ఏపీని ప్రపంచంలోనే ముందుండేలా చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. కడపలో జరుగుతున్న మహానాడులో రెండో రోజు మాట్లాడిన ఆయన.. యోగా నిర్వహణపై ప్రత్యక తీర్మానం చేశారు. వచ్చే నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏపీ ఆతిథ్యం ఇస్తున్నట్టు చెప్పారు. దీనికి ప్రధాని మోడీ హాజరు అవుతున్నారని.. అంతర్జాతీయ స్థాయిలో పలువురు ప్రతినిధులు కూడా వస్తున్నారన్న ఆయన.. ఈ క్రమంలో ఏపీ అభివృద్ధిని కూడా ప్రపంచ స్థాయికి వివరించే కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు.
మన బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా.. మన పేరు మార్మోగేలా యోగాను నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. ఆర్కే బీచ్ నుంచి భీముని పట్నం వరకు 5 లక్షల మందితో 25 కిలో మీటర్ల మేరకు యోగా ను చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇది ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నారు. దీనికి టీడీపీ కార్యకర్తలు తరలి రావాలన్నారు. ఇలా నిర్వహించడం.. ఒక్క ఎన్డీయే ప్రభుత్వానికి, టీడీపీ ప్రభుత్వానికే సాధ్యమని చెప్పారు.
యోగాలో పాల్గొనడం గర్వకారణమన్న చంద్రబాబు.. దీనిలో ముఖ్యంగా మంత్రులు అందరూ పాల్గొనాలని సూచించారు. ఒత్తిడి, పనిభారంతో ఇబ్బంది పడుతున్న మంత్రులకు యోగా ద్వారా కొంత ఉపశమనం దక్కుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్ ఇస్తామన్నారు. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మాసోత్సవంగా ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. మన అందరికంటే కూడా.. విద్యాశాఖ మంత్రి(లోకేష్)పైనే ఎక్కువగా బాధ్యత ఉంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో 20 లక్షల మందికి సర్టిఫికెట్లు ఇవ్వాలన్న లక్ష్యం పెట్టుకున్నట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖలో నిర్వహించే యోగా దినోత్సవానికి ఊళ్లకు ఊళ్లు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే యోగా శిక్షణ తరగతులు ప్రారంభించినట్టు చెప్పారు. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
This post was last modified on May 28, 2025 5:42 pm
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…