Political News

యోగా తో రికార్డులు టార్గెట్ చేసిన బాబు

ఏపీని ప్ర‌పంచంలోనే ముందుండేలా చేస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. క‌డ‌ప‌లో జ‌రుగుతున్న మ‌హానాడులో రెండో రోజు మాట్లాడిన ఆయ‌న‌.. యోగా నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌త్య‌క తీర్మానం చేశారు. వ‌చ్చే నెల 21న అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వానికి ఏపీ ఆతిథ్యం ఇస్తున్న‌ట్టు చెప్పారు. దీనికి ప్ర‌ధాని మోడీ హాజ‌రు అవుతున్నార‌ని.. అంత‌ర్జాతీయ స్థాయిలో ప‌లువురు ప్ర‌తినిధులు కూడా వ‌స్తున్నార‌న్న ఆయ‌న‌.. ఈ క్ర‌మంలో ఏపీ అభివృద్ధిని కూడా ప్ర‌పంచ స్థాయికి వివ‌రించే కార్య‌క్ర‌మాల‌కు రూప‌క‌ల్ప‌న చేశామ‌న్నారు.

మ‌న బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా.. మ‌న పేరు మార్మోగేలా యోగాను నిర్వ‌హిస్తున్న‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. ఆర్కే బీచ్ నుంచి భీముని ప‌ట్నం వ‌ర‌కు 5 ల‌క్ష‌ల మందితో 25 కిలో మీట‌ర్ల మేర‌కు యోగా ను చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచంలో ఎక్క‌డా జ‌ర‌గ‌లేద‌న్నారు. దీనికి టీడీపీ కార్యక‌ర్త‌లు త‌ర‌లి రావాల‌న్నారు. ఇలా నిర్వ‌హించ‌డం.. ఒక్క ఎన్డీయే ప్ర‌భుత్వానికి, టీడీపీ ప్ర‌భుత్వానికే సాధ్య‌మ‌ని చెప్పారు.

యోగాలో పాల్గొన‌డం గర్వ‌కార‌ణ‌మ‌న్న చంద్ర‌బాబు.. దీనిలో ముఖ్యంగా మంత్రులు అంద‌రూ పాల్గొనాలని సూచించారు. ఒత్తిడి, ప‌నిభారంతో ఇబ్బంది ప‌డుతున్న మంత్రులకు యోగా ద్వారా కొంత ఉప‌శ‌మ‌నం ద‌క్కుతుంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ స‌ర్టిఫికెట్ ఇస్తామ‌న్నారు. మే 21 నుంచి జూన్ 21 వ‌ర‌కు యోగా మాసోత్స‌వంగా ప్ర‌క‌టించిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. మ‌న అంద‌రికంటే కూడా.. విద్యాశాఖ మంత్రి(లోకేష్‌)పైనే ఎక్కువ‌గా బాధ్య‌త ఉంది అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల మందికి స‌ర్టిఫికెట్లు ఇవ్వాల‌న్న ల‌క్ష్యం పెట్టుకున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు చెప్పారు. విశాఖ‌లో నిర్వ‌హించే యోగా దినోత్స‌వానికి ఊళ్ల‌కు ఊళ్లు త‌ర‌లి రావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టికే యోగా శిక్ష‌ణ త‌ర‌గ‌తులు ప్రారంభించిన‌ట్టు చెప్పారు. దీనిని అంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు.

This post was last modified on May 28, 2025 5:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

29 minutes ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

4 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

5 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

5 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

6 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

6 hours ago