వైసీపీ నాయకుడు, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్నారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నాయకులపై వరుసగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తాజాగా.. ఆళ్లపైనా పోలీసులు కేసు పెట్టారు. గతంలో 2021-22 మధ్య కాలంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి నేపథ్యంలో ఆళ్లపై కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ కేసును విచారిస్తున్న సీఐడీ పోలీసులు తాజాగా ఆళ్ల పేరును కూడా విచారణలో చేర్చారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఈ కేసులో 127వ నిందితుడిగా(ఏ-127) పేర్కొనడం గమనార్హం. దీంతో ఆయన ఈ రోజో రేపో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. గతంలో వైసీపీ పాలనలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. కార్యాలయ అద్దాలను ధ్వంసం చేయడంతోపాటు.. ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి కూటమి సర్కారు వచ్చాక విచారణ జరుగుతోంది.
ఇటీవలే ఈ కేసుకు సంబంధించి వైసీపీ నాయకుడు, కీలక సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీ మరోనేత దేవినేని అవినాష్ చౌదరిలను సీఐడీ పోలీసులు విచారించారు. ఇక, ఇప్పటికే 12 మంది వైసీపీ కార్యకర్తలు ఈ కేసులో చిక్కి రిమాండ్ ఖైదీలుగా ఉండగా.. పలువురిని ఇప్పటికే సీఐడీ పోలీసులు విచారించారు. ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు కూడా ఈ కేసులో విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు పార్టీ కార్యాలయం ఉన్న నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు కావడం గమనార్హం. మరి ఈయన ఏం చెబుతారో చూడాలి.
This post was last modified on May 27, 2025 5:03 pm
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…