వైసీపీ నాయకుడు, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్నారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నాయకులపై వరుసగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తాజాగా.. ఆళ్లపైనా పోలీసులు కేసు పెట్టారు. గతంలో 2021-22 మధ్య కాలంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి నేపథ్యంలో ఆళ్లపై కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ కేసును విచారిస్తున్న సీఐడీ పోలీసులు తాజాగా ఆళ్ల పేరును కూడా విచారణలో చేర్చారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఈ కేసులో 127వ నిందితుడిగా(ఏ-127) పేర్కొనడం గమనార్హం. దీంతో ఆయన ఈ రోజో రేపో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. గతంలో వైసీపీ పాలనలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. కార్యాలయ అద్దాలను ధ్వంసం చేయడంతోపాటు.. ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి కూటమి సర్కారు వచ్చాక విచారణ జరుగుతోంది.
ఇటీవలే ఈ కేసుకు సంబంధించి వైసీపీ నాయకుడు, కీలక సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీ మరోనేత దేవినేని అవినాష్ చౌదరిలను సీఐడీ పోలీసులు విచారించారు. ఇక, ఇప్పటికే 12 మంది వైసీపీ కార్యకర్తలు ఈ కేసులో చిక్కి రిమాండ్ ఖైదీలుగా ఉండగా.. పలువురిని ఇప్పటికే సీఐడీ పోలీసులు విచారించారు. ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు కూడా ఈ కేసులో విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు పార్టీ కార్యాలయం ఉన్న నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు కావడం గమనార్హం. మరి ఈయన ఏం చెబుతారో చూడాలి.
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…