వైసీపీ నాయకుడు, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్నారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నాయకులపై వరుసగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తాజాగా.. ఆళ్లపైనా పోలీసులు కేసు పెట్టారు. గతంలో 2021-22 మధ్య కాలంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి నేపథ్యంలో ఆళ్లపై కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ కేసును విచారిస్తున్న సీఐడీ పోలీసులు తాజాగా ఆళ్ల పేరును కూడా విచారణలో చేర్చారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఈ కేసులో 127వ నిందితుడిగా(ఏ-127) పేర్కొనడం గమనార్హం. దీంతో ఆయన ఈ రోజో రేపో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. గతంలో వైసీపీ పాలనలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. కార్యాలయ అద్దాలను ధ్వంసం చేయడంతోపాటు.. ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి కూటమి సర్కారు వచ్చాక విచారణ జరుగుతోంది.
ఇటీవలే ఈ కేసుకు సంబంధించి వైసీపీ నాయకుడు, కీలక సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీ మరోనేత దేవినేని అవినాష్ చౌదరిలను సీఐడీ పోలీసులు విచారించారు. ఇక, ఇప్పటికే 12 మంది వైసీపీ కార్యకర్తలు ఈ కేసులో చిక్కి రిమాండ్ ఖైదీలుగా ఉండగా.. పలువురిని ఇప్పటికే సీఐడీ పోలీసులు విచారించారు. ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు కూడా ఈ కేసులో విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు పార్టీ కార్యాలయం ఉన్న నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు కావడం గమనార్హం. మరి ఈయన ఏం చెబుతారో చూడాలి.
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…