తెలంగాణలో బీఆర్ ఎస్ పార్టీ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నమోదైన ఈ కేసులో ప్రధాన నిందితుడుగా.. అప్పటి ఐపీఎస్ అధికారి.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా పనిచేసిన ప్రభాకర్రావు ఉన్నారు. అయితే.. కేసు నమోదు అవుతుందని తెలిసిన ఆయన వెంటనే.. అమెరికాకు వెళ్లిపోయారు. కానీ.. కేసులో మాత్రం ఆయనను ఏ-1గా పేర్కొన్నారు.
అప్పటి నుంచి ప్రభాకర్ రావును తెలంగాణకు తెప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, ఆయన మాత్రం రావడంలేదు. ఈ లోగా ముందస్తు బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఆయా పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. దీంతో కొన్నాళ్ల కిందట సుప్రీంకోర్టును ఆశ్రయించి.. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగాదీనిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లోగా తెలంగాణకు వచ్చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది.
అంతేకాదు.. విచారణకు సహకరించాలని కూడా ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు నిర్దేశించింది. “కీలకమైన అధికారులుగా పనిచేసిన వారు ఇలా తప్పించుకుని వెళ్లిపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. మన చట్టాలు అంత కఠినంగా ఉన్నాయా?“అని న్యాయమూర్తి ఒకరు వ్యాఖ్యానించారు. మూడు రోజుల్లోనే భారత్కు తిరిగి రావాలన్న కోర్టు.. విచారణ అధికారులకు సహకరించాలని సూచించింది. అంతేకాదు.. తెలంగాణ ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు చేసింది.
ప్రభాకర్రావుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని, థర్డ్ డిగ్రీ వంటివి ప్రయోగించడం.. దురుసుగా ప్రవర్తించడంవంటివి చేయొద్దని పేర్కొంది. ఇదేసమయంలో ఆయనకు `తాత్కాలిక ముందస్తు బెయిల్`ను మంజూరు చేసింది. అలాగే పాస్ పోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు.. మూడు రోజుల్లో భారత్కు తిరిగి వస్తానని లిఖిత పూర్వకంగా కోర్టుకు సమర్పించాలని సంబంధిత న్యాయవాదిని ఆదేశించింది. ఇక, ముందస్తు బెయిల్ విషయంపై తర్వాత విచారణ జరుపుతామంది.
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…