తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నూతన జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుత అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఎన్నికయ్యారు. ఇప్పటికే 30 ఏళ్లుగా టీడీపీ అధినేతగా కొనసాగుతూ వస్తున్న చంద్రబాబును పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోమారు ఎన్నుకుంటూ టీడీపీ వార్షిక వేడుక మహానాడు తీర్మానం చేసింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు చేత పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రమాణం చేయించారు. ఈ వేడుక టీడీపీ నేతలు, కార్యకర్తల హర్షధ్వానాల మధ్య అంగరంగ వైభంగా జరిగింది.
తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 1995లో చంద్రబాబు టీడీపీ అధినేతగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. నాటి నుంచి నేటి దాకా చంద్రబాబే పార్టీ అధినేతగా కొనసాగుతూ వస్తున్నారు. పార్టీ నియమావళి ప్రకారం ప్రతి రెండేళ్లకు ఓ సారి పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుండగా… ఈ ఎన్నికకు ఆయా ఏడాదుల్లో జరుగుతున్న మహానాడులే వేదికగా నిలుస్తున్నాయి. తాజాగా కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలో జరుగుతున్న మహానాడు వేదికగా చంద్రబాబు మరోమారు అధినేతగా ఎన్నికయ్యారు. ఈ సారి కూడా ఈ పదవిలో చంద్రబాబు రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.
ఇదిలా ఉంటే… పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన మహానాడు తొలి రోజు అయిన మంగళవారమే నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆ తర్వాత పార్టీకి చెందిన పలువురు సీనియర్లు దాదాపుగా 21 మంది నేతలు పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి చంద్రబాబును ప్రతిపాదిస్తూ సంతకాలు చేశారు. చివరాఖరుగా ఆ నామినేషన్లపై బుదవారం వర్ల రామయ్య సంతకం తీసుకున్నారు. అధ్యక్ష పదవికి ఇంకే నేత నుంచి కూడా నామినేషన్ రాని నేపథ్యంలో చంద్రబాబు పేరునే పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎంపికైనట్లుగా వర్ల ప్రకటించారు. ఈ సారి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి చేపట్టిన చంద్రబాబు… ఈ టెర్మ్ ను పూర్తి చేసుకుంటే… 32 ఏళ్ల పాటు టీడీపీ అధినేతగా ఆయన కొనసాగినట్టు అవుతుంది.
This post was last modified on May 28, 2025 6:47 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…