Political News

తెలంగాణ మ‌హిళ‌లు దేశానికి ఆద‌ర్శం: మోడీ ప్ర‌సంశ‌లు

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా మ‌హిళ‌ల‌ను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌శంస‌లతో ముంచెత్తారు. అధునాతన సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవ‌డంలో సంగారెడ్డి మ‌హిళా మ‌ణులు దూకుడుగా ఉన్నార‌ని.. వీరు దేశానికే ఆద‌ర్శ‌మ‌ని కొనియాడారు. వ్య‌వ‌సాయ రంగంలో కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న డ్రోన్ల వినియోగాన్ని తెలంగాణ‌లోని సంగారెడ్డి మ‌హిళ‌లు అందిపుచ్చుకున్నార‌ని ప్ర‌ధాని చెప్పారు. వ్య‌వసాయ ఉత్ప‌త్తుల ర‌క్ష‌ణ‌, పురుగుల మందు పిచికారీ వంటి ప‌నుల‌ను డ్రోన్లు చేస్తాయి.

ఈ సాంకేతిక‌త‌ను దేశ‌వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి కేంద్ర ప్ర‌భుత్వ సాయంతో అందిస్తున్నారు. అయితే.. దేశంలోనే మొద‌టి సారి భారీ సంఖ్య‌లో డ్రోన్లు వినియోగిస్తున్న మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఉన్న జిల్లాగా సంగా రెడ్డి గుర్తింపు పొందింది. ఈ విష‌యాన్నే ప్ర‌ధాని మోడీ త‌న మ‌న్‌కీ బాత్‌లో ప్ర‌సంగంలో పేర్కొన్నారు. ప్ర‌తి నెలా చివ‌రి ఆదివారం నిర్వ‌హించే మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మం ఈ సారి.. ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత‌.. తొలిసారి మే 25న రావ‌డంతో ప్ర‌ధాని ఎక్కువ‌గా ఆప‌రేష‌న్ సిందూర్ పైనే ఫోక‌స్ చేశారు.

అయితే.. ఇదేస‌మ‌యంలో తెలంగాణ మ‌హిళ‌లు సాధించిన విజ‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. ఇక, ఆపరేష‌న్ సిందూర్‌ విష‌యంలో దేశం మొత్తం కేంద్రం వెంటే న‌డిచింద‌ని ప్ర‌ధాని అన్నారు. భార‌త సైనికుల‌కు ఊరూ వాడా ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలిపార‌ని అన్నారు. తిరంగా యాత్ర‌ల ద్వారా.. సైనికుల‌కు మ‌ద్ద‌తు తెలిపార‌ని..తద్వారా దేశం మొత్తం ఒక్క‌టే అన్న భావ‌న‌ను స్ప‌ష్టీక‌రించార‌ని మోడీ చెప్పారు. ఉగ్ర‌వాదాన్ని ఏ రూపంలో ఉన్నా స‌హించేది లేద‌న్నారు.

“ఉగ్రవాదనికి వ్యతిరేకంగా చేప‌ట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆపరేషన్‌ సమయంలో జన్మించిన చిన్నారులకు పలువురు ‘సిందూర్‌’ అని పేరు పెట్టుకున్నారు. ఇది దేశాన్ని మ‌రింత ఉత్తేజప‌రిచింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైంది. నేడు ప్రతి భారతీయుడు ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే సంకల్పంతో ఉన్నాడు. ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం సైనిక చర్య మాత్రమే కాదు.. మన ధైర్యం, దేశభక్తితో నిండిన నవభారతానికి నిదర్శనం.”అని ప్ర‌ధాని మోడీ ఉద్ఘాటించారు.

This post was last modified on May 25, 2025 2:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విచార‌ణ మ‌ధ్య‌లో `సెక్స్` వీడియోలు.. హైకోర్టు జ‌డ్జికి షాక్‌!

అది ఢిల్లీ హైకోర్టు. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఓ కేసు విచార‌ణను ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జ‌రిగాయి. వ‌ర్చువ‌ల్ విచార‌ణ‌లో…

4 hours ago

ప‌సుపు జెండా పౌరుషం ఎప్పుడూ త‌గ్గ‌లేదు

టీడీపీ నూత‌న కార్య‌వ‌ర్గ ప్ర‌మాణ స్వీకారం ఘ‌నంగా జ‌రిగింది. ఇటీవ‌ల పార్టీలో జాతీయ‌, రాష్ట్ర స్థాయి కార్య‌వ‌ర్గాల‌తోపాటు.. పొలిట్ బ్యూరోను…

7 hours ago

పెద్ద ట్విస్టు… పెద్ది విడుదల తేదీ ఇదా

మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి…

8 hours ago

కేర‌ళం నాడి: విజ‌య‌న్‌.. ప‌రాజ‌య‌న్‌.. కాంగ్రెస్‌కే మొగ్గు!

కేర‌ళంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తోందా? అంటే.. ఔన‌నే అంటు న్నాయి……

9 hours ago

అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్‌… స‌ర్వేల‌న్నీ.. క‌మ‌లం వైపే!

ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ త‌న ప‌ట్టును వ‌రుసగా మూడో సారి కూడా నిలబెట్టుకుంటోంద‌ని స‌ర్వే సంస్థ‌లు తేల్చి చెప్పాయి.…

9 hours ago

మోదీ vs దీదీ – బెంగాల్ పీఠం ఎవరిది? ఎగ్సిట్ పోల్స్ వచ్చేశాయి…

దీదీనా-మోదీనా నినాదంతో జ‌రిగిన ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోటీలో మోదీదే పైచేయి అని బీజేపీనే విజ‌యం ద‌క్కించు కుంటుంద‌ని…

9 hours ago