Political News

బాబు మార్క్ పాలిటిక్స్ – నేతల ప్రసంగాలకు ర్యాంకులు!

టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రమశిక్షణకు పెట్టింది పేరు. పార్టీలో తనతో మొదలు సాధారణ కార్యకర్త వరకు అందరూ క్రమశిక్షణతో మెలగాలని చంద్రబాబు కోరుకుంటారు. అంతేకాదు, పనితీరు ఆధారంగా సాధారణ కార్యకర్త నుంచి లోకేష్ వరకు అందరినీ సమానంగా చూడడం చంద్రబాబు నైజం. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును బట్టి వారికి ప్రోగ్రెస్ కార్డులివ్వడం చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ కు నిదర్శనం.

ఈ క్రమంలోనే తాజాగా మహానాడు సందర్భంగా తన పాలిటిక్స్ ను మరోసారి చంద్రబాబు చూపించారు. మహానాడులో పలువురు టీడీపీ నేతలు ప్రసంగాలపై కార్యకర్తల నుంచి చంద్రబాబు ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. మహానాడులో చాలామంది టీడీపీ నేతలు ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే, ఏదో వచ్చారు..ప్రసంగించారు..వెళ్లిపోయారు..అన్న రీతిలో కాకుండా ఆ ప్రసంగాలపై టీడీపీ కార్యకర్తల నుంచి అభిప్రాయాలను చంద్రబాబు తెలుసుకున్నారు.

వాట్సాప్, ఐవీఆర్ఎస్ పద్ధతి ద్వారా కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు చంద్రబాబు. టీడీపీ అంటే పెద్ద నాయకులే కాదని అందరు కలిస్తేనే పార్టీ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమర్థవంతంగా పని చేసే వారికి గుర్తింపు ఉంటుందని, సామర్థ్యాన్ని బట్టి గుర్తింపునిస్తున్నామని చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. ఒకవేళ ఎవరైనా నేతలు బాగా మాట్లాడుకుంటే ఆ విషయాన్ని వారికి చెప్పి మెరుగుపరుచుకునేలా సూచనలిస్తామని చంద్రబాబు అన్నారు.

అలా లేని పక్షంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తామని తేల్చి చెప్పారు. పోటీ ప్రపంచంలో ముందుకు పోవాలంటే కష్టపడాలని అన్నారు. తాను కూడా ప్రసంగానికి ముందు రోజు రాత్రి మూడు, నాలుగు గంటలు ప్రిపేర్ అవుతానని చంద్రబాబు చెప్పారు. ఇలా వాట్సాప్ ద్వారా సేకరించిన అభిప్రాయాల్లో కొల్లు రవీంద్ర ప్రసంగం బాగుందని 93.1% మంది అభిప్రాయపడ్డారని అన్నారు. ఇక, రవి నాయుడు 86%, మద్దిపాటి వెంకట రాజు 86%, వేణుగోపాల్ 85%, కావలి గ్రీష్మ 85%, దుర్గాప్రసాద్ 84%, శశి 84%, వెంకట నరసింహా 24%, రాధాకృష్ణ 83%, శివకుమార్ 83%, అప్పలనాయుడు 81%, టీజీ భరత్ 76.9%, ఖాదర్ బాషా 72 శాతం తెచ్చుకున్నారు.

ఇక, ఐవీఆర్ఎస్ లో కొల్లు రవీంద్ర 70 %, వెంకటరాజు 68%, వెంకట నరసింహ 66%, వేణుగోపాల్ 67%, రవి నాయుడు 69%, ఈశ్వర్ రెడ్డి 65%, దుర్గాప్రసాద్ 65% బాగా మాట్లాడారని ప్రజలు అభిప్రాయపడ్డారని చెప్పారు. గతంలో మాదిరిగా 10 గంటల వరకు మహానాడు సమావేశాలు పెట్టడం లేదని, సమయపాలన పాటిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఒకవేళ ఎక్కువ సమయం మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తే గంట కొట్టడం, అప్పటికీ ఆపకుంటే మైక్ కట్ చేయడం వంటివి చేస్తున్నామని అన్నారు. ఏదేమైనా ప్రసంగాలకు కూడా అభిప్రాయ సేకరణ చేస్తూ, ర్యాంకులిస్తూ చంద్రబాబు తన మార్క్ పాలిటిక్స్ తో మరోసారి వార్తల్లో నిలిచారు.

This post was last modified on May 28, 2025 12:12 pm

Share
Show comments
Published by
Satya
Tags: Babu

Recent Posts

మణిరత్నం సినిమా… పెర్ఫామెన్సులు పేలిపోతాయ్

నటీనటుల నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టుకోవడంలో ఇండియాలో మణిరత్నంను మించిన దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదు. మొదట్నుంచి ఆయన సినిమాలను గమనిస్తే…

44 minutes ago

215 కోట్ల ఆఫర్ వద్దనుకున్నారా

దురంధర్ తర్వాత బాలీవుడ్ లో స్పై సినిమాలను చూసే దృక్పథం మారిపోయింది. నమ్మశక్యం కాని ఫైట్లు, ఫిజిక్స్ ని ఛాలెంజ్…

2 hours ago

‘భ‌ర్త సంపాద‌న ఎంతో భార్య‌కు చెప్ప‌క్క‌ర్లేదు’

స‌హ‌జంగా భర్త ఎంత సంపాయిస్తున్నాడో.. ఏం చేస్తున్నాడో.. తెలుసుకునేందుకు భార్య‌లు ఆస‌క్తి చూపుతారు. ఈ విష‌యం తెలుసుకునేందుకు వారు ఉత్సాహం…

3 hours ago

డేర్ చేయకపోవడమే డెకాయిట్ తెలివి

ముందు ప్రకటించిన ప్రకారమైతే అడివి శేష్ డెకాయిట్ మార్చి 19 విడుదల కావాలి. కానీ అదే రోజు దురంధర్ 2,…

4 hours ago

ఇండియా ముందుకు వెళ్లాలంటే?

టీ20 ప్రపంచకప్‌లో మొన్నటిదాకా భారత జట్టు టైటిల్‌కు హాట్ ఫేవరెట్. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలిచింది. మొత్తం…

4 hours ago

తల్లి సినిమాలు ఒక్కటీ చూడని హీరో పిల్లలు

సినిమాల పట్ల ఆసక్తి లేని పిల్లలు తక్కువగా ఉంటారు. అందులోనూ సినీ కుటుంబానికి చెందిన వాళ్లయితే కచ్చితంగా అటు వైపు…

5 hours ago