపాయాలు అందాయని.. ప్రజలకు సంక్షేమ ఫలాలు చేరాయని నర్సిరెడ్డి అన్నారు. చెట్టు మీద కూర్చొన్న పక్షి కొమ్మ బలాన్ని నమ్ముకోదని, దాని రెక్కల బలాన్ని నమ్ముకుంటుందని, టీడీపీ కూడా కార్యకర్తల బలాన్ని, బలగాన్ని నమ్ముకుందని అన్నారు.

ఇక, టీడీపీ అధినేత చంద్రబాబును నర్సిరెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. తెలుగు జాతి… విశ్వఖ్యాతి తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు.

This post was last modified on May 29, 2025 11:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

2 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

3 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

3 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

3 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

4 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

5 hours ago