Political News

నెక్స్ట్ టార్గెట్ పీవోకేనే: రాజ్ నాథ్

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ తో పాటు పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ తో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య దాదాపుగా యుద్ధ వాతావరణం ఏర్పడడం, ఆ తర్వాత ఇరుదేశాలు సీజ్ ఫైర్ కు అంగీకరించడం తెలిసిందే. ఈ క్రమంలోనే పీవోకేను భారత్ తిరిగి ఆక్రమించుకోవడానికి ఇదే సరైన సమయం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పీవోకే ప్రజలు మనోళ్లేనని, ఏదో ఒక రోజు పీవోకే దానంతట అదే తిరిగి వస్తుందని రాజ్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళికంగా విడిపోయినప్పటికీ పీవోకే ప్రజలు రాజకీయంగా ఏదో ఒక రోజు భారత్ లో ఏకమవుతారని వ్యాఖ్యానించారు. ఆరోజు ఎంతో దూరంలో లేదని, అప్పుడు పీవోకే దానంతట అదే భారత భూభాగంలో కలిసిపోతుందని చెప్పారు. పీవోకే దానంతట అదే తిరిగి వస్తుందని, అక్కడి ప్రజలకు భారత్ తో దృఢమైన సంబంధాలున్నాయని రాజ్ నాథ్ అభిప్రాయపడ్డారు. పీవోకేలో కొందరు మాత్రమే తప్పుడు దారిలో నడుస్తున్నారని అన్నారు

గ్రేట్ ఇండియా సంకల్పంతో పోతున్నామని, దేశ భద్రతకు మేకిన్ ఇండియా ముఖ్యమని ఆపరేషన్ సిందూర్ తో నిరూపించామని అన్నారు. ఏమైనా చేయగలిగే సత్తా భారత్ కు ఉందని, కానీ శక్తితో పాటు సంయమనం కూడా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశీయంగా అభివృద్ధి చెందిన క్షిపణులను, వ్యవస్థలను ఉపయోగించామని, అది ప్రపంచాన్ని షాక్ కు గురిచేసిందని అన్నారు. మనం ఇప్పుడు ఫైటర్ జెట్లు, క్షిపణి వ్యవస్థలను నిర్మించడం, కొత్త తరం యుద్ధ సాంకేతికత వంటి విషయాలపై ఫోకస్ చేస్తున్నామని చెప్పారు.

ఉగ్రవాద వ్యాపారం నడపడం సులువు అని, దానికోసం పెద్ద ఖర్చేం కాదని అన్నారు. అయితే, అందుకు భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదని, అది ఇప్పుడు పాక్ కు అర్థమైందని చెప్పుకొచ్చారు. ఎన్నో ఏళ్లుగా పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం 23 నిమిషాల్లో తుడిచి పెట్టేసిందని రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.

Kumar

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

4 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

5 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

6 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

6 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

6 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

7 hours ago