వైసీపీ నాయకుడు, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్నారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నాయకులపై వరుసగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తాజాగా.. ఆళ్లపైనా పోలీసులు కేసు పెట్టారు. గతంలో 2021-22 మధ్య కాలంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి నేపథ్యంలో ఆళ్లపై కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ కేసును విచారిస్తున్న సీఐడీ పోలీసులు తాజాగా ఆళ్ల పేరును కూడా విచారణలో చేర్చారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఈ కేసులో 127వ నిందితుడిగా(ఏ-127) పేర్కొనడం గమనార్హం. దీంతో ఆయన ఈ రోజో రేపో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. గతంలో వైసీపీ పాలనలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. కార్యాలయ అద్దాలను ధ్వంసం చేయడంతోపాటు.. ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి కూటమి సర్కారు వచ్చాక విచారణ జరుగుతోంది.
ఇటీవలే ఈ కేసుకు సంబంధించి వైసీపీ నాయకుడు, కీలక సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీ మరోనేత దేవినేని అవినాష్ చౌదరిలను సీఐడీ పోలీసులు విచారించారు. ఇక, ఇప్పటికే 12 మంది వైసీపీ కార్యకర్తలు ఈ కేసులో చిక్కి రిమాండ్ ఖైదీలుగా ఉండగా.. పలువురిని ఇప్పటికే సీఐడీ పోలీసులు విచారించారు. ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు కూడా ఈ కేసులో విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు పార్టీ కార్యాలయం ఉన్న నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు కావడం గమనార్హం. మరి ఈయన ఏం చెబుతారో చూడాలి.
This post was last modified on May 27, 2025 5:03 pm
లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…